పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను మించిపోయిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా మొదలైనపుడు చాలా వరకు అభిమానులు పెదవి విరిచారు. ఇది బాలీవుడ్ మూవీ ‘పింక్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులో పవన్ కళ్యాణ్ నటించడమేంటి.. అందునా రీఎంట్రీకి ఈ చిత్రాన్ని ఎంచుకోవడం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఈ సినిమాలోనూ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడమే కాక.. ఒరిజినల్లోని ఎసెన్స్ పోకుండా బ్యాలెన్స్ చేసి ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్.
పవన్ వ్యక్తిగత ఇమేజ్ను పెంచడమే కాక, పొలిటికల్ మైలేజీకి కూడా ఈ సినిమా ఉపయోగపడటం విశేషమే. ఇప్పడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కొందరిలో కలిగింది. అభిమానులు కూడా ఆ దిశగా ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ ముందు పెడితే ఆసక్తికర జవాబిచ్చాడు.
తాజాగా ఒక వీడియో ఇంటర్వ్యూలో భాగంగా అభిమానుల ప్రశ్నలను ఇంటర్వ్యూయర్ వేణు శ్రీరామ్ ముందు ఉంచాడు. వకీల్ సాబ్-2 చేసే ఆలోచన ఉందా అన్నది అందులో ఒక ప్రశ్న. దీనికి వేణు బదులిస్తూ.. “నిజానికి నాకు సీక్వెల్ చేసే ఆలోచన లేదు. కానీ సినిమా రిలీజయ్యాక అభిమానులతో పాటు సన్నిహితులు చాలామంది సీక్వెల్ చేస్తే బాగుంటుంది అన్నారు. మనకు ఇప్పుడు వకీల్ సాబ్ అంటే ఎవరో బాగా తెలుసు. ఆ క్యారెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఈ కథను కొనసాగించి మరో మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మరో అవకావం ఇవ్వాలి. ఆయన ఓకే అని.. దిల్ రాజు గారు కూడా సినిమాను నిర్మించడానికి ముందుకు వస్తే.. వకీల్ సాబ్-2 చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి” అని వేణు అన్నాడు. మరి ఇప్పుడిలా మొగ్గ తొడిగిన ఆలోచన రేప్పొద్దున నిజంగానే కార్యరూపం దాలుస్తుందేమో చూడాలి.
This post was last modified on May 7, 2021 7:02 am
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…