నందమూరి బాలకృష్ణకు ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో అదే స్థాయిలో యాంటీ ఫ్యాన్స్ ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఆయన తెరపై విజృంభించి నటిస్తే అభిమానులకు ఆనందం. ఆయన పాత్ర పేవలంగా ఉండి, కామెడీగా తయారైతే యాంటీ ఫ్యాన్స్కు అంతకుమించిన ఆనందం. ‘నరసింహనాయుడు’ తర్వాత నడిచిన బ్యాడ్ ఫేజ్లో బాలయ్య కొన్ని చెత్త పాత్రలు చేయడం.. మరీ సిల్లీగా అనిపించే తొడగొడితే ట్రైన్ వెనక్కెళ్లే తరహా సన్నివేశాల్లో నటించడంతో ఆయన కామెడీ అయిపోయారు.
ఇక అప్పట్నుంచి ఆయన మీద ఎన్ని జోకులు పేలుతూ వచ్చాయో తెలిసిందే. ఇక ఈ సోషల్ మీడియా కాలంలో అయితే జనాలక ఏ చిన్న అవకాశం దొరికినా రెచ్చిపోతారు. గత ఏడాది బాలయ్య ‘రూలర్’ అనే పేలవమైన సినిమా చేశాడు. అందులో ఒక పాత్ర తాలూకు గెటప్, మేకప్ కామెడీ అయిపోయాయి. అది అభిమానులకు చాలా ఇబ్బందికరంగా పరిణమించింది.
ఐతే ఇంతకుముందు బాలయ్యను స్లంప్ నుంచి బయటపడేసిన బోయపాటి మరోసారి ఆయనతో సినిమా చేస్తుండటంతో నందమూరి అభిమానులు ఎంతో భరోసాతో ఉన్నారు. బాలయ్యకు బోయపాటి పునర్వైభవం తెస్తాడనుకుంటున్నారు. కానీ బోయపాటి చివరిగా చేసిన ‘వినయ విధేయ రామ’ చూశాక గుబులు పుడుతోంది. అందులో కొన్ని సీన్లు ఎలా నవ్వుల పాలయ్యాయో తెలిసిందే. అలాంటి సినిమా బాలయ్య చేసి ఉంటే ట్రోలింగ్ ఏ రేంజిలో ఉండేదో ఊహించడమే కష్టం.
ఐతే ఇప్పుడు తన సినిమాలో బాలయ్య అఘోరా పాత్ర చేస్తున్నట్లు బోయపాటి ధ్రువీకరించడంతో అభిమానుల్లో కొంత ఎగ్జైట్మెంట్తో పాటు ఆందోళన కూడా కనిపిస్తోంది. ఆ పాత్ర సరిగ్గా ఉంటే సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు. కానీ తేడా కొడితే మాత్రం నవ్వుల పాలూ కావచ్చు. బాలయ్య పాత్రలకు సంబంధించి గత అనుభవాల నేపథ్యంలో ఈ పాత్ర ఎక్కడ తేడా కొడుతుందో అన్న భయం నందమూరి అభిమానుల్లో లేకపోలేదు. ఈ పాత్ర సెన్సేషన్ క్రియేట్ చేయకపోయినా పర్వాలేదు కానీ.. ట్రోలింగ్కు గురి కాకుంటే చాలు అన్నది వారి ఆలోచన.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…