Movie News

కరోనా దెబ్బ.. జీఎస్టీ కట్టనన్న హీరోయిన్


కరోనా కల్లోల సమయంలో చిన్నా పెద్దా అనే తేడాలేమీ కనిపించడం లేదు. బాగా డబ్బున్న, సొసైటీలో పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు సైతం ఈ కల్లోల సమయంలో సరైన వైద్యం అందక.. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క.. సమయానికి ఆక్సిజన్ అందక.. అత్యవసర మందులు లభించక ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం. సౌత్‌ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ నటించిన హీరోయిన్ మీరా చోప్రా కుటుంబంలో సైతం ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి.

వారం రోజుల వ్యవధిలో మీరా కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లిద్దరూ తక్కువ వయసున్న వ్యక్తులే కావడం గమనార్హం. ముందుగా ఏప్రిల్ 29న మీరా చోప్రా ఒక ట్వీట్ వేసింది. తన కజిన్ ఒకరు కరోనా బారిన పడి పరిస్థితి విషమిస్తే సరైన సమయానికి ఆసుపత్రిలో బెడ్ లభించలేదని, అది దొరికేసరికి ఊపిరి తిత్తులు పూర్తిగా పాడయ్యాయని.. తర్వాత అతను చనిపోయాడని మీరా పేర్కొంది. ఇది కొవిడ్ మరణమా.. హత్యా అని ప్రశ్నించిన మీరా.. ప్రభుత్వం సరైన వైద్య సదుపాయాలు కల్పించకపోవడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని అంది.

ఇది జరిగిన ఇంకో వారం రోజులకే మీరా కజిన్ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన మీరా.. మరోసారి ప్రభుత్వ పనితీరును తప్పుబట్టింది. ఇండియాలో పరిస్థితులపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. తాజాగా ఆమె ఆసుపత్రుల్లో తాను ఇక జీఎస్టీ చెల్లించబోనంటూ మరో ట్వీట్ వేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక బెడ్ కూడా దొరకనపుడు జీఎస్టీ ఎందుకు కట్టాలన్నది ఆమె ప్రశ్న. మీరా ఆవేశంలో ఈ మాట అంటోందని, నిజంగా పన్ను కట్టడం మానేస్తుందా అనిపించొచ్చు కానీ.. వారం వ్యవధిలో ఓ కుటుంబంలో రెండు విషాదాలు చోటు చేసుకున్నపుడు కలిగే ఆవేదన ఇలాగే ఉంటుంది మరి.

This post was last modified on May 17, 2021 2:04 pm

Share

Recent Posts

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

1 hour ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

1 hour ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

2 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

3 hours ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

3 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

3 hours ago