నందమూరి హీరోలు బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ కలయికలో ఒక మల్టీస్టారర్ రాబోతోందని.. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తన తొలి చిత్రం ‘పటాస్’ను స్వయంగా నిర్మించి నటించిన కళ్యాణ్ రామ్ మీద అనిల్కు ప్రత్యేక అభిమానం ఉన్న మాట వాస్తవం.
అలాగే తన ఫేవరెట్ హీరో బాలకృష్ణతో సినిమా చేయడానికి అనిల్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్న మాటా నిజమే. ఈ నేపథ్యంలో ఈ మల్టీస్టారర్ వార్త చాలామందికి నమ్మశక్యంగానే అనిపించింది. అన్ని మీడియాల్లోనూ దీని గురించి జోరుగా వార్తలు షికారు చేశాయి. ఐతే ఇది జస్ట్ రూమరే అని తేల్చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నందమూరి హీరోల మల్టీస్టారర్ గురించి తాను కూడా మీడియాలోనే చూసి తెలుసుకున్నానని.. ఈ దిశగా తాను ఎలాంటి సన్నాహాలు చేయట్లేదని అనిల్ తేల్చేశాడు.
ఇదిలా ఉంటే.. తాను బాలయ్యతో సినిమా చేయడానికి ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే అని.. ఐతే ఈ ప్రాజెక్టు చర్చల దశలోనే ఉందని.. ఏదీ ఖరారవ్వలేదని అనిల్ స్పష్టం చేశాడు. ఎప్పటికైనా బాలయ్యతో సినిమా తీస్తాననే మాటను అనిల్ ముందు నుంచి చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు గురించి ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే తానే మీడియాకు చెబుతానని అనిల్ అన్నాడు.
గత నెలలో అనిల్ కరోనా బారిన పడటంతో అతను దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్-3’ షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం అనిల్కు నెగెటివ్ వచ్చింది. అతను పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నెలంతా ‘ఎఫ్-3’ షూటింగ్ పున:ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే నెలలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసే అవకాశముంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘ఎఫ్-2’ హీరో హీరోయిన్లు వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్లే కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 7, 2021 9:04 am
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…