‘ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్ కోసం భారతీయ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. ఆ సిరీస్ మీద వివాదం ముసురుకోవడం వారికి నిరాశ కలిగిస్తోంది. ఇందులో సమంత పోషించిన ఎల్టీటీఈ టెర్రరిస్టు పాత్ర పట్ల తమిళులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ టైగర్లను చెడుగా చూపిస్తున్నారన్నది వారి వాదన. దీనిపై ఓ ఎంపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్కు లేఖ రాయడం, ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కోరడంతో ఎక్కడ ఈ షోకు బ్రేక్ పడుతుందో అన్న భయాలు నెలకొన్నాయి.
జూన్ 4 నుంచి ‘ఫ్యామిలీ మ్యాన్-2’ అమేజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. తమ సిరీస్ ట్రైలర్ వివాదానికి దారి తీసిన నేపథ్యంలో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ దర్శకుడు రాజ్-డీకే స్పందించారు. ట్రైలర్ చూసి ఒక అంచనాకు రావొద్దని కోరారు. అందరూ అనుకుంటున్నట్లు తాము ఈ సిరీస్ను ఎవరి మనోభావాలు దెబ్బ తీసేలా రూపొందించలేదన్నారు.
“ఫ్యామిలీ మ్యాన్-2 విడుదలయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ వేచి చూడాల్సిందిగా మేము కోరుతున్నాం. ఒకసారి మీరు ఈ షో చూసిన తర్వాత తప్పనిసరిగా ప్రశంసిస్తారని మాకు తెలుసు. ట్రైలర్లో కొన్ని షాట్లు మాత్రమే చూసి కొంత మంది కథాం శం అంచనా వేస్తున్నారు. సిరీస్ను తప్పుగా చూస్తున్నారు. ఈ షోలో ప్రధాన తారాగణంతో పాటు మా టీంలో చాలామంది తమిళులున్నారు. మాకు కూడా తమిళ ప్రజల మనోభావాలు, వారి సంస్కృతి పట్ల బాగా అవగాహ న ఉంది.
అలాంటపుడు వారిని బాధ పెట్టేలా షోను ఎందుకు రూపొందిస్తాం? ఈ షో రూపకల్పనలో ఎన్నో సంవత్సరాల కష్టం దాగివుంది. సీజన్-1లో ఏ విధంగా అయితే సున్నితమైన, సమతూకం ఉన్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడ్డామో అదే రీతిలో ఈ సీజన్ కోసమూ కష్టపడ్డాము. కాబట్టి షో స్ట్రీమ్ అయ్యే వరకు అందరూ ఎదురు చూసి తర్వాత ఇందులోని కంటెంట్ మీద ఒక అంచనాకు రావాల్సిందిగా కోరుతున్నాం” అని రాజ్-డీకే అన్నారు.
This post was last modified on May 24, 2021 2:01 pm
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…