సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక వీడియో చూసి కదిలిపోయాడు. అతను ట్విట్టర్లో షేర్ చేసిన ఆ వీడియో చూస్తే ఎవ్వరికైనా హృదయం ద్రవిస్తుందనడంలో సందేహం లేదు. ఆ వీడియో తీసింది ఎక్కడ అన్న వివరాలు లేవు కానీ.. కరోనా వేళ ఆదరవు లేని వృద్ధుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి సదరు వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. తమిళనాడులోనిదిగా భావిస్తున్న ఆ వీడియోలో ఏం ఉందంటే..?
ఒక అనాథ వృద్ధురాలు రోడ్డు పక్కన కూర్చుని ఉండగా.. ఎవరో తీసుకెళ్లి నీళ్ల బాటిల్, ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారు. వాటిని ఎంతో ఆశగా ఆ వృద్ధురాలు తీసుకోవడం.. ఆమె ముఖంలో ఎక్కడ లేని సంతోషం విల్లివిరియడం.. చేతులెత్తి మొక్కడం కనిపించింది. ఇక వీడియోలో ఆఖరి దృశ్యం మరింత భావోద్వేగానికి గురి చేసేదే. తనకు ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్, నీళ్ల బాటిల్కు డబ్బులివ్వాలేమో అనుకుని తన చీర కొంగులో దాచుకున్న చిన్న మొత్తం ఇవ్వబోయింది. వద్దంటే సరే అని దాచుకుంది. కరోనా వేళ అనాథలైన వృద్ధుల దయనీయ స్థితికి ఈ వీడియో అద్దం పడుతోంది. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన తమన్.. ఇది చూశాక వృద్ధాశ్రమం నిర్మించాలని తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
“వీడియో చూసి నా హృదయం ముక్కలైంది. ఓ వద్ధాశ్రమాన్ని నిర్మించాలనే ఆలోచన వెంటనే మొదలైంది. త్వరలోనే ఆ పనులు మొదలుపెడతాను. నాకు ఆ భగవంతుడు ఆశీర్వాదంతో పాటు బలాన్ని అందిస్తాడని భావిస్తున్నాను. ఈ మెసేజ్ టైప్ చేస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆహారాన్ని వృథా చేయకండి. అవసరంలో ఉన్నవారికి ఆహారాన్ని అందించండి. మనుషుల్లాగా ఉండండి” అని తమన్ పేర్కొన్నాడు. తమన్ షేర్ చేసిన వీడియో ఎంతోమందిని కదిలించింది. భావోద్వేగంతో కామెంట్లు పెట్టారు. తమన్ ఆలోచనను అభినందించారు.
This post was last modified on April 26, 2021 10:28 am
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…