హిందీలో ఎక్కువ సినిమాలు చేసి ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తెలుగు కథానాయకుల్లో నాగార్జున పేరు ముందుగా చెప్పుకోవాలి. గత రెండు దశాబ్దాల్లో ఆయన బాలీవుడ్లో పెద్దగా సినిమాలు చేయలేదు కానీ.. 90ల్లో ‘శివ’ సినిమాతో మొదలుపెట్టి ఖుదా గవా, ద్రోహి, అంగారే, క్రిమినల్ లాంటి హిందీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఐతే 2002లో ‘అగ్నివర్ష’ చేశాక నాగ్ మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు.
సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ఇప్పుడు అక్కడ ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయనది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. అరగంట నిడివితో ఆయన పాత్ర ఉంటుంది. ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి ఇంతకుముందే మీడియాకు కొన్ని విశేషాలు వెల్లడించాడు నాగ్. ఇప్పుడు తాజాగా ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బ్రహ్మాస్త్ర’ గురించి మరికొన్ని ముచ్చట్లు చెప్పాడు.
‘బ్రహ్మాస్త్ర’ 5 వేల ఏళ్ల కిందటి నేపథ్యంలో సాగే సినిమా అని నాగ్ చెప్పడం విశేషం. ఎంత పీరియడ్ మూవీ అయినా సరే.. కొన్ని వందల ఏళ్ల వెనుకటి నేపథ్యాన్ని తీసుకుంటూ ఉంటారు దర్శకులు. కానీ ఏకంగా 5 వేల ఏళ్ల కిందటి బ్యాక్ డ్రాప్ అంటే ప్రేక్షకులను దర్శకుడు అయాన్ ముఖర్జీ ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లబోతున్నట్లే. తనకు బేసిగ్గా మైథాలజీ జానర్ అంటే చాలా ఇష్టమని.. రామాయణం, మహాభారతం లాంటి కథలపై అమితాసక్తి ఉందని.. ఈ నేపథ్యంలోనే ‘బ్రహ్మాస్త్ర’ లాంటి లార్జర్ దన్ లైఫ్ సినిమాలో నటించడానికి ముందుకొచ్చానని నాగ్ తెలిపాడు.
నిడివితో సంబంధం లేకుండా ఈ సినిమాలో తన పాత్ర కీలకంగా ఉంటుందని నాగ్ ఇంతకుముందే చెప్పాడు. ఇక రణబీర్, ఆలియాలతో కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ చాలా మంచి నటులని, అలాగే ఇద్దరిలోనూ మంచి ఎనర్జీ ఉంటుందని, సెట్స్లో అలాంటి వ్యక్తులు ఉంటే తాను మరింత ఉత్సాహంగా పని చేస్తానని నాగ్ అన్నాడు.
This post was last modified on May 26, 2021 11:18 am
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…