కరోనా వైరస్ కారణంగా ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. వడ్డీల భారాన్ని నెలలకు నెలలు మోయడం కంటే.. నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేసుకుని వచ్చిన కాడికి లాభం చేసుకుందామని చూస్తున్నారు ఫిలిం మేకర్స్. ఈ ఉద్దేశంతోనే బాలీవుడ్తో పాటు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన నిర్మాతలు ముందుకు కదిలారు.
హిందీలో అమితాబ్ బచ్చన్ సినిమా ‘గులాబో సితాబో’తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖి నటించిన ‘గూమ్ కేతు’ కూడా డైరెక్ట్ ఆన్ లైన్లో రిలీజవుతున్నాయి. ఇక అమేజాన్ ప్రైమ్ వాళ్లు ‘గులాబో సితాబో’తో పాటుగా వివిధ భాషలకు చెందిన ఏడు సినిమాల్ని నెల రోజుల వ్యవధిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఐతే అందులో తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. కీర్తి సురేష్ సినిమా ‘పెంగ్విన్’ తెలుగులో కూడా రిలీజవుతున్నప్పటికీ అది పక్కా తమిళ చిత్రమే.
తెలుగు నుంచి ఇంతకుముందు ‘అమృతారామమ్’ అనే చిన్న సినిమాను జీ5లో రిలీజ్ చేశారు. కానీ అది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఆ సినిమా బాగుండి మంచి స్పందన తెచ్చుకుని ఉంటే.. టాలీవుడ్లో కదలిక వచ్చేదేమో.
దాని కంటే ముందు అమేజాన్ ప్రైమ్ వాళ్లు తెలుగులో కాస్త పేరున్న సినిమాలను కొని డైరెక్టుగా రిలీజ్ చేయాలని చూశారు. రామ్ సినిమా ‘రెడ్’, నాని మూవీ ‘వి’ ఆ జాబితాలో ఉన్నాయి. కానీ మంచి ఆఫర్లు ఇచ్చినా ఆ చిత్రాల నిర్మాతలు అంగీకరించలేదు. తమవి థియేటర్లలో చూసి అనుభూతి చెందాల్సిన సినిమాలంటూ వెనక్కి తగ్గారు.
ఐతే ఇప్పుడు వేరే భాష్లలో పెద్ద సినిమాలే నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజవుతుండటం.. వాటికి మంచి డీల్స్ రావడం.. పెట్టుబడి మీద లాభాలకే సినిమాలు అమ్ముడవడంతో మన నిర్మాతల్లో కచ్చితంగా కదలిక రాకపోదు. థియేట్రికల్ రిలీజ్ను నమ్ముకుని నెలలకు నెలలు ఫైనాన్స్ వడ్డీలు మోస్తే కచ్చితంగా భారమవుతుంది.
థియేటర్లు తెరుచుకున్నా కూడా కెపాసిటీ తగ్గించడంతో పాటు అనేక ఆంక్షల నేపథ్యంలో రెవెన్యూ కొన్ని నెలల పాటు ఆశించిన స్థాయిలో ఉండదు. కాబట్టి పరిస్థితులు బాగు పడే వరకు ఎదురు చూడాలి. అది ఎన్ని నెలలో తెలియదు. థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాక ఓటీటీల నుంచి ఇప్పుడున్న ఆఫర్లుండవు. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతలు కూడా ఓటీటీ రిలీజ్ వైపు చూడక తప్పదేమో.
This post was last modified on May 16, 2020 12:04 am
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…