తన సినిమాల్లో ఆసక్తికరమైన క్యారెక్టర్ రోల్స్ సృష్టించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ది అందెవేసిన చెయ్యి. ఆ ప్రత్యేక పాత్రల కోసం ఎవ్వరూ ఊహించని నటీనటులను తీసుకొస్తూ ఉంటాడు. ‘అతడు’లో నాజర్.. ‘అత్తారింటికి దారేది’లో నదియా.. ‘అల వైకుంఠపురములో’లో మురళీ శర్మ, టబు, సుశాంత్ లాంటి ఆర్టిస్టులు చేసిన పాత్రలు అందుకు ఉదాహరణ. మహేష్ బాబుతో కొత్తగా ఓ సినిమాను అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. అందులోనూ ఒక ప్రత్యేకమైన పాత్రను సిద్ధం చేశాడట. ఆ పాత్ర కోసం అక్కినేని కుటుంబ కథానాయకుడు సుమంత్ను ఎంచుకున్నట్లు సమాచారం.
గత సినిమాలో ఇదే కుటుంబం నుంచి సుశాంత్కు ఛాన్స్ ఇచ్చి అతడి కెరీర్ ఊపందుకోవడంలో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్.. ఈసారి సుమంత్కు ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ సినిమాలో సుమంత్ చేయబోయే క్యారెక్టర్ రోల్కు మంచి ప్రాధాన్యం ఉన్నట్లు చెబుతున్నారు.
సత్యం, గోదావరి, మళ్ళీ రావా లాంటి సినిమాలతో అడపా దడపా విజయాలందుకున్నప్పటికీ.. నిలకడగా సక్సెస్లు సాధించలేక కెరీర్లో బాగా తడబడుతున్నాడు సుమంత్. చివరగా అతడి నుంచి వచ్చిన ‘కపటధారి’ కన్నడలో పెద్ద హిట్టయిన సినిమాకు రీమేక్ అయినప్పటికీ.. ఇక్కడ కనీస ప్రభావం చూపలేకపోయింది. ఆ సినిమా విడుదలైంది, వెళ్లింది కూడా జనాలకు తెలియని పరిస్థితి. మంచి నటుడిగా పేరున్నప్పటికీ సరైన సినిమాలు పడక సుమంత్ కెరీర్ తిరోగమనంలో పయనిస్తోంది.
ప్రస్తుతం అతను ‘వాల్తేరు శీను’ అనే మాస్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వేషం మార్చుకుని కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు. కానీ హీరోగా మార్కెట్ జీరో అయిపోయిన సుమంత్కు ఈ సినిమా ఏమేర ఉపయోగపడుతుందన్నది సందేహమే. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్-మహేష్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ చిత్రంలో చేయబోయే పాత్ర అయినా అతడికి బ్రేక్ ఇచ్చి కెరీర్ను కొత్త మలుపు తిరుగుతుందేమో చూడాలి.
This post was last modified on May 16, 2021 6:50 am
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…