పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను మించిపోయిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా మొదలైనపుడు చాలా వరకు అభిమానులు పెదవి విరిచారు. ఇది బాలీవుడ్ మూవీ ‘పింక్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులో పవన్ కళ్యాణ్ నటించడమేంటి.. అందునా రీఎంట్రీకి ఈ చిత్రాన్ని ఎంచుకోవడం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఈ సినిమాలోనూ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడమే కాక.. ఒరిజినల్లోని ఎసెన్స్ పోకుండా బ్యాలెన్స్ చేసి ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్.
పవన్ వ్యక్తిగత ఇమేజ్ను పెంచడమే కాక, పొలిటికల్ మైలేజీకి కూడా ఈ సినిమా ఉపయోగపడటం విశేషమే. ఇప్పడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కొందరిలో కలిగింది. అభిమానులు కూడా ఆ దిశగా ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ ముందు పెడితే ఆసక్తికర జవాబిచ్చాడు.
తాజాగా ఒక వీడియో ఇంటర్వ్యూలో భాగంగా అభిమానుల ప్రశ్నలను ఇంటర్వ్యూయర్ వేణు శ్రీరామ్ ముందు ఉంచాడు. వకీల్ సాబ్-2 చేసే ఆలోచన ఉందా అన్నది అందులో ఒక ప్రశ్న. దీనికి వేణు బదులిస్తూ.. “నిజానికి నాకు సీక్వెల్ చేసే ఆలోచన లేదు. కానీ సినిమా రిలీజయ్యాక అభిమానులతో పాటు సన్నిహితులు చాలామంది సీక్వెల్ చేస్తే బాగుంటుంది అన్నారు. మనకు ఇప్పుడు వకీల్ సాబ్ అంటే ఎవరో బాగా తెలుసు. ఆ క్యారెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఈ కథను కొనసాగించి మరో మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మరో అవకావం ఇవ్వాలి. ఆయన ఓకే అని.. దిల్ రాజు గారు కూడా సినిమాను నిర్మించడానికి ముందుకు వస్తే.. వకీల్ సాబ్-2 చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి” అని వేణు అన్నాడు. మరి ఇప్పుడిలా మొగ్గ తొడిగిన ఆలోచన రేప్పొద్దున నిజంగానే కార్యరూపం దాలుస్తుందేమో చూడాలి.
This post was last modified on May 7, 2021 7:02 am
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…