రైజా విల్సన్.. నెల కిందట సోషల్ మీడియాలో మార్మోగిన పేరు. ఈ తమిళ నటి తన అందానికి మెరుగులు దిద్దుకునేందుకు ఒక డెర్మటాలజిస్టును సంప్రదించడం.. ఆమె చేసిన ఓ చర్మ చికిత్స వికటించి రైజా విల్సన్ అంద విహీనంగా తయారు కావడం తెలిసిందే. కంటి కింది భాగం వాచిపోయి.. ముఖారవిందం దెబ్బ తిన్న స్థితిలో రైజా పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపింది. తనకు సదరు డెర్మటాలజిస్టు చేసిన చికిత్స వల్లే ఇలా జరిగిందంటూ ఆమె బోరున విలపించింది.
అవసరం లేకపోయినా ఆ వైద్యురాలు ఒత్తిడి చేసి ఈ చికిత్స చేశారని, ఫలితంగా తాను అందవిహీనంగా మారినట్టు చెప్పుకొచ్చింది. తనకు జరిగిన నష్టానికి కోటి రూపాయల నష్టపరిహారంతో చికిత్సకు తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. దీనిపై ఆ లేడీ డాక్టర్ కూడా దీటుగానే స్పందించింది. తన పేరును దెబ్బ తీసినందుకు రైజాపై రూ.5 కోట్లకు పరువునష్టం దావా వేసింది. ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇద్దరూ రాజీకి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు జనాలు. ఐతే ఈ గొడవ తర్వాత నెల రోజులకు పైగా కనిపించకుండా పోయిన రైజా.. ఎట్టకేలకు మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చింది.
రైజా విల్సన్ ముఖం ఇప్పుడు పూర్వస్థితికి చేరుకుంది. కళ్ల కింద వాపు తగ్గింది. మళ్లీ రైజా అందంగా తయారైంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఐతే డాక్టర్తో గొడవ, చర్మ చికిత్స వికటించడం గురించి ఆమె ఇప్పుడేమీ మాట్లాడట్లేదు. గొడవ సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. తమిళంలో రైజా విల్సన్ ‘వేలైయిల్ల పట్టాదారి-2’, ‘ప్యార్ ప్రేమ కాదల్’, ‘వర్మ’ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఎఫ్ఐఆర్’ సహా నాలుగైదు సినిమాలున్నాయి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…