‘ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్ కోసం భారతీయ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. ఆ సిరీస్ మీద వివాదం ముసురుకోవడం వారికి నిరాశ కలిగిస్తోంది. ఇందులో సమంత పోషించిన ఎల్టీటీఈ టెర్రరిస్టు పాత్ర పట్ల తమిళులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ టైగర్లను చెడుగా చూపిస్తున్నారన్నది వారి వాదన. దీనిపై ఓ ఎంపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్కు లేఖ రాయడం, ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కోరడంతో ఎక్కడ ఈ షోకు బ్రేక్ పడుతుందో అన్న భయాలు నెలకొన్నాయి.
జూన్ 4 నుంచి ‘ఫ్యామిలీ మ్యాన్-2’ అమేజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. తమ సిరీస్ ట్రైలర్ వివాదానికి దారి తీసిన నేపథ్యంలో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ దర్శకుడు రాజ్-డీకే స్పందించారు. ట్రైలర్ చూసి ఒక అంచనాకు రావొద్దని కోరారు. అందరూ అనుకుంటున్నట్లు తాము ఈ సిరీస్ను ఎవరి మనోభావాలు దెబ్బ తీసేలా రూపొందించలేదన్నారు.
“ఫ్యామిలీ మ్యాన్-2 విడుదలయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ వేచి చూడాల్సిందిగా మేము కోరుతున్నాం. ఒకసారి మీరు ఈ షో చూసిన తర్వాత తప్పనిసరిగా ప్రశంసిస్తారని మాకు తెలుసు. ట్రైలర్లో కొన్ని షాట్లు మాత్రమే చూసి కొంత మంది కథాం శం అంచనా వేస్తున్నారు. సిరీస్ను తప్పుగా చూస్తున్నారు. ఈ షోలో ప్రధాన తారాగణంతో పాటు మా టీంలో చాలామంది తమిళులున్నారు. మాకు కూడా తమిళ ప్రజల మనోభావాలు, వారి సంస్కృతి పట్ల బాగా అవగాహ న ఉంది.
అలాంటపుడు వారిని బాధ పెట్టేలా షోను ఎందుకు రూపొందిస్తాం? ఈ షో రూపకల్పనలో ఎన్నో సంవత్సరాల కష్టం దాగివుంది. సీజన్-1లో ఏ విధంగా అయితే సున్నితమైన, సమతూకం ఉన్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడ్డామో అదే రీతిలో ఈ సీజన్ కోసమూ కష్టపడ్డాము. కాబట్టి షో స్ట్రీమ్ అయ్యే వరకు అందరూ ఎదురు చూసి తర్వాత ఇందులోని కంటెంట్ మీద ఒక అంచనాకు రావాల్సిందిగా కోరుతున్నాం” అని రాజ్-డీకే అన్నారు.
This post was last modified on May 24, 2021 2:01 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…