త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే.. రైటింగ్ క్రెడిట్ పూర్తిగా ఆయనకే వెళ్లిపోతుంటుంది. రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ అనే చూస్తుంటాం. రచనా సహకారం అంటూ కూడా పేర్లు కనిపించడం అరుదు. ఆయన ఎవరి నుంచి రచనా సహకారం తీసుకోరా.. లేక తీసుకున్నా ఎవరికీ క్రెడిట్ ఇవ్వడా అన్నది తెలియదు మరి.
త్రివిక్రమ్ రైటింగ్ టీంలో ఎవరుంటారో కూడా పెద్దగా పేర్లు బయటికి రావు. ఆయన శిష్యులుగా ఇండస్ట్రీలో చలామణి అయిన వాళ్లు కూడా తక్కువే. ఆ కొద్ది మందిలో వెంకీ కుడుముల ఒకడు. త్రివిక్రమ్ బ్రాండుతో దర్శకుడిగా అరంగేట్రం చేసి.. వరుసగా రెండు విజయాలందుకున్నాడతను. ఛలో, భీష్మ సినిమాలతో మంచి పేరు సంపాదించి.. హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడతను. ‘ఉప్పెన’తో హీరోగా పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ హీరోగా అతనో సినిమా రూపొందించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఐతే దర్శకుడిగా మూడో సినిమా పనులు చూసుకుంటూనే.. తన గురువు కోసం వెంకీ పని చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’తో నాన్ బాహుబలి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్.. దీని తర్వాత మహేష్ బాబుతో పని చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెంకీ పని చేయబోతున్నాడట. దర్శకుడిగా మారి మంచి పేరు సంపాదించాక ఇలా తిరిగి రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేయడం అరుదుగా జరుగుతుంటుంది.
ఐతే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. త్రివిక్రమ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు కూడా. మహేష్తో ఇంకతుముందు తీసిన రెండు సినిమాలు కమర్షియల్ ఫెయిల్యూర్లుగా నిలిచిన నేపథ్యంలో ఈసారి బ్లాక్బస్టర్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నాడు మాటల మాంత్రికుడు. ఈ నేపథ్యంలోనే శిష్యుడి సాయం తీసుకుంటున్నాడట. వెంకీ మీద మహేష్కు కూడా మంచి గురి ఉంది. అతడితో మహేష్ కథా చర్చలు కూడా జరిపాడు. మహేష్ నిర్మాణంలో వెంకీ ఓ సినిమానో, వెబ్ సిరీసో తీయబోతున్నాడని కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మహేష్-త్రివిక్రమ్ చిత్రానికి వెంకీ రచనా సహకారం అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…