త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే.. రైటింగ్ క్రెడిట్ పూర్తిగా ఆయనకే వెళ్లిపోతుంటుంది. రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ అనే చూస్తుంటాం. రచనా సహకారం అంటూ కూడా పేర్లు కనిపించడం అరుదు. ఆయన ఎవరి నుంచి రచనా సహకారం తీసుకోరా.. లేక తీసుకున్నా ఎవరికీ క్రెడిట్ ఇవ్వడా అన్నది తెలియదు మరి.
త్రివిక్రమ్ రైటింగ్ టీంలో ఎవరుంటారో కూడా పెద్దగా పేర్లు బయటికి రావు. ఆయన శిష్యులుగా ఇండస్ట్రీలో చలామణి అయిన వాళ్లు కూడా తక్కువే. ఆ కొద్ది మందిలో వెంకీ కుడుముల ఒకడు. త్రివిక్రమ్ బ్రాండుతో దర్శకుడిగా అరంగేట్రం చేసి.. వరుసగా రెండు విజయాలందుకున్నాడతను. ఛలో, భీష్మ సినిమాలతో మంచి పేరు సంపాదించి.. హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడతను. ‘ఉప్పెన’తో హీరోగా పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ హీరోగా అతనో సినిమా రూపొందించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఐతే దర్శకుడిగా మూడో సినిమా పనులు చూసుకుంటూనే.. తన గురువు కోసం వెంకీ పని చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’తో నాన్ బాహుబలి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్.. దీని తర్వాత మహేష్ బాబుతో పని చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెంకీ పని చేయబోతున్నాడట. దర్శకుడిగా మారి మంచి పేరు సంపాదించాక ఇలా తిరిగి రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేయడం అరుదుగా జరుగుతుంటుంది.
ఐతే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. త్రివిక్రమ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు కూడా. మహేష్తో ఇంకతుముందు తీసిన రెండు సినిమాలు కమర్షియల్ ఫెయిల్యూర్లుగా నిలిచిన నేపథ్యంలో ఈసారి బ్లాక్బస్టర్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నాడు మాటల మాంత్రికుడు. ఈ నేపథ్యంలోనే శిష్యుడి సాయం తీసుకుంటున్నాడట. వెంకీ మీద మహేష్కు కూడా మంచి గురి ఉంది. అతడితో మహేష్ కథా చర్చలు కూడా జరిపాడు. మహేష్ నిర్మాణంలో వెంకీ ఓ సినిమానో, వెబ్ సిరీసో తీయబోతున్నాడని కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మహేష్-త్రివిక్రమ్ చిత్రానికి వెంకీ రచనా సహకారం అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
This post was last modified on May 5, 2021 8:02 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…