కరోనా వైరస్ కారణంగా ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. వడ్డీల భారాన్ని నెలలకు నెలలు మోయడం కంటే.. నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేసుకుని వచ్చిన కాడికి లాభం చేసుకుందామని చూస్తున్నారు ఫిలిం మేకర్స్. ఈ ఉద్దేశంతోనే బాలీవుడ్తో పాటు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన నిర్మాతలు ముందుకు కదిలారు.
హిందీలో అమితాబ్ బచ్చన్ సినిమా ‘గులాబో సితాబో’తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖి నటించిన ‘గూమ్ కేతు’ కూడా డైరెక్ట్ ఆన్ లైన్లో రిలీజవుతున్నాయి. ఇక అమేజాన్ ప్రైమ్ వాళ్లు ‘గులాబో సితాబో’తో పాటుగా వివిధ భాషలకు చెందిన ఏడు సినిమాల్ని నెల రోజుల వ్యవధిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఐతే అందులో తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. కీర్తి సురేష్ సినిమా ‘పెంగ్విన్’ తెలుగులో కూడా రిలీజవుతున్నప్పటికీ అది పక్కా తమిళ చిత్రమే.
తెలుగు నుంచి ఇంతకుముందు ‘అమృతారామమ్’ అనే చిన్న సినిమాను జీ5లో రిలీజ్ చేశారు. కానీ అది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఆ సినిమా బాగుండి మంచి స్పందన తెచ్చుకుని ఉంటే.. టాలీవుడ్లో కదలిక వచ్చేదేమో.
దాని కంటే ముందు అమేజాన్ ప్రైమ్ వాళ్లు తెలుగులో కాస్త పేరున్న సినిమాలను కొని డైరెక్టుగా రిలీజ్ చేయాలని చూశారు. రామ్ సినిమా ‘రెడ్’, నాని మూవీ ‘వి’ ఆ జాబితాలో ఉన్నాయి. కానీ మంచి ఆఫర్లు ఇచ్చినా ఆ చిత్రాల నిర్మాతలు అంగీకరించలేదు. తమవి థియేటర్లలో చూసి అనుభూతి చెందాల్సిన సినిమాలంటూ వెనక్కి తగ్గారు.
ఐతే ఇప్పుడు వేరే భాష్లలో పెద్ద సినిమాలే నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజవుతుండటం.. వాటికి మంచి డీల్స్ రావడం.. పెట్టుబడి మీద లాభాలకే సినిమాలు అమ్ముడవడంతో మన నిర్మాతల్లో కచ్చితంగా కదలిక రాకపోదు. థియేట్రికల్ రిలీజ్ను నమ్ముకుని నెలలకు నెలలు ఫైనాన్స్ వడ్డీలు మోస్తే కచ్చితంగా భారమవుతుంది.
థియేటర్లు తెరుచుకున్నా కూడా కెపాసిటీ తగ్గించడంతో పాటు అనేక ఆంక్షల నేపథ్యంలో రెవెన్యూ కొన్ని నెలల పాటు ఆశించిన స్థాయిలో ఉండదు. కాబట్టి పరిస్థితులు బాగు పడే వరకు ఎదురు చూడాలి. అది ఎన్ని నెలలో తెలియదు. థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాక ఓటీటీల నుంచి ఇప్పుడున్న ఆఫర్లుండవు. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతలు కూడా ఓటీటీ రిలీజ్ వైపు చూడక తప్పదేమో.
This post was last modified on May 16, 2020 12:04 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…