Movie News

అడివి శేష్‌కు హ్యాట్సాఫ్


కరోనా కష్ట కాలంలో సెలబ్రెటీలు చాలామంది తమ వంతుగా సొసైటీకి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సోనూ సూద్ లాగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి తమ వంతుగా చిన్న సాయం చేసినా చాలు. అవసరంలో ఉన్న ఒకరిద్దరికి ఆ సాయం ఉపయోగపడినా చాలు. అంతకంటే ఏం కావాలి? మన తెలుగు నటుడు అడివి శేష్ చేసిన ఒక మంచి పని ఇప్పుడు వందల మందికి ఉపయోగపడుతోంది.

ఒక ఆసుపత్రిలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించి తన పెద్ద మనసును చాటుకున్నాడు శేష్. హైదరాబాద్‌లోని కింగ్ కోఠిలో ప్రభుత్వ ఆసుపత్రికి ఘన చరిత్ర ఉంది. నగరంలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో అది ఒకటి. ఐతే అంత పెద్ద ఆసుపత్రిలో తాగు నీటి సౌకర్యం లేక సిబ్బందితో పాటు రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారని శేష్ దృష్టికి వచ్చింది.

దీంతో వెంటనే అతను తన టీంతో 850 లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లు ఒక వాహనంలో పంపించాడు. ఐతే అవి ఒకట్రెండు రోజులు మాత్రమే అక్కడి వారి దాహం తీరుస్తాయని అర్థం చేసుకున్న శేష్.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనుకున్నాడు. దీంతో సొంత ఖర్చుతో అక్కడ మినరల్ వాటర్ ఆర్వో ప్లాంట్ పెట్టించడానికి సన్నాహాలు చేశాడు. తాను అందజేసిన మినరల్ వాటర్ బాటిళ్లు అయిపోయే లోపే అక్కడ ఆర్వో ప్లాంట్ సిద్ధం అయింది.

48 గంటల వ్యవధిలో ఈ పని పూర్తి చేయించాడు. ఇప్పుడు కోఠి ఆసుపత్రిలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోయింది. ఆసుపత్రి మొత్తానికి మంచి నీళ్లు అందుతున్నాయి. ఈ పని చేసి సెలబ్రెటీలందరికీ శేష్ ఆదర్శంగా నిలిచాడు. కాస్త శ్రద్ధ పెడితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో ప్రభుత్వ అధికారులకు కూడా ఒక పాఠం నేర్పించిన శేష్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

This post was last modified on May 7, 2021 6:52 am

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

18 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

1 hour ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

3 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

4 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

5 hours ago