దక్షిణాదిన ఏ భాషలో సినిమా హిట్టయినా బాలీవుడ్ వాళ్ల కళ్లు పడిపోతుంటాయి. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కథలు హిందీలోకి వెళ్తుంటాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్టలైన టాలీవుడ్ ఫిలిం మేకర్స్ తీసే సినిమాలపై బాలీవుడ్ వాళ్లు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. కేవలం సినిమాలను రీమేక్ చేయడమే కాదు.. ఇక్కడి సన్నివేశాలు, పాటలు, డైలాగుల నుంచి స్ఫూర్తి పొందడం ఎన్నో సినిమాల్లో గమనించవచ్చు.
ముఖ్యంగా సల్మాన్ ఖాన్కు తెలుగు సినిమాలంటే మహా ప్రీతి. ఒక దశలో బాగా దెబ్బ తిన్న ఆయన కెరీర్ను గాడిన పెట్టుకున్నదే ‘పోకిరి’ రీమేక్ ద్వారా. ఇక అప్పట్నుంచి తెలుగు సినిమాల నుంచి ఇన్స్పైర్ అవుతూనే ఉన్నాడు సల్మాన్. రెడీ, కిక్, స్టాలిన్.. ఇలా సల్మాన్ తెలుగు నుంచి ముచ్చటపడి రీమేక్ చేసుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు సల్మాన్ నుంచి వస్తున్న ‘రాధె’ ఏ తెలుగు సినిమాకూ రీమేక్ కాదు కానీ.. దాని ట్రైలర్ చూస్తుంటే మాత్రం అచ్చంగా తెలుగు సినిమా చూసినట్లే కనిపిస్తోంది.
‘పోకిరి’ సినిమాకు సీక్వెలా అన్నట్లుగా ఉంది ‘రాధె’ సినిమా. ఇందులో సల్మాన్ పోలీసుల కోసం పని చేసే ఏజెంట్ తరహా పాత్రలో నటించాడు. ‘‘ఒకసారి కమిట్మెంట్ తీసుకుంటే నా మాట నేనే వినను’’ అంటూ ‘పోకిరి’ సినిమాను గుర్తు చేసే డైలాగ్ పేల్చాడు సల్మాన్ ఇందులో. కొంత వరకు సల్మాన్ పాత్రలో ‘ఏక్ నిరంజన్’లో హీరో ఛాయలు కనిపించాయి. హీరో క్యారెక్టరైజేషన్, డైలాగులు పూరి జగన్నాథ్ సినిమాలను తలపిస్తున్నాయి.
మరోవైపు అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్ ‘సీటీమార్’ ట్యూన్ను ఈ సినిమాలో వాడేయడం విశేషం. ఇంతకుముందు కూడా బన్నీ సినిమాలోని ఓ పాటను సల్మాన్ వాడుకున్నాడు. ‘రింగ రింగ’ పాటను ‘రెడీ’ రీమేక్లో ఉపయోగించారు. ఆ పాట సూపర్ హిట్టయింది. ఇప్పుడు మళ్లీ బన్నీ పాటను సల్మాన్ వాడుకోవడం స్టైలిష్ స్టార్ అభిమానులకు సంతోషాన్నిస్తోంది. మొత్తంగా చూస్తే ‘రాధె’ సినిమాలో తెలుగు టచ్ బాగా కనిపిస్తుండటంతో మన అభిమానులు ట్రైలర్కు బాగా కనెక్టవుతున్నారు.
This post was last modified on April 22, 2021 2:45 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…