పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించడానికి హీరోయిన్లు ఎగబడటం కామన్. కానీ ఆయనతో సినిమా ఓకే అయ్యాక అందులో నటించలేనంటూ ఓ హీరోయిన్ తప్పుకోవడం ఈ మధ్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కథానాయిక మరెవరో కాదు.. సాయిపల్లవి. అయ్యప్పనుం కోషీయుం రీమేక్లో పవన్కు జోడీగా ముందు సాయిపల్లవి ఎంపిక కావడం, కానీ డేట్లు సర్దుబాటు చేయలేక ఆమె తప్పుకోవడం తెలిసిన సంగతే.
మలయాళంలో గౌరి నంద అనే అమ్మాయి చేసిన పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది. గిరిజనురాలైన నక్సలైట్ పాత్ర తనది. ఇళాంటి పాత్రను ఎవరు పడితే వాళ్లు చేయలేరు. మంచి నటి అయి ఉండాలి. నిడివి తక్కువే అయినా పేరున్న నటినే ఈ పాత్ర కోసం తీసుకోవాల్సి ఉండటంతో ఆర్టిస్టును ఖరారు చేయడంలో ఆలస్యం జరిగింది. ఐతే ఎట్టకేలకు ఆ పని పూర్తయినట్లు సమాచారం.
సాయిపల్లవి కంటే ముందు తెలుగులో మంచి గుర్తింపు సంపాదించిన మరో మలయాళ నటి నిత్యా మీనన్ను ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్లో పవన్కు జోడీగా ఖాయం చేసినట్లు తాజా సమాచారం. పాత్ర నచ్చి ఇందులో నటించడానికి నిత్య ఓకే చెప్పిందట. ఆమె ఈ పాత్రకు మంచి ఛాయిస్ అనే అంటున్నారు. పవన్కు కరోనా సోకడం, వైరస్ ఉద్ధృతి విపరీతంగా ఉండటంతో ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ షూటింగ్ను కొన్ని వారాల నుంచి ఆపేసి ఉన్నారు.
పవన్తో దగ్గరగా మెలిగిన దర్శకుడు సాగర్ చంద్ర ఐసొలేట్ కావడం తెలిసిందే. మళ్లీ ఎప్పుడు అందరికీ కుదిరితే అప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. మధ్యలో దొరికిన ఖాళీలోనే నిత్యా మీనన్ను ముఖ్య పాత్ర కోసం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది
This post was last modified on May 2, 2021 5:47 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…