Movie News

బాలయ్య కోసం ‘క్రాక్’ ఫార్ములానే


‘బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్’.. ఈ మధ్య టాలీవుడ్‌ను ఆకర్షిస్తున్న ఫార్ములా ఇది. మామూలుగా నిజ జీవిత ఘటనల నేపథ్యంలో సినిమాలంటే రియలిస్టిక్ మూవీసే తీస్తారు కానీ.. మాస్, కమర్షియల్ సినిమాలకు ఈ ఫార్ములాను పెద్దగా వాడుకోరు. ఐతే ఈ మధ్య ‘క్రాక్’ సినిమాను వాస్తవ ఘటనల ఆధారంగా తీసి దర్శకుడు గోపీచంద్ మలినేని భారీ విజయాన్నందుకున్నాడు. తన తర్వాతి సినిమాకు కూడా అతను ఇదే బాటలో వెళ్లబోతున్నాడు.

నందమూరి బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ లాంటి భారీ సంస్థలో గోపీచంద్ తన తర్వాతి సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా గోపీచంద్ వాస్తవ ఘటనల ఆధారంగానే తెరకెక్కించబోతుండటం విశేషం. ‘క్రాక్’ సినిమాకు ఒంగోలు నేపథ్యాన్ని ఎంచుకుని, అక్కడ చాలా ఏళ్ల కిందట జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా తీశాడు గోపీచంద్. ఆ సినిమాలో విలన్‌గా కనిపించే కఠారి కృష్ణ పాత్ర వాస్తవంగా ఇప్పటికీ అక్కడ ఉండటం విశేషం. రవితేజ పాత్రను సైతం ఓ పోలీస్ అధికారి జీవితం స్ఫూర్తితోనే రాసుకున్నాడు గోపీచంద్.

ఇప్పుడు బాలయ్య సినిమాకు సైతం ఒంగోలు నేపథ్యాన్నే ఎంచుకున్నాడు గోపీచంద్. ఇది గోపీచంద్ స్వస్థలం కావడం విశేషం. బాలయ్య సినిమాకు స్క్రిప్టు తీర్చిదిద్దే క్రమంలో గోపీచంద్ ఒంగోలుకు వెళ్లిపోయాడు. అక్కడ వందేళ్ల చరిత్ర ఉన్న గ్రంథాలయంలో పాత పుస్తకాలను తిరగేస్తున్నాడు గోపీచంద్. లైబ్రరీలో గోపీచంద్ రీసెర్చ్ చేస్తున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చాయి. బాలయ్య సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కబోతుండటం ఆసక్తి రేకెత్తించేదే.

‘క్రాక్’కు ముందు వరకు గోపీచంద్ సినిమాలు మరీ మూసగా అనిపించేవి. ‘క్రాక్’ సైతం మాస్ మసాలా సినిమానే అయినప్పటికీ.. అందులో హీరో, విలన్ పాత్రలను తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకుంది. నిజ జీవిత పాత్రల నుంచి స్ఫూర్తి పొందడం వల్ల ఈ క్యారెక్టర్లకు జనం బాగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. మరి బాలయ్య సినిమాలో గోపీచంద్ ఇలాంటి విశేషాలు ఇంకెన్ని చూపిస్తాడో చూడాలి మరి.

This post was last modified on April 15, 2021 4:10 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

2 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

2 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

3 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

3 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

3 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

3 hours ago