టాలీవుడ్ మరోసారి సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ పరిశ్రమను గట్టి దెబ్బే కొట్టేలా కనిపిస్తోంది. గత ఏడాది ఐదారు నెలలు షూటింగ్స్ ఆగిపోయి, ఏడెనిమిది నెలల పాటు థియేటర్లు నడవక పరిశ్రమకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. మిగతా పరిశ్రమలతో పోలిస్తే ఈ సంక్షోభం నుంచి టాలీవుడ్ త్వరగానే కోలుకుంది. షూటింగ్స్ మళ్లీ ఊపందుకున్నాయి. థియేటర్లూ కళకళలాడాయి. దీంతో ఇక చెడ్డ రోజులన్నీ వెళ్లిపోయాయని.. ఇక ఎప్పటికీ ఇలాంటి కష్టం ఉండదని అనుకున్నారు. కానీ గత నెలలో చూస్తుండగానే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మళ్లీ షూటింగ్స్ ఆగాయి. థియేటర్లు మూతపడ్డాయి. మళ్లీ గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే థియేటర్లు మూతపడి నెల రోజులు కావస్తోంది.
ఇప్పుడిప్పుడే అవి తెరుచుకుంటాయన్న ఆశలు కనిపించడం లేదు. లాక్ డౌన్ కొనసాగుతుండటంతో షూటింగ్స్ సైతం పున:ప్రారంభం అయ్యే సంకేతాలు కనిపించడం లేదు. మళ్లీ ఎప్పుడు మునుపటి పరిస్థితులు నెలకొంటాయో తెలియట్లేదు. దసరా వరకు థియేటర్లు తెరుచుకోవని.. ఏపీలో అయితే థియేటర్లు ఎప్పుడు తెరుచుకున్నా వచ్చే సంక్రాంతి వరకు 50 శాతం ఆక్యుపెన్సీనే ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇంకో రెండు నెలల వరకు షూటింగ్స్ మొదలయ్యే పరిస్థితీ ఉండదన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఈ వార్తలు సినీ జనాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేవే.
ఐతే టాలీవుడ్ సినీ పెద్దలు, ప్రముఖుల ఆలోచన అయితే ఇలా లేదని సమాచారం. పెద్ద చిత్రాల మేకర్స్ అంచనాలు వేరుగా ఉన్నాయి. కరోనా తీవ్రత నెమ్మదిగా తగ్గుతుండటం పట్ల ఆశాభావంతో ఉన్నారు వాళ్లందరూ. లాక్ డౌన్ పెట్టారు కాబట్టి మున్ముందు మరింతగా తీవ్రత తగ్గుతుందని.. జూన్ నెలను కూడా వదిలేస్తే జులై తొలి వారం నుంచి షూటింగ్స్కు వెళ్లిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ దిశగా ప్రణాళికలు కూడా వేసుకుంటున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో టచ్లో ఉంటూ డేట్లు సర్దుబాటు చేసి కొత్త షెడ్యూళ్లు వేస్తున్నారు. ఇక థియేటర్ల విషయానికి వస్తే.. ఆగస్టులో అవి మళ్లీ మొదలవుతాయని.. ముందు 50 శాతం ఆక్యుపెన్సీనే ఉంటుందనే అంచనాతో ఉన్నారు సినీ పెద్దలు.
This post was last modified on May 22, 2021 3:11 pm
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…