ఒకప్పట్లా సినిమాలు ఎక్కువ, వెబ్ వెబ్ సిరీస్లు తక్కువ అనే అభిప్రాయం నటుల్లో ఇప్పుడు లేదు. ముఖ్యంగా ఈ విషయంలో హీరోయిన్ల ఆలోచన ధోరణి మారిపోయింది. భవిష్యత్ అంతా డిజిటల్ మీడియందే అని అర్థం చేసుకుని సినిమాల్లో అవకాశాలు తగ్గాక కూడా కెరీర్ను కొనసాగించేలా వెబ్ సిరీస్ల వైపు అడుగులు వేస్తున్నారు. కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత లాంటి అగ్ర కథానాయకులు ఇప్పటికే వెబ్ సిరీస్లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కాజల్ నటించిన లైవ్ టెలికాస్ట్, తమన్నా చేసిన లెవంత్ అవర్ విడుదలయ్యాయి. కానీ వాటికి ఆశించిన స్పందన రాలేదు.
ముఖ్యంగా తమన్నా లెవంత్ అవర్ గురించి చేసిన ప్రచారానికి తగ్గట్లు కంటెంట్ లేకపోయింది. ఆహాలో ఇటీవలే విడుదలైన ఈ సిరీస్కు యావరేజ్ రివ్యూలు వచ్చాయి. వెబ్ సిరీస్లంటేనే లెంగ్త్ ఎక్కువ కాబట్టి సిరీస్ చాలా బాగుందని టాక్ వస్తే తప్ప ఆదరణ ఉండదు. ఈ విషయంలో లెవంత్ అవర్ నిరాశ పరచడంతో ఆశించిన స్పందన లేకపోయింది. డిజిటల్ మీడియంలో తొలి అడుగు తడబడ్డప్పటికీ తమన్నా ఏమీ తగ్గట్లేదని సమాచారం. తనను లాంచ్ చేసిన ఆహాతోనే కంటిన్యూ కాబోతోందట.
ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం తమన్నా మరో వెబ్ సిరీస్ చేయనుందట. ఓ యువ దర్శకుడు దీన్ని డైరెక్ట్ చేయనున్నాడట. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే సిరీస్ సెట్స్ మీదికి వెళ్తుందని అంటున్నారు. మరోవైపు ఆహా కోసం ఒక వెరైటీ టాక్ షో కూడా చేయబోతోందట తమన్నా. ఇప్పటికే సమంత, రానాల టాక్ షోలు ఇందులో ప్రసారం అవుతున్నాయి. వాటికి భిన్నమైన కాన్సెప్ట్తో షో ప్లాన్ చేస్తున్నారని.. తమన్నా దీన్ని హోస్ట్ చేయడానికి అంగీకరించిందని సమాచారం. చూస్తుంటే సినిమా అవకాశాలు ఏమైనప్పటికీ మున్ముందు తమన్నా కెరీర్కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది.
This post was last modified on April 24, 2021 9:33 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…