‘1 నేనొక్కడినే’ తర్వాత మహేష్ బాబుతో రెండో సినిమా చేయాలని అనుకున్నపుడు సుకుమార్ ముందుగా అనుకున్న కథ.. తెలంగాణ రజాకార్లపై సాగిన సాయుధ పోరాటం నేపథ్యంలో కావడం విశేషం. ఈ పోరాటం మీద సుక్కు చాలా పుస్తకాలు చదివారు. కొన్ని నెలల పాటు పరిశోధన కూడా జరిపారు. ఐతే ఆ కథ మహేష్కు సూట్ కాదని తర్వాత వెనక్కి తగ్గారు.
ఆపై ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ రెడీ చేసుకున్నారు. అనివార్య కారణాల వల్ల అది కూడా మహేష్తో వర్కవుట్ కాలేదు. ఈ కథను అల్లు అర్జున్తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఐతే భవిష్యత్తులో తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సుక్కు సినిమా తీసే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. ఐతే ఈలోపు మరో దర్శకుడు ఈ కథ మీద వర్క్ చేస్తున్నట్లు చెప్పడం విశేషం. మెగాస్టార్ చిరంజీవితో ఆ సినిమా చేయాలనుకుంటున్న దర్శకడు సంపత్ నంది కావడం విశేషం.
చిరు తనయుడు చరణ్తో ‘రచ్చ’ లాంటి హిట్ తీసిన సంపత్.. పవన్తో ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ చేయాల్సింది కానీ.. అది వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం అతను గోపీచంద్తో ‘సీటీ మార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఆ చిత్ర షూటింగ్కు బ్రేక్ పడింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంపత్.. తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి వివరించాడు.
తాను తెలంగాణ రజాకార్ల నేపథ్యంలో పరిశోధన జరిపి ఓ కథ తయారు చేస్తున్నానని.. ఆ కథను చిరంజీవితో చేయాలన్నది తన కల అని సంపత్ చెప్పాడు. ఇక పవన్తో మళ్లీ పని చేస్తారా అని అడిగితే.. తప్పకుండా చేస్తానని సంపత్ తెలిపాడు. ఇప్పటికే పవన్ కోసం ఓ కథ తయారు చేశాని.. ‘సీీటీ మార్’ రిలీజ్ తర్వాత వెళ్లి పవన్కు స్టోరీ చెబుతానని అతనన్నాడు. ‘సీటీ మార్’ చిత్రీకరణ 40 శాతం పూర్తయిందని.. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజవుతుందని తెలిపాడు.
This post was last modified on May 16, 2020 12:02 am
ఆగస్ట్ నుంచి తప్పుకున్నాక ది ప్యారడైజ్ కొత్త విడుదల తేదీ ఇప్పటిదాకా ప్రకటించలేదు. సెప్టెంబర్ 24 అని బలంగా ప్రచారం…
ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురంకు ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం…
ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తే కాక్రోచ్లు లేస్తాయని, ఆంధ్రప్రదేశ్లో తాము కూడా కాక్రోచ్లమేనని అని స్వయాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్…
రాజకీయ రంగప్రవేశానికి ముందు ఇదే తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడు థియేటర్లలో అడుగు పెట్టేసింది. తమిళనాడులో…
యువత, సోలో లాంటి చిత్రాలతో మెప్పించి.. ‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగులో మంచి డిమాండ్ తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్. ఆ…
వైద్య విద్య చదవాలని అనుకునే విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఏక కాలంలో నిర్వహించే 'నీట్' పరీక్షకు సంబధించిన ప్రశ్నపత్రం లీకై.. సరిగ్గా…