సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక వీడియో చూసి కదిలిపోయాడు. అతను ట్విట్టర్లో షేర్ చేసిన ఆ వీడియో చూస్తే ఎవ్వరికైనా హృదయం ద్రవిస్తుందనడంలో సందేహం లేదు. ఆ వీడియో తీసింది ఎక్కడ అన్న వివరాలు లేవు కానీ.. కరోనా వేళ ఆదరవు లేని వృద్ధుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి సదరు వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. తమిళనాడులోనిదిగా భావిస్తున్న ఆ వీడియోలో ఏం ఉందంటే..?
ఒక అనాథ వృద్ధురాలు రోడ్డు పక్కన కూర్చుని ఉండగా.. ఎవరో తీసుకెళ్లి నీళ్ల బాటిల్, ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారు. వాటిని ఎంతో ఆశగా ఆ వృద్ధురాలు తీసుకోవడం.. ఆమె ముఖంలో ఎక్కడ లేని సంతోషం విల్లివిరియడం.. చేతులెత్తి మొక్కడం కనిపించింది. ఇక వీడియోలో ఆఖరి దృశ్యం మరింత భావోద్వేగానికి గురి చేసేదే. తనకు ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్, నీళ్ల బాటిల్కు డబ్బులివ్వాలేమో అనుకుని తన చీర కొంగులో దాచుకున్న చిన్న మొత్తం ఇవ్వబోయింది. వద్దంటే సరే అని దాచుకుంది. కరోనా వేళ అనాథలైన వృద్ధుల దయనీయ స్థితికి ఈ వీడియో అద్దం పడుతోంది. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన తమన్.. ఇది చూశాక వృద్ధాశ్రమం నిర్మించాలని తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
“వీడియో చూసి నా హృదయం ముక్కలైంది. ఓ వద్ధాశ్రమాన్ని నిర్మించాలనే ఆలోచన వెంటనే మొదలైంది. త్వరలోనే ఆ పనులు మొదలుపెడతాను. నాకు ఆ భగవంతుడు ఆశీర్వాదంతో పాటు బలాన్ని అందిస్తాడని భావిస్తున్నాను. ఈ మెసేజ్ టైప్ చేస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆహారాన్ని వృథా చేయకండి. అవసరంలో ఉన్నవారికి ఆహారాన్ని అందించండి. మనుషుల్లాగా ఉండండి” అని తమన్ పేర్కొన్నాడు. తమన్ షేర్ చేసిన వీడియో ఎంతోమందిని కదిలించింది. భావోద్వేగంతో కామెంట్లు పెట్టారు. తమన్ ఆలోచనను అభినందించారు.
This post was last modified on April 26, 2021 10:28 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…