సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక వీడియో చూసి కదిలిపోయాడు. అతను ట్విట్టర్లో షేర్ చేసిన ఆ వీడియో చూస్తే ఎవ్వరికైనా హృదయం ద్రవిస్తుందనడంలో సందేహం లేదు. ఆ వీడియో తీసింది ఎక్కడ అన్న వివరాలు లేవు కానీ.. కరోనా వేళ ఆదరవు లేని వృద్ధుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి సదరు వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. తమిళనాడులోనిదిగా భావిస్తున్న ఆ వీడియోలో ఏం ఉందంటే..?
ఒక అనాథ వృద్ధురాలు రోడ్డు పక్కన కూర్చుని ఉండగా.. ఎవరో తీసుకెళ్లి నీళ్ల బాటిల్, ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారు. వాటిని ఎంతో ఆశగా ఆ వృద్ధురాలు తీసుకోవడం.. ఆమె ముఖంలో ఎక్కడ లేని సంతోషం విల్లివిరియడం.. చేతులెత్తి మొక్కడం కనిపించింది. ఇక వీడియోలో ఆఖరి దృశ్యం మరింత భావోద్వేగానికి గురి చేసేదే. తనకు ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్, నీళ్ల బాటిల్కు డబ్బులివ్వాలేమో అనుకుని తన చీర కొంగులో దాచుకున్న చిన్న మొత్తం ఇవ్వబోయింది. వద్దంటే సరే అని దాచుకుంది. కరోనా వేళ అనాథలైన వృద్ధుల దయనీయ స్థితికి ఈ వీడియో అద్దం పడుతోంది. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన తమన్.. ఇది చూశాక వృద్ధాశ్రమం నిర్మించాలని తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
“వీడియో చూసి నా హృదయం ముక్కలైంది. ఓ వద్ధాశ్రమాన్ని నిర్మించాలనే ఆలోచన వెంటనే మొదలైంది. త్వరలోనే ఆ పనులు మొదలుపెడతాను. నాకు ఆ భగవంతుడు ఆశీర్వాదంతో పాటు బలాన్ని అందిస్తాడని భావిస్తున్నాను. ఈ మెసేజ్ టైప్ చేస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆహారాన్ని వృథా చేయకండి. అవసరంలో ఉన్నవారికి ఆహారాన్ని అందించండి. మనుషుల్లాగా ఉండండి” అని తమన్ పేర్కొన్నాడు. తమన్ షేర్ చేసిన వీడియో ఎంతోమందిని కదిలించింది. భావోద్వేగంతో కామెంట్లు పెట్టారు. తమన్ ఆలోచనను అభినందించారు.
This post was last modified on April 26, 2021 10:28 am
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…