తమిళంలో సి.వి.కుమార్ అని ఓ మంచి నిర్మాత. పా.రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్ లాంటి గొప్ప దర్శకుల్ని పరిచయం చేసింది ఇతనే. అట్టకత్తి, పిజ్జా, సూదుకవ్వుం, ఇండ్రు నేట్రు నాలై, ఇరైవి.. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అతను నిర్మించాడు. అతడి ప్రతి సినిమా ఒక ప్రయోగమే. కేవల నిర్మాత పేరు చూసి.. ఇందులో ఏదో కొత్తదనం ఉంటుంది అని తమిళ ప్రేక్షకులు వచ్చే స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం కుమార్కే చెల్లింది.
నిర్మాతగా ఎన్నో పరయోగాలు చేసిన కుమార్.. తర్వాత దర్శకుడిగా మారాడు. తన అరంగేట్రం కోసం కూడా ఓ విభిన్నమైన కథనే ఎంచుకున్నాడు. అందులో మన సందీప్ కిషన్ను హీరోగా పెట్టుకున్నాడు. ఆ చిత్రమే.. మాయవన్. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్. కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా చాలా ఆసక్తికరంగా సాగుతాయి. ఆరంభం నుంచి చివరి వరకు ఉత్కంఠ రేపుతుంది.
ఐతే ఈ సినిమాకు పరిమితికి బడ్జెట్ పెట్టిన కుమార్.. తర్వాత అనుకున్న మేర బిజినెస్ చేసుకోలేకపోయాడు. సినిమాకు మంచి రివ్యూలే వచ్చినా అనుకున్నంతగా ఆడలేదు. ఈ సినిమా కారణంగా అతను ఆర్థికంగా బాగా దెబ్బ తిన్నాడు. ఒక్కసారిగా కెరీర్కు బ్రేక్ పడింది. తర్వాత ఇంకో సినిమా డైరెక్ట్ చేస్తే అది సరిగా ఆడలేదు. అతను ప్రొడ్యూస్ చేస్తున్న రెండు సినిమాలు మధ్యలో ఆగాయి.
ఈ నేపథ్యంలో గత ఏడాది ఓ వేడుకలో మాట్లాడుతూ.. ‘మాయవన్’ సినిమా తనను రోడ్డు మీదికి తెచ్చేసిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సినిమా తనను అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసిందన్నాడు. పాపం మంచి సినిమా తీసినా ఇలా కావడం విచారకరమే.
ఐతే ఇప్పుడీ సినిమా ప్రస్తావన ఎందుకు అంటే.. దీన్ని తాజాగా అమేజాన్ ప్రైంలో రిలీజ్ చేశారు. అక్కడ దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. చూసిన వాళ్లందరూ సూపర్ అంటున్నారు. మంచి రివ్యూలు వస్తున్నాయి. ఇలా అయినా కుమార్ ప్రయత్నానికి ప్రశంసలు దక్కి, అతడికి ఆర్థికంగా కొంత ప్రయోజనం చేకూరితే మంచిదే.
This post was last modified on May 15, 2020 1:57 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…