తమిళంలో సి.వి.కుమార్ అని ఓ మంచి నిర్మాత. పా.రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్ లాంటి గొప్ప దర్శకుల్ని పరిచయం చేసింది ఇతనే. అట్టకత్తి, పిజ్జా, సూదుకవ్వుం, ఇండ్రు నేట్రు నాలై, ఇరైవి.. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అతను నిర్మించాడు. అతడి ప్రతి సినిమా ఒక ప్రయోగమే. కేవల నిర్మాత పేరు చూసి.. ఇందులో ఏదో కొత్తదనం ఉంటుంది అని తమిళ ప్రేక్షకులు వచ్చే స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం కుమార్కే చెల్లింది.
నిర్మాతగా ఎన్నో పరయోగాలు చేసిన కుమార్.. తర్వాత దర్శకుడిగా మారాడు. తన అరంగేట్రం కోసం కూడా ఓ విభిన్నమైన కథనే ఎంచుకున్నాడు. అందులో మన సందీప్ కిషన్ను హీరోగా పెట్టుకున్నాడు. ఆ చిత్రమే.. మాయవన్. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్. కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా చాలా ఆసక్తికరంగా సాగుతాయి. ఆరంభం నుంచి చివరి వరకు ఉత్కంఠ రేపుతుంది.
ఐతే ఈ సినిమాకు పరిమితికి బడ్జెట్ పెట్టిన కుమార్.. తర్వాత అనుకున్న మేర బిజినెస్ చేసుకోలేకపోయాడు. సినిమాకు మంచి రివ్యూలే వచ్చినా అనుకున్నంతగా ఆడలేదు. ఈ సినిమా కారణంగా అతను ఆర్థికంగా బాగా దెబ్బ తిన్నాడు. ఒక్కసారిగా కెరీర్కు బ్రేక్ పడింది. తర్వాత ఇంకో సినిమా డైరెక్ట్ చేస్తే అది సరిగా ఆడలేదు. అతను ప్రొడ్యూస్ చేస్తున్న రెండు సినిమాలు మధ్యలో ఆగాయి.
ఈ నేపథ్యంలో గత ఏడాది ఓ వేడుకలో మాట్లాడుతూ.. ‘మాయవన్’ సినిమా తనను రోడ్డు మీదికి తెచ్చేసిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సినిమా తనను అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసిందన్నాడు. పాపం మంచి సినిమా తీసినా ఇలా కావడం విచారకరమే.
ఐతే ఇప్పుడీ సినిమా ప్రస్తావన ఎందుకు అంటే.. దీన్ని తాజాగా అమేజాన్ ప్రైంలో రిలీజ్ చేశారు. అక్కడ దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. చూసిన వాళ్లందరూ సూపర్ అంటున్నారు. మంచి రివ్యూలు వస్తున్నాయి. ఇలా అయినా కుమార్ ప్రయత్నానికి ప్రశంసలు దక్కి, అతడికి ఆర్థికంగా కొంత ప్రయోజనం చేకూరితే మంచిదే.
This post was last modified on May 15, 2020 1:57 pm
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…