సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ మధ్య సంక్రాంతి హీరో అయిపోయాడు. గత రెండేళ్లూ సంక్రాంతికి ఆయన సినిమాలు వచ్చాయి. 2019లో పేట రిలీజైతే 2020లో దర్బార్ సంక్రాంతికి సందడి చేసింది. ఆయన తర్వాతి ఏడాది కూడా సంక్రాంతికి తన సినిమాను రేసులో నిలబెట్టేశాడు. ఆ సినిమానే.. అన్నాతె. తెలుగులో శౌర్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమై తమిళంలో అజిత్తో వీరం, వేదాళం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన శివ డైరెక్షన్లో రజనీ ఈ చిత్రాన్ని చేస్తునన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్కు బ్రేక్ పడింది. సినిమా ఆలస్యమైంది. ఐతే లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో.. షూటింగులు ఎప్పుడు పునఃప్రారంభమవుతాయో క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఈ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఉన్నట్లుండి రిలీజ్ డేట్ గురించి ఓ వీడియో రిలీజ్ చేసింది. అన్నాతె సంక్రాంతికి రిలీజవుతుందని ప్రకటించింది.
ఆర్ఆర్ఆర్ వచ్చే సంక్రాంతికే షెడ్యూల్ అయిన నేపథ్యంలో ఇటు తెలుగులో, అటు తమిళంలో వేరే పెద్ద సినిమాల సందడి లేకపోవచ్చని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యమవుతుండటంతో ఆ సినిమా సంక్రాంతికి రావడం కష్టమని తేలిపోయింది. తెలుగులో వకీల్ సాబ్ లేదంటే ఆచార్య సంక్రాంతికి వచ్చే అవకాశముంది.
తమిళంలో ముందుగా రజనీ బెర్తు బుక్ చేసేశాడు. అన్నాతెలో కీర్తి సురేష్, మీనా, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. శివ గత సినిమాల స్టయిల్లోనే ఇది కూడా రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగే మాస్ సినిమా అని తెలుస్తోంది.
This post was last modified on May 13, 2020 9:06 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…