త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే.. రైటింగ్ క్రెడిట్ పూర్తిగా ఆయనకే వెళ్లిపోతుంటుంది. రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ అనే చూస్తుంటాం. రచనా సహకారం అంటూ కూడా పేర్లు కనిపించడం అరుదు. ఆయన ఎవరి నుంచి రచనా సహకారం తీసుకోరా.. లేక తీసుకున్నా ఎవరికీ క్రెడిట్ ఇవ్వడా అన్నది తెలియదు మరి.
త్రివిక్రమ్ రైటింగ్ టీంలో ఎవరుంటారో కూడా పెద్దగా పేర్లు బయటికి రావు. ఆయన శిష్యులుగా ఇండస్ట్రీలో చలామణి అయిన వాళ్లు కూడా తక్కువే. ఆ కొద్ది మందిలో వెంకీ కుడుముల ఒకడు. త్రివిక్రమ్ బ్రాండుతో దర్శకుడిగా అరంగేట్రం చేసి.. వరుసగా రెండు విజయాలందుకున్నాడతను. ఛలో, భీష్మ సినిమాలతో మంచి పేరు సంపాదించి.. హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడతను. ‘ఉప్పెన’తో హీరోగా పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ హీరోగా అతనో సినిమా రూపొందించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఐతే దర్శకుడిగా మూడో సినిమా పనులు చూసుకుంటూనే.. తన గురువు కోసం వెంకీ పని చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’తో నాన్ బాహుబలి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్.. దీని తర్వాత మహేష్ బాబుతో పని చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెంకీ పని చేయబోతున్నాడట. దర్శకుడిగా మారి మంచి పేరు సంపాదించాక ఇలా తిరిగి రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేయడం అరుదుగా జరుగుతుంటుంది.
ఐతే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. త్రివిక్రమ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు కూడా. మహేష్తో ఇంకతుముందు తీసిన రెండు సినిమాలు కమర్షియల్ ఫెయిల్యూర్లుగా నిలిచిన నేపథ్యంలో ఈసారి బ్లాక్బస్టర్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నాడు మాటల మాంత్రికుడు. ఈ నేపథ్యంలోనే శిష్యుడి సాయం తీసుకుంటున్నాడట. వెంకీ మీద మహేష్కు కూడా మంచి గురి ఉంది. అతడితో మహేష్ కథా చర్చలు కూడా జరిపాడు. మహేష్ నిర్మాణంలో వెంకీ ఓ సినిమానో, వెబ్ సిరీసో తీయబోతున్నాడని కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మహేష్-త్రివిక్రమ్ చిత్రానికి వెంకీ రచనా సహకారం అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…