రెండు భాగాలుగా ‘పుష్ప’.. కొన్ని రోజులుగా మీడియాలో కనిపిస్తున్న వార్త ఇది. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ అని తేడా లేకుండా అన్ని మీడియాల్లోనూ ఈ వార్త హల్చల్ చేసింది. సోషల్ మీడియాలోనూ దీని గురించి పెద్ద చర్చ జరిగింది. ఇది జస్ట్ రూమరా.. నిజమైనా వార్తేనా అన్న విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. నిజమే అయితే.. అధికారికంగా ప్రకటన ఏమీ లేదే అన్న డౌట్ కొడుతోంది.
కానీ వాస్తవం ఏంటంటే.. ఈ విషయంలో సుకుమార్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట. ముందు ఆయన టీం నుంచే ఈ మేరకు మీడియాకు లీక్ ఇచ్చినట్లు సమాచారం. మీడియా ఎలా స్పందిస్తుంది.. ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు.. సోషల్ మీడియాలో ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది అని చూడటానికే ఈ లీక్ ఇచ్చాడట సుక్కు. జనాల స్పందనను బట్టి సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటారట.
ఈ నెలాఖరుకు సుక్కు ‘పుష్ప’ను రెండు భాగాలుగా రిలీజ్ చేసే విషయమై నిర్ణయం తీసుకుంటారన్నది తాజా సమాచారం. ఇంతకుముందు ‘బాహుబలి’ని ఒక సినిమాగా తీయాలని మొదలుపెట్టి.. మధ్యలో నిడివి ఎక్కువవుతోందని భావించి, ఆర్థిక ప్రయోజనాలు కూడా చూసుకుని రెండు భాగాలుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముందు కొంత వ్యతిరేకత వచ్చినా.. చివరికి ఆ ప్రయోగం అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు సుక్కు ఆలోచన కూడా ఇలాగే ఉంది. ఆయన ‘పుష్ప’ కోసమని ఎంతో పరిశోధన చేశారు. బోలెడంత కంటెంట్ రెడీ చేశాడు. ఒక దశలో ‘పుష్ప’ సినిమా తీయగా మిగిలిన కంటెంట్తో ఓ వెబ్ సిరీస్ తీయాలని ఆయన అనుకున్నారు. కానీ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు.
ఐతే ఇప్పుడు ఆయనకు రెండు భాగాలుగా సినిమా తీసే ఆలోచన వచ్చింది. ఐతే ‘బాహుబలి’ సంగతి వేరు. ‘పుష్ప’ లాంటి సోషల్ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే వర్కవుట్ అవుతుందా అన్న సందిగ్ధత కూడా లేకపోలేదు. అందుకే తన టీంతో మరింతగా చర్చించి.. జనాల ఫీడ్ బ్యాక్ చూసుకుని.. అలాగే స్క్రిప్టు ఏమేర సపోర్ట్ చేస్తుందో చూసుకుని సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నాడట సుక్కు.
This post was last modified on May 8, 2021 5:54 pm
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…