Movie News

ఇద్దరూ కుర్రాళ్లే.. బాలయ్య ఫ్యాన్స్ కు మాస్ ఫెస్టివల్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ చిత్రంలో నటిస్తున్నారు. తనకు అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అఖండ తర్వాత బాలయ్య చిత్రాల లైనప్ ఆసక్తిగా మారుతోంది. 

ఇటీవల కాలంలో బాలయ్యకు బోయపాటి మినహా ఇతర దర్శకులు సరైన హిట్ అందించడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా బాలయ్యని ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా ప్రజెంట్ చేయడంలో దర్శకులు విఫలమయ్యారు. కానీ బోయపాటితో మాత్రం బాలయ్యకు సింక్ కుదిరింది. అందుకే వీరి కాంబోలో విజయాలు వస్తున్నాయి. 

ఇతర దర్శకులు కూడా ఇప్పటి ట్రెండ్ కు తగ్గ కథలో బాలయ్యని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య పవర్ ఫుల్ గా కనిపించినప్పటికీ కథ అవుట్ డేటెడ్ అయితే ఆడియన్స్ రిజెక్ట్ చేసేస్తారు. ఇకపై ఆ నిరాశ బాలయ్య అభిమానులకు ఉండకపోవచ్చు. 

అఖండ తర్వాత బాలయ్య ఇద్దరు క్రేజీ కుర్ర దర్శకుల దర్శత్వంలో నటించబోతున్నారు. క్రాక్ తో ఘనవిజయం సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని, వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి లతో బాలయ్య చిత్రాలు ఖరారైనట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక అనిల్ రావిపూడి కూడా ఇటీవలే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వీరిద్దరి కాంబోలో చిత్రానికి బాలయ్య పుట్టిన రోజున అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ తో మరో చిత్రం చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా ఆగడంతో అనిల్ బాలయ్యని లైన్ లో పెట్టాడు.

This post was last modified on April 24, 2021 11:20 am

Share
Show comments

Recent Posts

సునీతా 9 నెలల అంతరిక్ష ప్రయాణం… సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

25 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

1 hour ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

1 hour ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

2 hours ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

3 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

3 hours ago