కరోనా వైరస్ కారణంగా ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. వడ్డీల భారాన్ని నెలలకు నెలలు మోయడం కంటే.. నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేసుకుని వచ్చిన కాడికి లాభం చేసుకుందామని చూస్తున్నారు ఫిలిం మేకర్స్. ఈ ఉద్దేశంతోనే బాలీవుడ్తో పాటు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన నిర్మాతలు ముందుకు కదిలారు.
హిందీలో అమితాబ్ బచ్చన్ సినిమా ‘గులాబో సితాబో’తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖి నటించిన ‘గూమ్ కేతు’ కూడా డైరెక్ట్ ఆన్ లైన్లో రిలీజవుతున్నాయి. ఇక అమేజాన్ ప్రైమ్ వాళ్లు ‘గులాబో సితాబో’తో పాటుగా వివిధ భాషలకు చెందిన ఏడు సినిమాల్ని నెల రోజుల వ్యవధిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఐతే అందులో తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. కీర్తి సురేష్ సినిమా ‘పెంగ్విన్’ తెలుగులో కూడా రిలీజవుతున్నప్పటికీ అది పక్కా తమిళ చిత్రమే.
తెలుగు నుంచి ఇంతకుముందు ‘అమృతారామమ్’ అనే చిన్న సినిమాను జీ5లో రిలీజ్ చేశారు. కానీ అది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఆ సినిమా బాగుండి మంచి స్పందన తెచ్చుకుని ఉంటే.. టాలీవుడ్లో కదలిక వచ్చేదేమో.
దాని కంటే ముందు అమేజాన్ ప్రైమ్ వాళ్లు తెలుగులో కాస్త పేరున్న సినిమాలను కొని డైరెక్టుగా రిలీజ్ చేయాలని చూశారు. రామ్ సినిమా ‘రెడ్’, నాని మూవీ ‘వి’ ఆ జాబితాలో ఉన్నాయి. కానీ మంచి ఆఫర్లు ఇచ్చినా ఆ చిత్రాల నిర్మాతలు అంగీకరించలేదు. తమవి థియేటర్లలో చూసి అనుభూతి చెందాల్సిన సినిమాలంటూ వెనక్కి తగ్గారు.
ఐతే ఇప్పుడు వేరే భాష్లలో పెద్ద సినిమాలే నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజవుతుండటం.. వాటికి మంచి డీల్స్ రావడం.. పెట్టుబడి మీద లాభాలకే సినిమాలు అమ్ముడవడంతో మన నిర్మాతల్లో కచ్చితంగా కదలిక రాకపోదు. థియేట్రికల్ రిలీజ్ను నమ్ముకుని నెలలకు నెలలు ఫైనాన్స్ వడ్డీలు మోస్తే కచ్చితంగా భారమవుతుంది.
థియేటర్లు తెరుచుకున్నా కూడా కెపాసిటీ తగ్గించడంతో పాటు అనేక ఆంక్షల నేపథ్యంలో రెవెన్యూ కొన్ని నెలల పాటు ఆశించిన స్థాయిలో ఉండదు. కాబట్టి పరిస్థితులు బాగు పడే వరకు ఎదురు చూడాలి. అది ఎన్ని నెలలో తెలియదు. థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాక ఓటీటీల నుంచి ఇప్పుడున్న ఆఫర్లుండవు. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతలు కూడా ఓటీటీ రిలీజ్ వైపు చూడక తప్పదేమో.
This post was last modified on May 16, 2020 12:04 am
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…