అక్కినేని కుటుంబానికి అల్లు వారు పెద్ద సాయమే చేసి పెట్టారు ఒకప్పుడు. నాగచైతన్య కెరీర్ ఆరంభంలో నత్తనడకన సాగుతున్న సమయంలో అతడితో సుకుమార్ దర్శకత్వంలో ‘100 పర్సంట్ లవ్’ సినిమాను నిర్మించింది అల్లు అరవిందే. ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్టే అయింది. చైతూకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది.
ఇప్పుడు చైతూను మించి ఇబ్బంది పడుతున్న అఖిల్ను అరవింద్ తన చేతుల్లోకి తీసుకున్నారు. వరుసగా మూడు ఫ్లాపులతో అల్లాడిపోయిన నాగ్ చిన్న కొడుకును హీరోగా పెట్టి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాను నిర్మిస్తున్నాడు అరవింద్.
పూజా హెగ్డే లాంటి టాప్ హీరోయిన్ని ఈ సినిమాకు కథానాయికగా తీసుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అల్లు అరవింద్ ఎంపిక చేసిన కథ అంటే కచ్చితంగా ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకం నాగార్జునలోనూ ఉంది.
ఇలా ఇద్దరు కొడుకుల్ని పెట్టి సినిమాలు తీసిన అరవింద్ కోసం నాగ్ కూడా తన వంతు సాయం చేయబోతున్నాడు. అరవింద్ ఆరంభించిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కొన్ని వెబ్ సిరీస్లు చేసి పెట్టనుందట. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అన్నాక కేవలం సినిమాలతో సరిపెడితే సరిపోదు.
ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. ఇప్పటికే కొన్ని సిరీస్లను రూపొందించారు.. కంటెంట్ ఇంకా చాలా అవసరం ఉంది. అందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఐతే అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ఏర్పాటైన ఫిలిం స్కూల్లో చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు.
వీరి సాయంతో తక్కువ బడ్జెట్లో కొన్ని వెబ్ సిరీస్లు ప్రొడ్యూస్ చేసి ‘ఆహా’కు ఇవ్వాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ప్రియదర్శి ప్రధాన పాత్రలో ‘లూజర్’ అనే సిరీస్ను జీ5 కోసం చేసి పెట్టింది నాగ్ స్టూడియో. అలాగే అరవింద్ కోసం కొన్ని సిరీస్లు చేసి ఆయన రుణం తీర్చుకోవాలని చూస్తున్నాడు నాగ్.
This post was last modified on May 13, 2020 9:08 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…