Movie News

సునీల్ భార్యగా అనసూయ


టీవీ యాంకర్లను సామాన్య జనం చూసే దృష్టి కోణాన్నే మార్చేసిన వాళ్లలో అనసూయ ఒకరు. యాంకర్ అంటే మరీ ట్రెడిషనల్‌గా కనిపించాల్సిన అవసరం లేదని, సెక్సీగానూ దర్శనమివ్వొచ్చని చూపించి.. తన గ్లామర్‌తో జబర్దస్త్ లాంటి షోలకే ఆకర్షణ తెచ్చిన ఘనత అనసూయకు దక్కుతుంది. ఐతే బుల్లితెరపై ఎంత గ్లామర్ విందు చేసినా.. వెండి తెర మీద మాత్రం ఆమె ఏదో ఒక ప్రత్యేకత ఉన్న పాత్రలే చేసింది. అందులో ‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్ర ఒకటి. ఆ పాత్ర అనసూయకు ఎంత గుర్తింపు తెచ్చిందో తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఆ స్థాయి క్యారెక్టర్ చేయలేదు.

ఐతే ఇప్పుడు మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో అనసూయ నటిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న ‘పుష్ప’ షూట్‌లో ఇటీవలే అనసూయ జాయిన్ అయింది. ముందు కాస్టింగ్ ఎంపిక సమయంలో అనసూయకు చోటు లేదు. కానీ తర్వాత ఆమెను ఓ పాత్ర కోసం ఎంచుకున్నాడు సుక్కు.

‘రంగస్థలం’లో మాదిరి ‘పుష్ప’లో అనసూయది మరీ పెద్ద పాత్రేమీ కాదట. ఆమెకు తక్కువ సన్నివేశాలే ఉన్నాయి. కానీ కథలో కీలకంగానే ఉంటుందట. ఆమె పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని, ఇందులో సునీల్‌కు భార్యగా తను కనిపించనుందని సమాచారం. పూర్తిగా రాయలసీమ యాసతో సాగే ఈ పాత్ర నచ్చి తక్కువ నిడివి అయినా సరే చేయడానికి ముందుకు వచ్చిందట అనసూయ. ప్రస్తుతం సునీల్, అనసూయ కాంబినేషన్లో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కొన్ని రోజులుగా అల్లు అర్జున్ అయితే షూటింగ్‌కు రావట్లేదని.. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హీరోతో ముడిపడ్డ భారీ సన్నివేశాల చిత్రీకరణ వాయిదా వేసి.. చిన్న చిన్న సీన్లు తీసేస్తున్నారని సమాచారం.

ఇక ఈ సినిమా ముందు అనుకున్నట్లు ఆగస్టు 13కు రావడం దాదాపు అసాధ్యం అన్నది చిత్ర వర్గాల మాట. అసలే షూటింగ్ ఆలస్యమవుతుంటే.. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు షెడ్యూళ్లన్నీ మారిపోయాయని.. కాబట్టి కొత్త డేట్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.

This post was last modified on April 24, 2021 5:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

44 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago