సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక వీడియో చూసి కదిలిపోయాడు. అతను ట్విట్టర్లో షేర్ చేసిన ఆ వీడియో చూస్తే ఎవ్వరికైనా హృదయం ద్రవిస్తుందనడంలో సందేహం లేదు. ఆ వీడియో తీసింది ఎక్కడ అన్న వివరాలు లేవు కానీ.. కరోనా వేళ ఆదరవు లేని వృద్ధుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి సదరు వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. తమిళనాడులోనిదిగా భావిస్తున్న ఆ వీడియోలో ఏం ఉందంటే..?
ఒక అనాథ వృద్ధురాలు రోడ్డు పక్కన కూర్చుని ఉండగా.. ఎవరో తీసుకెళ్లి నీళ్ల బాటిల్, ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారు. వాటిని ఎంతో ఆశగా ఆ వృద్ధురాలు తీసుకోవడం.. ఆమె ముఖంలో ఎక్కడ లేని సంతోషం విల్లివిరియడం.. చేతులెత్తి మొక్కడం కనిపించింది. ఇక వీడియోలో ఆఖరి దృశ్యం మరింత భావోద్వేగానికి గురి చేసేదే. తనకు ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్, నీళ్ల బాటిల్కు డబ్బులివ్వాలేమో అనుకుని తన చీర కొంగులో దాచుకున్న చిన్న మొత్తం ఇవ్వబోయింది. వద్దంటే సరే అని దాచుకుంది. కరోనా వేళ అనాథలైన వృద్ధుల దయనీయ స్థితికి ఈ వీడియో అద్దం పడుతోంది. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన తమన్.. ఇది చూశాక వృద్ధాశ్రమం నిర్మించాలని తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
“వీడియో చూసి నా హృదయం ముక్కలైంది. ఓ వద్ధాశ్రమాన్ని నిర్మించాలనే ఆలోచన వెంటనే మొదలైంది. త్వరలోనే ఆ పనులు మొదలుపెడతాను. నాకు ఆ భగవంతుడు ఆశీర్వాదంతో పాటు బలాన్ని అందిస్తాడని భావిస్తున్నాను. ఈ మెసేజ్ టైప్ చేస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆహారాన్ని వృథా చేయకండి. అవసరంలో ఉన్నవారికి ఆహారాన్ని అందించండి. మనుషుల్లాగా ఉండండి” అని తమన్ పేర్కొన్నాడు. తమన్ షేర్ చేసిన వీడియో ఎంతోమందిని కదిలించింది. భావోద్వేగంతో కామెంట్లు పెట్టారు. తమన్ ఆలోచనను అభినందించారు.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…