తన సినిమాల్లో ఆసక్తికరమైన క్యారెక్టర్ రోల్స్ సృష్టించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ది అందెవేసిన చెయ్యి. ఆ ప్రత్యేక పాత్రల కోసం ఎవ్వరూ ఊహించని నటీనటులను తీసుకొస్తూ ఉంటాడు. ‘అతడు’లో నాజర్.. ‘అత్తారింటికి దారేది’లో నదియా.. ‘అల వైకుంఠపురములో’లో మురళీ శర్మ, టబు, సుశాంత్ లాంటి ఆర్టిస్టులు చేసిన పాత్రలు అందుకు ఉదాహరణ. మహేష్ బాబుతో కొత్తగా ఓ సినిమాను అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. అందులోనూ ఒక ప్రత్యేకమైన పాత్రను సిద్ధం చేశాడట. ఆ పాత్ర కోసం అక్కినేని కుటుంబ కథానాయకుడు సుమంత్ను ఎంచుకున్నట్లు సమాచారం.
గత సినిమాలో ఇదే కుటుంబం నుంచి సుశాంత్కు ఛాన్స్ ఇచ్చి అతడి కెరీర్ ఊపందుకోవడంలో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్.. ఈసారి సుమంత్కు ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ సినిమాలో సుమంత్ చేయబోయే క్యారెక్టర్ రోల్కు మంచి ప్రాధాన్యం ఉన్నట్లు చెబుతున్నారు.
సత్యం, గోదావరి, మళ్ళీ రావా లాంటి సినిమాలతో అడపా దడపా విజయాలందుకున్నప్పటికీ.. నిలకడగా సక్సెస్లు సాధించలేక కెరీర్లో బాగా తడబడుతున్నాడు సుమంత్. చివరగా అతడి నుంచి వచ్చిన ‘కపటధారి’ కన్నడలో పెద్ద హిట్టయిన సినిమాకు రీమేక్ అయినప్పటికీ.. ఇక్కడ కనీస ప్రభావం చూపలేకపోయింది. ఆ సినిమా విడుదలైంది, వెళ్లింది కూడా జనాలకు తెలియని పరిస్థితి. మంచి నటుడిగా పేరున్నప్పటికీ సరైన సినిమాలు పడక సుమంత్ కెరీర్ తిరోగమనంలో పయనిస్తోంది.
ప్రస్తుతం అతను ‘వాల్తేరు శీను’ అనే మాస్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వేషం మార్చుకుని కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు. కానీ హీరోగా మార్కెట్ జీరో అయిపోయిన సుమంత్కు ఈ సినిమా ఏమేర ఉపయోగపడుతుందన్నది సందేహమే. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్-మహేష్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ చిత్రంలో చేయబోయే పాత్ర అయినా అతడికి బ్రేక్ ఇచ్చి కెరీర్ను కొత్త మలుపు తిరుగుతుందేమో చూడాలి.
This post was last modified on May 16, 2021 6:50 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…