కరోనా వైరస్ కారణంగా ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. వడ్డీల భారాన్ని నెలలకు నెలలు మోయడం కంటే.. నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేసుకుని వచ్చిన కాడికి లాభం చేసుకుందామని చూస్తున్నారు ఫిలిం మేకర్స్. ఈ ఉద్దేశంతోనే బాలీవుడ్తో పాటు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన నిర్మాతలు ముందుకు కదిలారు.
హిందీలో అమితాబ్ బచ్చన్ సినిమా ‘గులాబో సితాబో’తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖి నటించిన ‘గూమ్ కేతు’ కూడా డైరెక్ట్ ఆన్ లైన్లో రిలీజవుతున్నాయి. ఇక అమేజాన్ ప్రైమ్ వాళ్లు ‘గులాబో సితాబో’తో పాటుగా వివిధ భాషలకు చెందిన ఏడు సినిమాల్ని నెల రోజుల వ్యవధిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఐతే అందులో తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. కీర్తి సురేష్ సినిమా ‘పెంగ్విన్’ తెలుగులో కూడా రిలీజవుతున్నప్పటికీ అది పక్కా తమిళ చిత్రమే.
తెలుగు నుంచి ఇంతకుముందు ‘అమృతారామమ్’ అనే చిన్న సినిమాను జీ5లో రిలీజ్ చేశారు. కానీ అది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఆ సినిమా బాగుండి మంచి స్పందన తెచ్చుకుని ఉంటే.. టాలీవుడ్లో కదలిక వచ్చేదేమో.
దాని కంటే ముందు అమేజాన్ ప్రైమ్ వాళ్లు తెలుగులో కాస్త పేరున్న సినిమాలను కొని డైరెక్టుగా రిలీజ్ చేయాలని చూశారు. రామ్ సినిమా ‘రెడ్’, నాని మూవీ ‘వి’ ఆ జాబితాలో ఉన్నాయి. కానీ మంచి ఆఫర్లు ఇచ్చినా ఆ చిత్రాల నిర్మాతలు అంగీకరించలేదు. తమవి థియేటర్లలో చూసి అనుభూతి చెందాల్సిన సినిమాలంటూ వెనక్కి తగ్గారు.
ఐతే ఇప్పుడు వేరే భాష్లలో పెద్ద సినిమాలే నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజవుతుండటం.. వాటికి మంచి డీల్స్ రావడం.. పెట్టుబడి మీద లాభాలకే సినిమాలు అమ్ముడవడంతో మన నిర్మాతల్లో కచ్చితంగా కదలిక రాకపోదు. థియేట్రికల్ రిలీజ్ను నమ్ముకుని నెలలకు నెలలు ఫైనాన్స్ వడ్డీలు మోస్తే కచ్చితంగా భారమవుతుంది.
థియేటర్లు తెరుచుకున్నా కూడా కెపాసిటీ తగ్గించడంతో పాటు అనేక ఆంక్షల నేపథ్యంలో రెవెన్యూ కొన్ని నెలల పాటు ఆశించిన స్థాయిలో ఉండదు. కాబట్టి పరిస్థితులు బాగు పడే వరకు ఎదురు చూడాలి. అది ఎన్ని నెలలో తెలియదు. థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాక ఓటీటీల నుంచి ఇప్పుడున్న ఆఫర్లుండవు. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతలు కూడా ఓటీటీ రిలీజ్ వైపు చూడక తప్పదేమో.
This post was last modified on May 16, 2020 12:04 am
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…