Movie News

అల్లు వారి రుణం తీర్చుకుంటున్న అక్కినేని

అక్కినేని కుటుంబానికి అల్లు వారు పెద్ద సాయమే చేసి పెట్టారు ఒకప్పుడు. నాగచైతన్య కెరీర్ ఆరంభంలో నత్తనడకన సాగుతున్న సమయంలో అతడితో సుకుమార్ దర్శకత్వంలో ‘100 పర్సంట్ లవ్’ సినిమాను నిర్మించింది అల్లు అరవిందే. ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్టే అయింది. చైతూకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది.

ఇప్పుడు చైతూను మించి ఇబ్బంది పడుతున్న అఖిల్‌ను అరవింద్ తన చేతుల్లోకి తీసుకున్నారు. వరుసగా మూడు ఫ్లాపులతో అల్లాడిపోయిన నాగ్ చిన్న కొడుకును హీరోగా పెట్టి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాను నిర్మిస్తున్నాడు అరవింద్.

పూజా హెగ్డే లాంటి టాప్ హీరోయిన్ని ఈ సినిమాకు కథానాయికగా తీసుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అల్లు అరవింద్ ఎంపిక చేసిన కథ అంటే కచ్చితంగా ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకం నాగార్జునలోనూ ఉంది.

ఇలా ఇద్దరు కొడుకుల్ని పెట్టి సినిమాలు తీసిన అరవింద్ కోసం నాగ్ కూడా తన వంతు సాయం చేయబోతున్నాడు. అరవింద్ ఆరంభించిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కొన్ని వెబ్ సిరీస్‌లు చేసి పెట్టనుందట. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అన్నాక కేవలం సినిమాలతో సరిపెడితే సరిపోదు.

ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. ఇప్పటికే కొన్ని సిరీస్‌లను రూపొందించారు.. కంటెంట్ ఇంకా చాలా అవసరం ఉంది. అందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఐతే అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ఏర్పాటైన ఫిలిం స్కూల్‌లో చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు.

వీరి సాయంతో తక్కువ బడ్జెట్లో కొన్ని వెబ్ సిరీస్‌లు ప్రొడ్యూస్ చేసి ‘ఆహా’కు ఇవ్వాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ప్రియదర్శి ప్రధాన పాత్రలో ‘లూజర్’ అనే సిరీస్‌ను జీ5 కోసం చేసి పెట్టింది నాగ్ స్టూడియో. అలాగే అరవింద్ కోసం కొన్ని సిరీస్‌లు చేసి ఆయన రుణం తీర్చుకోవాలని చూస్తున్నాడు నాగ్.

This post was last modified on May 13, 2020 9:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్… జైలుకు తరలింపు

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…

2 hours ago

అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. స్టాలిన్ కు కష్టమే

దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న…

3 hours ago

కూట‌మికి నేటితో ప‌ది నెల‌లు.. ఏం సాధించారంటే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి శుక్ర‌వారంతో 10 మాసాలు గ‌డిచాయి. గ‌త ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి స‌ర్కారుకొలువు…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బహుమతిగా రూ.4 కోట్లు ఇచ్చిన బీజేపీ

హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే…

4 hours ago

అధికారం కూటమి వద్ద.. జనం జగన్ వద్ద: పేర్ని నాని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…

4 hours ago

పోలీసులపై వైసీపీ మాజీ ఎంపీ ఫైరింగ్ చూశారా?

వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…

5 hours ago