కొన్ని సినిమాలకు దక్కే ఫలితం చూస్తే ప్రేక్షకుల నాడి పట్టుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. వాళ్లు ఎప్పుడు ఏ సినిమాను ఆదరిస్తారో.. ఏ సినిమాను తొక్కి పడేస్తారో అర్థం కాదు. కొన్నిసార్లు మంచి టాక్ వచ్చిన సినిమాను కూడా థియేటర్లకు వెళ్లి చూడరు. కొన్నిసార్లు యావరేజ్ టాక్ దక్కించుకున్న సినిమాను విరగబడి చూసేస్తుంటారు. ఓ మోస్తరు విజయం అందుకోవాల్సిన సినిమాలు బ్లాక్బస్టర్లు అవుతుంటాయి. మినిమం గ్యారెంటీ అనుకున్న చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేస్తుంటాయి.
ఈ మధ్య కాలంలో మంచి సినిమాలు అనుకున్న కొన్నింటిని థియేటర్లలో ఉండగా పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు.. ఓటీటీల్లో వచ్చాక వాటిని గొప్పగా ఆదరించిన సందర్భాలున్నాయి. గత ఏడాది ‘పలాస 1978’, ‘రాజావారు రాణి వారు’ లాంటి సినిమాల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు నాగార్జున చిత్రం ‘వైల్డ్ డాగ్’ విషయంలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
ఏప్రిల్ 2న రిలీజైన ‘వైల్డ్డ్ డాగ్’కు మంచి టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ చిత్రానికి వసూళ్లు ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు. ఓపెనింగ్స్ లేవు. తర్వాత కూడా సినిమా పుంజుకోలేదు. కేవలం రూ.3 కోట్ల షేర్తో సరిపెట్టుకుందా సినిమా. నాగార్జున లాంటి పెద్ద హీరో సినిమాకు ఇంత తక్కువ వసూళ్లు రావడం అనూహ్యం. కరోనా కారణమా అనుకుందామంటే తర్వాతి వారంలో వచ్చిన ‘వకీల్ సాబ్’కు వసూళ్ల మోత మోగిపోయింది. మరి ‘వైల్డ్ డాగ్’ ఎందుకు ప్రేక్షకులకు ఆకర్షించలేకపోయిందో ఏమో? కానీ ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్లో రిలీజైతే తెలుగు వాళ్లే కాక వివిధ భాషల వాళ్లు బాగానే చూస్తున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఇండియా వైడ్ ట్రెండ్ అవుతోందీ సినిమా. వివిధ భాషల వాళ్లు సినిమా చూసి.. బాగుందని ట్వీట్లు వేస్తున్నారు. మన వాళ్లు కూడా సినిమా చూసి మెచ్చుకుంటూ, ఇది థియేటర్లలో ఎందుకు ఆడలేదని ఆశ్చర్యపోతుండటం గమనార్హం.
This post was last modified on April 24, 2021 5:17 pm
ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…