రైజా విల్సన్.. నెల కిందట సోషల్ మీడియాలో మార్మోగిన పేరు. ఈ తమిళ నటి తన అందానికి మెరుగులు దిద్దుకునేందుకు ఒక డెర్మటాలజిస్టును సంప్రదించడం.. ఆమె చేసిన ఓ చర్మ చికిత్స వికటించి రైజా విల్సన్ అంద విహీనంగా తయారు కావడం తెలిసిందే. కంటి కింది భాగం వాచిపోయి.. ముఖారవిందం దెబ్బ తిన్న స్థితిలో రైజా పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపింది. తనకు సదరు డెర్మటాలజిస్టు చేసిన చికిత్స వల్లే ఇలా జరిగిందంటూ ఆమె బోరున విలపించింది.
అవసరం లేకపోయినా ఆ వైద్యురాలు ఒత్తిడి చేసి ఈ చికిత్స చేశారని, ఫలితంగా తాను అందవిహీనంగా మారినట్టు చెప్పుకొచ్చింది. తనకు జరిగిన నష్టానికి కోటి రూపాయల నష్టపరిహారంతో చికిత్సకు తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. దీనిపై ఆ లేడీ డాక్టర్ కూడా దీటుగానే స్పందించింది. తన పేరును దెబ్బ తీసినందుకు రైజాపై రూ.5 కోట్లకు పరువునష్టం దావా వేసింది. ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇద్దరూ రాజీకి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు జనాలు. ఐతే ఈ గొడవ తర్వాత నెల రోజులకు పైగా కనిపించకుండా పోయిన రైజా.. ఎట్టకేలకు మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చింది.
రైజా విల్సన్ ముఖం ఇప్పుడు పూర్వస్థితికి చేరుకుంది. కళ్ల కింద వాపు తగ్గింది. మళ్లీ రైజా అందంగా తయారైంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఐతే డాక్టర్తో గొడవ, చర్మ చికిత్స వికటించడం గురించి ఆమె ఇప్పుడేమీ మాట్లాడట్లేదు. గొడవ సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. తమిళంలో రైజా విల్సన్ ‘వేలైయిల్ల పట్టాదారి-2’, ‘ప్యార్ ప్రేమ కాదల్’, ‘వర్మ’ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఎఫ్ఐఆర్’ సహా నాలుగైదు సినిమాలున్నాయి.
This post was last modified on May 26, 2021 7:27 pm
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…