కరోనా ధాటికి యంగ్ హీరోలు కూడా భయపడిపోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చాలా వరకు భారీ చిత్రాల చిత్రీకరణ ఆపేశారు. తెలుగులో ఆచార్య, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ లాంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. తమిళం, ఇతర భాషల్లోనూ చాలా సినిమాలు ఆగిపోయాయి. సెకండ్ వేవ్ ఉద్ధృతి కొంచెం తగ్గాక చూద్దామని హీరోలు ఇంటి పట్టున ఉంటున్నారు. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సాహసం చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఆయన కొత్త చిత్రం ‘అన్నాత్తె’ షూటింగ్ పరిస్థితులు బాగున్నపుడు ఆగింది. కరోనా ఉద్ధృతి బాగా పెరిగిన సమయంలో ఆ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో పెద్ద ఎత్తున ఈ సినిమా సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. రజినీ మీద దర్శకుడు శివ ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండటం విశేషం. ఈ సన్నివేశంలో చాలా పెద్ద సంఖ్యలోనే కాస్ట్ అండ్ క్రూ పాల్గొంటోంది.
గత ఏడాది డిసెంబరులో రజినీ హైదరాబాద్లోనే ‘అన్నాత్తె’ షూటింగ్లో పాల్గొంటుండగా చిత్ర బృందంలోని కొందరు కరోనా బారిన పడ్డారు. సూపర్ స్టార్కు కరోనా సోకకున్నా కాస్త అస్వస్థత కారణంగా ఆసుపత్రికి వెళ్లారు. దీంతో రజినీ భయపడిపోయారు. కరోనా భయంతో రాజకీయ అరంగేట్రాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత ‘అన్నాత్తె’ షూటింగ్ కొన్ని నెలల పాటు వాయిదా పడింది. ఐతే ఇటీవల మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు.
సెట్లో డాక్టర్ల బృందాన్ని పెట్టుకుని, అత్యంత జాగ్రత్త మధ్య రజినీ షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘అన్నాత్తె’ ఇప్పటికే చాలా ఆలస్యం కావడం, ఈ ఏడాది నవంబరులో దీపావళి కానుకగా సినిమాను రిలీజ్ చేయాల్సిందే అని నిర్ణయం తీసుకోవడంతో రజినీ రిస్క్ చేసి షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఇంకో రెండు నెలల దాకా సమయం పడుతుందని సమాచారం.
This post was last modified on April 24, 2021 10:45 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…