తెలుగులో ఒక ఛట్రంలో ఇమడని విలక్షణ దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకడు. ఐతే మొదలుకుని.. అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా లాంటి విభిన్నమైన చిత్రాలను అందించి తన రూటే వేరని చాటిన దర్శకుడాయన. ఐతే వీటిలో ఎక్కువగా కమర్షియల్ సక్సెస్లు లేకపోవడంతో ఆయన ప్రతిభకు తగ్గ అవకాశాలు రాలేదు. కెరీర్ ఎప్పుడూ అంత ఊపులో లేకపోయింది.
కొన్నేళ్ల విరామం తర్వాత యేలేటి యువ కథానాయకుడు నితిన్తో ‘చెక్’ అనే సినిమా తీశాడు. రిలీజ్ ముంగిట దీనికి మంచి హైపే వచ్చింది. ఈసారి యేలేటి మ్యాజిక్ వర్కవుట్ కావడంతో పాటు కమర్షియల్గానూ మంచి సక్సెస్ దక్కుతుందని అభిమానులు ఆశించారు. కానీ ‘చెక్’ ఏ రకంగానూ మెప్పించలేకపోయింది. అందులో యేలేటి మార్కు మిస్సయింది. సినిమా సరిగా ఆడలేదు. దీంతో ఆయన కెరీర్ మరింత తిరోగమనం అయ్యేలా కనిపించింది.
భవ్య క్రియేషన్స్లో ‘చెక్’ చేస్తుండగానే యేలేటికి మైత్రీ మూవీ మేకర్స్లో ఓ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. నిజానికి ‘చెక్’ కంటే ముందే ఈ బేనర్లో యేలేటి సినిమా చేయాల్సింది. కానీ అది వర్కవుట్ కాలేదు. ఐతే ‘చెక్’ ఫలితంతో సంబంధం లేకుండా మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు యేలేటితో సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నారు. కానీ హీరో సంగతే ఎటూ తేలలేదు. ముందు స్క్రిప్టు రెడీ చేస్తే ఆ తర్వాత హీరో సంగతి చూద్దామనుకున్నారు. ఐతే ఇప్పుడు యేలేటి కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర ప్రచారం బయటికి వచ్చింది. ఆయన ఏకంగా ప్రభాస్నే టార్గెట్ చేస్తున్నాడట. అతణ్ని దృష్టిలో ఉంచుకుని ఓ కథ రాస్తున్నాడట. మైత్రీ వాళ్లకు ప్రభాస్తోనూ ఓ కమిట్మెంట్ ఉన్న మాట వాస్తవం.
కానీ ప్రభాస్ కోసం ఎవరైనా పెద్ద డైరెక్టర్ను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపించారు మైత్రీ అధినేతలు. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ పేరు సైతం వినిపించింది. అక్కడ కట్ చేస్తే ఇప్పుడు యేలేటి.. ప్రభాస్ కోసం కథ రాస్తున్నాడంటే మైత్రీ ఈ ఇద్దరికి లింకు కలుపుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఐతే యేలేటి ఇప్పటిదాకా పెద్ద స్టార్లతో సినిమాలే తీయలేదు. నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోతోనే హిట్టు కొట్టలేకపోయాడు. ఇలాంటి ట్రాక్ రికార్డున్న దర్శకుడితో సినిమా చేయడానికి ప్రభాస్ ఓకే అంటాడా అన్నది డౌటు. కాకపోతే యేలేటి శిష్యుడైన రాధాకృష్ణకుమార్ తొలి సినిమా ‘జిల్’తో ఫ్లాప్ ఎదుర్కొన్నప్పటికీ అవకాశం ఇచ్చిన ప్రభాస్.. అతడి గురువుకు ఓ అవకాశం ఇవ్వకపోడా అన్న వాదనా ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో?
This post was last modified on May 13, 2021 10:27 am
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…