‘ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్ కోసం భారతీయ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. ఆ సిరీస్ మీద వివాదం ముసురుకోవడం వారికి నిరాశ కలిగిస్తోంది. ఇందులో సమంత పోషించిన ఎల్టీటీఈ టెర్రరిస్టు పాత్ర పట్ల తమిళులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ టైగర్లను చెడుగా చూపిస్తున్నారన్నది వారి వాదన. దీనిపై ఓ ఎంపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్కు లేఖ రాయడం, ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కోరడంతో ఎక్కడ ఈ షోకు బ్రేక్ పడుతుందో అన్న భయాలు నెలకొన్నాయి.
జూన్ 4 నుంచి ‘ఫ్యామిలీ మ్యాన్-2’ అమేజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. తమ సిరీస్ ట్రైలర్ వివాదానికి దారి తీసిన నేపథ్యంలో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ దర్శకుడు రాజ్-డీకే స్పందించారు. ట్రైలర్ చూసి ఒక అంచనాకు రావొద్దని కోరారు. అందరూ అనుకుంటున్నట్లు తాము ఈ సిరీస్ను ఎవరి మనోభావాలు దెబ్బ తీసేలా రూపొందించలేదన్నారు.
“ఫ్యామిలీ మ్యాన్-2 విడుదలయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ వేచి చూడాల్సిందిగా మేము కోరుతున్నాం. ఒకసారి మీరు ఈ షో చూసిన తర్వాత తప్పనిసరిగా ప్రశంసిస్తారని మాకు తెలుసు. ట్రైలర్లో కొన్ని షాట్లు మాత్రమే చూసి కొంత మంది కథాం శం అంచనా వేస్తున్నారు. సిరీస్ను తప్పుగా చూస్తున్నారు. ఈ షోలో ప్రధాన తారాగణంతో పాటు మా టీంలో చాలామంది తమిళులున్నారు. మాకు కూడా తమిళ ప్రజల మనోభావాలు, వారి సంస్కృతి పట్ల బాగా అవగాహ న ఉంది.
అలాంటపుడు వారిని బాధ పెట్టేలా షోను ఎందుకు రూపొందిస్తాం? ఈ షో రూపకల్పనలో ఎన్నో సంవత్సరాల కష్టం దాగివుంది. సీజన్-1లో ఏ విధంగా అయితే సున్నితమైన, సమతూకం ఉన్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడ్డామో అదే రీతిలో ఈ సీజన్ కోసమూ కష్టపడ్డాము. కాబట్టి షో స్ట్రీమ్ అయ్యే వరకు అందరూ ఎదురు చూసి తర్వాత ఇందులోని కంటెంట్ మీద ఒక అంచనాకు రావాల్సిందిగా కోరుతున్నాం” అని రాజ్-డీకే అన్నారు.
This post was last modified on May 24, 2021 2:01 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…