Movie News

కన్నీళ్లు పెట్టిస్తున్న ఇర్ఫాన్ భార్య పోస్టు

దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకడైన ఇర్ఫాన్ ఖాన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి అప్పుడే ఏడాది అయిపోయిందంటే ఆయన అభిమానులకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. కొన్నేళ్ల కిందటే అరుదైన క్యాన్సర్ బారిన పడి.. దాంతో రెండు మూడేళ్ల పాటు పోరాటం చేసి, చివరికి గత ఏడాది ఇండియాలో లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో, ఏప్రిల్ 29న తుది శ్వాస విడిచాడు ఇర్ఫాన్. మామూలు రోజుల్లో అయితే ఇర్ఫాన్‌ను చూడటానికి వేలాది మంది వచ్చేవాళ్లు. కానీ కరోనా నేపథ్యంలో అతడికి ఘనమైన వీడ్కోలు కూడా దక్కలేదు.

సామాజిక మాధ్యమాల్లో మాత్రం అభిమానులు ఇర్ఫాన్‌కు ఘనమైన నివాళే అర్పించారు. ఐతే అభిమానులు, బయటి వారు ఆ సమయానికి బాధ పడి.. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయేవాళ్లే. కానీ కుటుంబ సభ్యుల బాధ మాత్రం ఎప్పటికీ తీరేది కాదు. ఇప్పుడు ఆ బాధనే అక్షర రూపంలోకి తెచ్చింది ఇర్ఫాన్ భార్య సుతాపా సిక్దర్.

ఇర్ఫాన్ తొలి వర్ధంతి నేపథ్యంలో సుతాపా ఒక హృద్యమైన పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఇర్ఫాన్ లేని జీవితం ఎంత బాధాకరంగా ఉందో వివరించింది. తనకు కానీ, ఇర్ఫాన్‌కు కానీ ఎక్కువమంది స్నేహితులు లేరని… తమకు ఏమాత్రం ఖాళీ దొరికినా ఒకరితో ఒకరు గడిపేవాళ్లమని.. ఇర్ఫాన్ చాలా సమయం షూటింగ్‌లకే కేటాయించినా, అందులోంచి ఖాళీ అవ్వగానే తనతోనే గడిపేవాడని.. అందుకే అతను లేని జీవితం చాలా కష్టంగా గడుస్తోందని సుతాపా పేర్కొంది.

ఇర్ఫాన్ చనిపోవడానికి రెండు నెలల ముందు తాము హాలిడే ప్లాన్ చేసుకున్నామని.. ఐతే ఇర్ఫాన్‌‌ను మృత్యువు ఎప్పుడైనా పలకరించవచ్చని డాక్టర్ చెప్పారని, అయినా సరే హాలిడేకు వెళ్లాలనుకున్నామని.. కానీ ఈ లోపే అతను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడని అంది సుతాపా. ఇర్ఫాన్ తన చుట్టూనే ఉన్నట్లు ఇప్పటికీ అనిపిస్తోందంటూ ఉద్వేగానికి గురైంది సుతాపా.

This post was last modified on April 29, 2021 10:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

1 hour ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

3 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

5 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

5 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

5 hours ago