Movie News

మహిళా దర్శకురాలితో మహేష్?

‘సర్కారు వారి పాట’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళితోనే సినిమా చేస్తారని కొన్ని నెలల ముందు వరకు అంతా అనుకుంటూ వచ్చారు. కానీ మధ్యలోకి కొత్తగా ఒక్కో చిత్రం వచ్చి పడుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ అనుకున్న దాని కంటే బాగా ఆలస్యం అవుతుండటమే ఇందుక్కారణం. ‘సర్కారు వారి పాట’ పూర్తి కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు మహేష్. అది ఈ ఏడాది ద్వితీయార్ధంలో మహేష్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు మొదలవుతుంది. వచ్చే ఏడాది మధ్యలోపు సినిమా పూర్తి కావచ్చేమో.

ఐతే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా వాయిదా పడ్డా ఆశ్చర్యం లేదంటున్నారు. రాజమౌళి ఎంత కష్టపడ్డా వచ్చే సంక్రాంతి లోపు అయితే సినిమా వచ్చే అవకాశం లేదంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయ్యాక మహేష్ సినిమాకు స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి తనకు ఏడాది సమయం కావాలని జక్కన్న ముందే చెప్పేశాడు. ఈ నేపథ్యంలో తనకు మరింత ఖాళీ దొరికే అవకాశం ఉండటంతో మహేష్ వేరే దర్శకుల నుంచి కథలు వింటున్నట్లు సమాచారం. ఆ జాబితాలో ఓ మహిళా దర్శకురాలు కూడా ఉన్నారన్నది తాజా కబురు. ఆమె ఎవరో కాదు.. సుధ కొంగర.

‘సాలా ఖడ్డూస్’ (తెలుగులో గురు)తో సుధ ప్రతిభ ఏంటో అందరికీ తెలిసింది. ఇక సూర్యతో తీసిన ‘ఆకాశం నీ హద్దురా’తో ఆమెపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. అజిత్ లాంటి సూపర్ స్టార్‌తో తన తర్వాతి సినిమా చేయబోతోంది సుధ. దాని తర్వాత మహేష్‌తో సినిమా చేయడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయట. కరోనా నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఆపేసి ఇంటిపట్టునే ఉంటున్న మహేష్.. వీడియో కాల్ ద్వారా సుధతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కుదిరితే వచ్చే ఏడాది వీరి కలయికలో సినిమా రావచ్చంటున్నారు.

This post was last modified on April 24, 2021 10:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

1 hour ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

3 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

4 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

5 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

6 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

7 hours ago