బహుబలి సినిమాల తర్వాత రానా దగ్గుపాటి స్పీడు పెంచేసాడు. వరస పెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. కొత్త కొత్త కథలు, నిర్మాతలు, డైరక్టర్స్ తో కొలాబరేట్ అవుతున్నాడు. ఎక్కడ చిన్న గ్యాప్ ఉన్నా ఆ రోజుని షూటింగ్ డే గా మార్చేస్తున్నాడు. ఆయన స్పీడు చూసి ఇండస్ట్రీ ఆశ్చర్యపోతోంది. రీసెంట్ గా ‘అరణ్య’ అంటూ వచ్చిన రానా ‘విరాట పర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే, పవన్ కళ్యాణ్ తో కలిసి ‘అయ్యపనం కోషియం’ రీమేక్ లో నటిస్తున్నాడు రానా. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమా కమిటయ్యినట్లు సమాచారం.
సీనియర్ నిర్మాత ఆచంట గోపినాథ్ ప్రొడక్షన్ లో చేయటానికి సైన్ చేస్తున్నారు. ఆచంట గోపినాథ్ గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ‘టాప్ హీరో’, ‘దేవుడు’, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘జంబలకిడి పంబ’, రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ వంటి సినిమాలను నిర్మించారు. ఆ మధ్యన నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ ‘ఇమైక్క నొడిగల్’ను తెలుగులో ‘అంజలి సిబిఐ’గా విడుదల చేశారు.
ఇంతకాలం సరైన ప్రాజెక్టు దొరక్క గ్యాప్ తీసుకున్న ఆయన సురేష్ బాబుతో ఉన్న పరిచయంతో రానాతో ముందుకు వెళ్లటానికి రెడీ అవుతున్నారు. ఓ మంచి కాన్సెప్ట్ తో .. రానా దగ్గుబాటి హీరోగా ఈ భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు ఆచంట గోపినాథ్. ఈ మేరకు ఓ స్టార్ డైరక్టర్ చెప్పిన కథ నచ్చిందని, రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మిగతా పనులు కాస్త కరోనా తగ్గాక మొదలెడదామని ఆగారట.
ఈ విషయమై మాట్లాడుతూ…“ప్రస్తుతం రానా చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత మా సినిమా ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ కథ ఓకే అయ్యింది. కథ, కథనం, హీరో పాత్ర చిత్రణ కొత్తగా ఉంటాయి. దర్శకుడు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం” అని అన్నారు ఈ నిర్మాతలు ఆచంట గోపినాథ్, సీహెచ్ రాంబాబు.
This post was last modified on April 30, 2021 3:43 pm
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…