Movie News

అడివి శేష్‌కు హ్యాట్సాఫ్


కరోనా కష్ట కాలంలో సెలబ్రెటీలు చాలామంది తమ వంతుగా సొసైటీకి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సోనూ సూద్ లాగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి తమ వంతుగా చిన్న సాయం చేసినా చాలు. అవసరంలో ఉన్న ఒకరిద్దరికి ఆ సాయం ఉపయోగపడినా చాలు. అంతకంటే ఏం కావాలి? మన తెలుగు నటుడు అడివి శేష్ చేసిన ఒక మంచి పని ఇప్పుడు వందల మందికి ఉపయోగపడుతోంది.

ఒక ఆసుపత్రిలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించి తన పెద్ద మనసును చాటుకున్నాడు శేష్. హైదరాబాద్‌లోని కింగ్ కోఠిలో ప్రభుత్వ ఆసుపత్రికి ఘన చరిత్ర ఉంది. నగరంలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో అది ఒకటి. ఐతే అంత పెద్ద ఆసుపత్రిలో తాగు నీటి సౌకర్యం లేక సిబ్బందితో పాటు రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారని శేష్ దృష్టికి వచ్చింది.

దీంతో వెంటనే అతను తన టీంతో 850 లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లు ఒక వాహనంలో పంపించాడు. ఐతే అవి ఒకట్రెండు రోజులు మాత్రమే అక్కడి వారి దాహం తీరుస్తాయని అర్థం చేసుకున్న శేష్.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనుకున్నాడు. దీంతో సొంత ఖర్చుతో అక్కడ మినరల్ వాటర్ ఆర్వో ప్లాంట్ పెట్టించడానికి సన్నాహాలు చేశాడు. తాను అందజేసిన మినరల్ వాటర్ బాటిళ్లు అయిపోయే లోపే అక్కడ ఆర్వో ప్లాంట్ సిద్ధం అయింది.

48 గంటల వ్యవధిలో ఈ పని పూర్తి చేయించాడు. ఇప్పుడు కోఠి ఆసుపత్రిలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోయింది. ఆసుపత్రి మొత్తానికి మంచి నీళ్లు అందుతున్నాయి. ఈ పని చేసి సెలబ్రెటీలందరికీ శేష్ ఆదర్శంగా నిలిచాడు. కాస్త శ్రద్ధ పెడితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో ప్రభుత్వ అధికారులకు కూడా ఒక పాఠం నేర్పించిన శేష్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

This post was last modified on May 7, 2021 6:52 am

Share

Recent Posts

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

21 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

2 hours ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

5 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

6 hours ago