Movie News

వాళ్లిద్దరి పెళ్లి మళ్లీ వాయిదా

బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్ కపూర్-ఆలియా భట్‌ల పెళ్లికి ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం తప్పట్లేదు. మూడేళ్ల ముందే వీరి పెళ్లి జరగాల్సింది. కానీ రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ క్యాన్సర్ బారిన పడటంతో పెళ్లిని వాయిదా వేశారు. ఆయన కోలుకుని మామూలు మనిషయ్యాక వీరి పెళ్లి చేద్దామనుకున్నారు. రిషి విదేశాల్లో చికిత్స చేయించుకుని ముంబయికి తిరిగొచ్చారు.

ఆయన కొంచెం కుదురుకున్నాక పెళ్లి అనుకున్నారు. కానీ ఇంతలో కరోనా వచ్చింది. లాక్ డౌన్ టైంలో రిషి పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలారు. దీంతో రణబీర్-ఆలియాల పెళ్లి గురించి వెంటనే ఆలోచించలేని పరిస్థితి తలెత్తింది. కరోనా కష్టాలు తొలగిపోయి.. రణబీర్, ఆలియా చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఈ ఏడాది పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ మళ్లీ వీరి ప్రణాళికలను దెబ్బ తీసింది.

రణబీర్, ఆలియా ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడ్డారు. ముంబయిలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అక్కడ ఆంక్షలు, కరోనా తీవ్రత నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారేలా లేవు. రాబోయే కొన్ని నెలల్లో రణబీర్, ఆలియాల పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ అనిశ్చితిలో పెళ్లి వద్దని ఇరు కుటుంబాలు భావిస్తున్నాయట. పరిస్థితులు పూర్తిగా మెరుగు పడ్డాకే వివాహం అనుకుంటున్నారట.

అందుకే పెళ్లిని మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 2022లో కానీ రణబీర్-ఆలియా పెళ్లి జరిగే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఇద్దరూ కరోనా నుంచి కోలుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆలియా చేతిలో ఆర్ఆర్ఆర్‌తో పాటు గంగూబాయి కతియావాడీ, బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాలున్నాయి. ఇందులో ‘బ్రహ్మాస్త్ర’ రణబీర్ హీరోగా నటిస్తున్న చిత్రం కావడం విశేషం. చేతిలో ఉన్న కమిట్మెంట్లను ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది కరోనా ప్రభావం తగ్గాక ప్రశాంతంగా పెళ్లి చేసుకుందామని రణబీర్, ఆలియా ఫిక్సయినట్లు తెలస్తోంది.

This post was last modified on May 4, 2021 7:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago