Movie News

అడివి శేష్‌కు హ్యాట్సాఫ్


కరోనా కష్ట కాలంలో సెలబ్రెటీలు చాలామంది తమ వంతుగా సొసైటీకి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సోనూ సూద్ లాగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి తమ వంతుగా చిన్న సాయం చేసినా చాలు. అవసరంలో ఉన్న ఒకరిద్దరికి ఆ సాయం ఉపయోగపడినా చాలు. అంతకంటే ఏం కావాలి? మన తెలుగు నటుడు అడివి శేష్ చేసిన ఒక మంచి పని ఇప్పుడు వందల మందికి ఉపయోగపడుతోంది.

ఒక ఆసుపత్రిలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించి తన పెద్ద మనసును చాటుకున్నాడు శేష్. హైదరాబాద్‌లోని కింగ్ కోఠిలో ప్రభుత్వ ఆసుపత్రికి ఘన చరిత్ర ఉంది. నగరంలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో అది ఒకటి. ఐతే అంత పెద్ద ఆసుపత్రిలో తాగు నీటి సౌకర్యం లేక సిబ్బందితో పాటు రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారని శేష్ దృష్టికి వచ్చింది.

దీంతో వెంటనే అతను తన టీంతో 850 లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లు ఒక వాహనంలో పంపించాడు. ఐతే అవి ఒకట్రెండు రోజులు మాత్రమే అక్కడి వారి దాహం తీరుస్తాయని అర్థం చేసుకున్న శేష్.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనుకున్నాడు. దీంతో సొంత ఖర్చుతో అక్కడ మినరల్ వాటర్ ఆర్వో ప్లాంట్ పెట్టించడానికి సన్నాహాలు చేశాడు. తాను అందజేసిన మినరల్ వాటర్ బాటిళ్లు అయిపోయే లోపే అక్కడ ఆర్వో ప్లాంట్ సిద్ధం అయింది.

48 గంటల వ్యవధిలో ఈ పని పూర్తి చేయించాడు. ఇప్పుడు కోఠి ఆసుపత్రిలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోయింది. ఆసుపత్రి మొత్తానికి మంచి నీళ్లు అందుతున్నాయి. ఈ పని చేసి సెలబ్రెటీలందరికీ శేష్ ఆదర్శంగా నిలిచాడు. కాస్త శ్రద్ధ పెడితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో ప్రభుత్వ అధికారులకు కూడా ఒక పాఠం నేర్పించిన శేష్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

This post was last modified on May 7, 2021 6:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago