పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించడానికి హీరోయిన్లు ఎగబడటం కామన్. కానీ ఆయనతో సినిమా ఓకే అయ్యాక అందులో నటించలేనంటూ ఓ హీరోయిన్ తప్పుకోవడం ఈ మధ్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కథానాయిక మరెవరో కాదు.. సాయిపల్లవి. అయ్యప్పనుం కోషీయుం రీమేక్లో పవన్కు జోడీగా ముందు సాయిపల్లవి ఎంపిక కావడం, కానీ డేట్లు సర్దుబాటు చేయలేక ఆమె తప్పుకోవడం తెలిసిన సంగతే.
మలయాళంలో గౌరి నంద అనే అమ్మాయి చేసిన పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది. గిరిజనురాలైన నక్సలైట్ పాత్ర తనది. ఇళాంటి పాత్రను ఎవరు పడితే వాళ్లు చేయలేరు. మంచి నటి అయి ఉండాలి. నిడివి తక్కువే అయినా పేరున్న నటినే ఈ పాత్ర కోసం తీసుకోవాల్సి ఉండటంతో ఆర్టిస్టును ఖరారు చేయడంలో ఆలస్యం జరిగింది. ఐతే ఎట్టకేలకు ఆ పని పూర్తయినట్లు సమాచారం.
సాయిపల్లవి కంటే ముందు తెలుగులో మంచి గుర్తింపు సంపాదించిన మరో మలయాళ నటి నిత్యా మీనన్ను ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్లో పవన్కు జోడీగా ఖాయం చేసినట్లు తాజా సమాచారం. పాత్ర నచ్చి ఇందులో నటించడానికి నిత్య ఓకే చెప్పిందట. ఆమె ఈ పాత్రకు మంచి ఛాయిస్ అనే అంటున్నారు. పవన్కు కరోనా సోకడం, వైరస్ ఉద్ధృతి విపరీతంగా ఉండటంతో ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ షూటింగ్ను కొన్ని వారాల నుంచి ఆపేసి ఉన్నారు.
పవన్తో దగ్గరగా మెలిగిన దర్శకుడు సాగర్ చంద్ర ఐసొలేట్ కావడం తెలిసిందే. మళ్లీ ఎప్పుడు అందరికీ కుదిరితే అప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. మధ్యలో దొరికిన ఖాళీలోనే నిత్యా మీనన్ను ముఖ్య పాత్ర కోసం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది
This post was last modified on May 2, 2021 5:47 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…