Movie News

మరో అక్కినేని హీరోకు త్రివిక్రమ్ ఛాన్స్?


తన సినిమాల్లో ఆసక్తికరమైన క్యారెక్టర్ రోల్స్ సృష్టించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది అందెవేసిన చెయ్యి. ఆ ప్రత్యేక పాత్రల కోసం ఎవ్వరూ ఊహించని నటీనటులను తీసుకొస్తూ ఉంటాడు. ‘అతడు’లో నాజర్.. ‘అత్తారింటికి దారేది’లో నదియా.. ‘అల వైకుంఠపురములో’లో మురళీ శర్మ, టబు, సుశాంత్ లాంటి ఆర్టిస్టులు చేసిన పాత్రలు అందుకు ఉదాహరణ. మహేష్ బాబుతో కొత్తగా ఓ సినిమాను అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. అందులోనూ ఒక ప్రత్యేకమైన పాత్రను సిద్ధం చేశాడట. ఆ పాత్ర కోసం అక్కినేని కుటుంబ కథానాయకుడు సుమంత్‌ను ఎంచుకున్నట్లు సమాచారం.

గత సినిమాలో ఇదే కుటుంబం నుంచి సుశాంత్‌కు ఛాన్స్ ఇచ్చి అతడి కెరీర్ ఊపందుకోవడంలో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్.. ఈసారి సుమంత్‌కు ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ సినిమాలో సుమంత్ చేయబోయే క్యారెక్టర్ రోల్‌కు మంచి ప్రాధాన్యం ఉన్నట్లు చెబుతున్నారు.

సత్యం, గోదావరి, మళ్ళీ రావా లాంటి సినిమాలతో అడపా దడపా విజయాలందుకున్నప్పటికీ.. నిలకడగా సక్సెస్‌లు సాధించలేక కెరీర్లో బాగా తడబడుతున్నాడు సుమంత్. చివరగా అతడి నుంచి వచ్చిన ‘కపటధారి’ కన్నడలో పెద్ద హిట్టయిన సినిమాకు రీమేక్ అయినప్పటికీ.. ఇక్కడ కనీస ప్రభావం చూపలేకపోయింది. ఆ సినిమా విడుదలైంది, వెళ్లింది కూడా జనాలకు తెలియని పరిస్థితి. మంచి నటుడిగా పేరున్నప్పటికీ సరైన సినిమాలు పడక సుమంత్ కెరీర్ తిరోగమనంలో పయనిస్తోంది.

ప్రస్తుతం అతను ‘వాల్తేరు శీను’ అనే మాస్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వేషం మార్చుకుని కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు. కానీ హీరోగా మార్కెట్ జీరో అయిపోయిన సుమంత్‌కు ఈ సినిమా ఏమేర ఉపయోగపడుతుందన్నది సందేహమే. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్-మహేష్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ చిత్రంలో చేయబోయే పాత్ర అయినా అతడికి బ్రేక్ ఇచ్చి కెరీర్‌ను కొత్త మలుపు తిరుగుతుందేమో చూడాలి.

This post was last modified on May 16, 2021 6:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

20 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago