బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్ కపూర్-ఆలియా భట్ల పెళ్లికి ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం తప్పట్లేదు. మూడేళ్ల ముందే వీరి పెళ్లి జరగాల్సింది. కానీ రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ క్యాన్సర్ బారిన పడటంతో పెళ్లిని వాయిదా వేశారు. ఆయన కోలుకుని మామూలు మనిషయ్యాక వీరి పెళ్లి చేద్దామనుకున్నారు. రిషి విదేశాల్లో చికిత్స చేయించుకుని ముంబయికి తిరిగొచ్చారు.
ఆయన కొంచెం కుదురుకున్నాక పెళ్లి అనుకున్నారు. కానీ ఇంతలో కరోనా వచ్చింది. లాక్ డౌన్ టైంలో రిషి పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలారు. దీంతో రణబీర్-ఆలియాల పెళ్లి గురించి వెంటనే ఆలోచించలేని పరిస్థితి తలెత్తింది. కరోనా కష్టాలు తొలగిపోయి.. రణబీర్, ఆలియా చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఈ ఏడాది పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ మళ్లీ వీరి ప్రణాళికలను దెబ్బ తీసింది.
రణబీర్, ఆలియా ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడ్డారు. ముంబయిలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అక్కడ ఆంక్షలు, కరోనా తీవ్రత నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారేలా లేవు. రాబోయే కొన్ని నెలల్లో రణబీర్, ఆలియాల పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ అనిశ్చితిలో పెళ్లి వద్దని ఇరు కుటుంబాలు భావిస్తున్నాయట. పరిస్థితులు పూర్తిగా మెరుగు పడ్డాకే వివాహం అనుకుంటున్నారట.
అందుకే పెళ్లిని మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 2022లో కానీ రణబీర్-ఆలియా పెళ్లి జరిగే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఇద్దరూ కరోనా నుంచి కోలుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆలియా చేతిలో ఆర్ఆర్ఆర్తో పాటు గంగూబాయి కతియావాడీ, బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాలున్నాయి. ఇందులో ‘బ్రహ్మాస్త్ర’ రణబీర్ హీరోగా నటిస్తున్న చిత్రం కావడం విశేషం. చేతిలో ఉన్న కమిట్మెంట్లను ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది కరోనా ప్రభావం తగ్గాక ప్రశాంతంగా పెళ్లి చేసుకుందామని రణబీర్, ఆలియా ఫిక్సయినట్లు తెలస్తోంది.
This post was last modified on May 4, 2021 7:11 am
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…