వకీల్ సాబ్ సినిమాను ఇరుకున పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో అధికారులు, మంత్రులు గట్టి ప్రయత్నమే చేశారు. ఎన్నడూ లేని విధంగా ఉన్నట్లుండి ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ తీసుకొచ్చారు. బెనిఫిట్ షోలు, అదనపు షోలు రద్దుచేయడాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ.. టికెట్ల రేట్ల గురించి ఉన్నట్లుండి ఎక్కడలేని పట్టుదల చూపించడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పటిదాకా చాలా సినిమాలకు తొలి వారం రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వగా.. ఉన్నట్లుండి వకీల్ సాబ్కు ఆ విషయంలో మొండిచేయి చూపించారు. అంతే కాక చాలా ఏళ్ల కిందటి రేట్ల కార్డుల్ని బయటికి తీసి వాటినే అమలు చేయాలనడంలో ఎగ్జిబిటర్లకు ఏమీ పాలు పోలేదు.
ఐతే పవన్ను ఇరుకున పెట్టాలని చూశారు కానీ.. మధ్యలో దెబ్బ తినేది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అనే విషయం మరిచారు. ఓ మంత్రి పనిగట్టుకుని ప్రెస్ మీట్లో, మరో మంత్రి ఓ రాజకీయ సభలో వకీల్ సాబ్ టికెట్ల వ్యవహారం గురించి మాట్లాడటం గమనార్హం.
ఐతే వకీల్ సాబ్ సినిమాకు నష్టం చేయడానికి ఏపీ అధికార పార్టీ గట్టిగానే ప్రయత్నించింది కానీ.. వాళ్ల లక్ష్యం నెరవేరినట్లయితే కనిపించడం లేదు. తక్కువ రేట్లతోనే వకీల్ సాబ్ భారీ వసూళ్లు రాబట్టింది ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలో. వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేకుండా వకీల్ సాబ్కు ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వసూళ్లు వస్తున్నాయి.
మామూలుగా కొత్త సినిమా రిలీజైతే హీరో సహా టీం అంతా రంగంలోకి దిగి ప్రమోషన్లు చేస్తుంది. కానీ వకీల్ సాబ్ విషయంలో అలా జరగలేదు. పవన్ ఎప్పుడూ తన సినిమాలను ప్రమోట్ చేయడు. మిగతా టీం నుంచి కూడా పెద్దగా ప్రమోషన్లు లేవు. కానీ టికెట్ల గొడవ పుణ్యమా అని ఈ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. కొంతమేర సానుభూతి కూడా వర్కవుటైంది. కాబట్టే వసూళ్లు అంచనాలను మించి పోతున్నట్లున్నాయి. వీక్ డేస్లోనూ ప్యాక్డ్ హౌస్లతో నడుస్తున్న వకీల్ సాబ్ రికార్డులు బద్దలు కొట్టే దిశగా సాగుతోంది.
This post was last modified on April 15, 2021 1:14 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…