Movie News

కరోనా దెబ్బ.. జీఎస్టీ కట్టనన్న హీరోయిన్


కరోనా కల్లోల సమయంలో చిన్నా పెద్దా అనే తేడాలేమీ కనిపించడం లేదు. బాగా డబ్బున్న, సొసైటీలో పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు సైతం ఈ కల్లోల సమయంలో సరైన వైద్యం అందక.. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క.. సమయానికి ఆక్సిజన్ అందక.. అత్యవసర మందులు లభించక ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం. సౌత్‌ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ నటించిన హీరోయిన్ మీరా చోప్రా కుటుంబంలో సైతం ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి.

వారం రోజుల వ్యవధిలో మీరా కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లిద్దరూ తక్కువ వయసున్న వ్యక్తులే కావడం గమనార్హం. ముందుగా ఏప్రిల్ 29న మీరా చోప్రా ఒక ట్వీట్ వేసింది. తన కజిన్ ఒకరు కరోనా బారిన పడి పరిస్థితి విషమిస్తే సరైన సమయానికి ఆసుపత్రిలో బెడ్ లభించలేదని, అది దొరికేసరికి ఊపిరి తిత్తులు పూర్తిగా పాడయ్యాయని.. తర్వాత అతను చనిపోయాడని మీరా పేర్కొంది. ఇది కొవిడ్ మరణమా.. హత్యా అని ప్రశ్నించిన మీరా.. ప్రభుత్వం సరైన వైద్య సదుపాయాలు కల్పించకపోవడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని అంది.

ఇది జరిగిన ఇంకో వారం రోజులకే మీరా కజిన్ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన మీరా.. మరోసారి ప్రభుత్వ పనితీరును తప్పుబట్టింది. ఇండియాలో పరిస్థితులపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. తాజాగా ఆమె ఆసుపత్రుల్లో తాను ఇక జీఎస్టీ చెల్లించబోనంటూ మరో ట్వీట్ వేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక బెడ్ కూడా దొరకనపుడు జీఎస్టీ ఎందుకు కట్టాలన్నది ఆమె ప్రశ్న. మీరా ఆవేశంలో ఈ మాట అంటోందని, నిజంగా పన్ను కట్టడం మానేస్తుందా అనిపించొచ్చు కానీ.. వారం వ్యవధిలో ఓ కుటుంబంలో రెండు విషాదాలు చోటు చేసుకున్నపుడు కలిగే ఆవేదన ఇలాగే ఉంటుంది మరి.

This post was last modified on May 17, 2021 2:04 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

3 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

3 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

4 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

4 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

5 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

5 hours ago