Movie News

పవన్‌‌కు జోడీగా ఆమె ఫిక్స్?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించడానికి హీరోయిన్లు ఎగబడటం కామన్. కానీ ఆయనతో సినిమా ఓకే అయ్యాక అందులో నటించలేనంటూ ఓ హీరోయిన్ తప్పుకోవడం ఈ మధ్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కథానాయిక మరెవరో కాదు.. సాయిపల్లవి. అయ్యప్పనుం కోషీయుం రీమేక్‌లో పవన్‌కు జోడీగా ముందు సాయిపల్లవి ఎంపిక కావడం, కానీ డేట్లు సర్దుబాటు చేయలేక ఆమె తప్పుకోవడం తెలిసిన సంగతే.

మలయాళంలో గౌరి నంద అనే అమ్మాయి చేసిన పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది. గిరిజనురాలైన నక్సలైట్ పాత్ర తనది. ఇళాంటి పాత్రను ఎవరు పడితే వాళ్లు చేయలేరు. మంచి నటి అయి ఉండాలి. నిడివి తక్కువే అయినా పేరున్న నటినే ఈ పాత్ర కోసం తీసుకోవాల్సి ఉండటంతో ఆర్టిస్టును ఖరారు చేయడంలో ఆలస్యం జరిగింది. ఐతే ఎట్టకేలకు ఆ పని పూర్తయినట్లు సమాచారం.

సాయిపల్లవి కంటే ముందు తెలుగులో మంచి గుర్తింపు సంపాదించిన మరో మలయాళ నటి నిత్యా మీనన్‌ను ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లో పవన్‌కు జోడీగా ఖాయం చేసినట్లు తాజా సమాచారం. పాత్ర నచ్చి ఇందులో నటించడానికి నిత్య ఓకే చెప్పిందట. ఆమె ఈ పాత్రకు మంచి ఛాయిస్ అనే అంటున్నారు. పవన్‌కు కరోనా సోకడం, వైరస్ ఉద్ధృతి విపరీతంగా ఉండటంతో ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ షూటింగ్‌ను కొన్ని వారాల నుంచి ఆపేసి ఉన్నారు.

పవన్‌తో దగ్గరగా మెలిగిన దర్శకుడు సాగర్ చంద్ర ఐసొలేట్ కావడం తెలిసిందే. మళ్లీ ఎప్పుడు అందరికీ కుదిరితే అప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. మధ్యలో దొరికిన ఖాళీలోనే నిత్యా మీనన్‌ను ముఖ్య పాత్ర కోసం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది

This post was last modified on May 2, 2021 5:47 pm

Share
Show comments

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

5 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

5 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

6 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

7 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

7 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

9 hours ago