వేసవి సినిమా సందడిపై భారీ అంచనాలతో ఉన్న ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చింది కరోనా మహమ్మారి. గత ఏడాది ఇదే సమయానికి కరోనా జనాలను ఎంతగా కుంగదీసిందో తెలిసిందే. తర్వాత పరిస్థితులు మెరుగు పడ్డాయి. నార్మల్సీ వచ్చేసిందనే అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ విజృంభణతో మళ్లీ కష్టాలు తప్పట్లేదు. సినీ పరిశ్రమ మీద సెకండ్ వేవ్ గట్టి ప్రభావమే చూపేలా ఉంది. వరుసగా కొత్త సినిమాలు వాయిదా పడుతున్నాయి. షూటింగ్స్ ఆగిపోతున్నాయి. సినిమా వాళ్లందరూ ఇంటికి పరిమితం కాక తప్పేలా లేదు.
ఈ సమయంలో ఇక గత ఏడాది లాగే ఈసారి కూడా కొంత కాలం పాటు సినీ ప్రియులను ఎంగేజ్ చేయడానికి సందర్భోచిత అప్డేట్స్ మినహా ఇంకే ఆనందాలు మిగిలేలా లేవు. యంగ్ రెబల్ స్టార్ ఈ వేసవిలో తీరిక లేకుండా షూటింగ్స్లో పాల్గొనాల్సింది. చివరి దశలో ఉన్న ‘రాధేశ్యామ్’తో పాటు ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమాల చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొనాల్సింది.
ముఖ్యంగా ఈ వేసవిలో మేజర్ డేట్స్ ‘ఆదిపురుష్’కు ఇచ్చాడు ప్రభాస్. ఆ సినిమా కోసం లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ కరోనా పుణ్యమా అని ఆ ప్రణాళికలు దెబ్బ తిన్నాయి. షూటింగ్ ఆపేసి కూర్చుంది టీమ్. ఐతే ఈ ఖాళీ సమయంలో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి సిద్ధమయ్యాడు దర్శకుడు ఓం రౌత్. ‘ఆదిపురుష్’ నుంచి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్లు అతను వెల్లడించాడు.
ఈ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర్నుంచి ఉదయం 7.11 నిమిషాలకే ప్రతి అప్డేట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒరవడిని కొనసాగిస్తూ బుధవారం ఉదయం 7.11కు అప్డేట్ ఇవ్వబోతున్నట్లు ఓం రౌత్ వెల్లడించాడు. బహుశా బుధవారం శ్రీరామ నవమి కానుగా ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారేమో. రౌత్ ఇలా ‘ఆదిపురుష్’ గురించి ట్వీట్ వేశాడో లేదో.. ఈ సినిమాకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయిపోవడాన్ని బట్టి ఈ ప్రాజెక్టుపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on April 20, 2021 5:27 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…