పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బౌండరీల అవతల కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. కర్ణాటకలో పవన్ సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయి. అంతకుమించి వసూళ్లు వచ్చే ఏరియా యుఎస్. పవన్ సినిమాలకు ఓ మోస్తరు టాక్ వస్తే చాలు మిలియన్ డాలర్ వసూళ్లన్నవి కేక్ వాక్ అన్నట్లే. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ అక్కడ ప్రిమియర్లతోనే మిలియన్ డాలర్ క్లబ్బులో అడుగు పెట్టడం గమనార్హం.
తన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 3 మిలియన్ డాలర్లు అలవోకగా కొట్టేస్తాడనే పేరుండేది పవన్కు. ఐతే కరోనా తర్వాత యుఎస్ మార్కెట్ దెబ్బ తిన్న మాట వాస్తవం. దేశీయ మార్కెట్తో పోలిస్తే అది పుంజుకోవడం కష్టమైంది. ఐతే ‘జాతిరత్నాలు’ సినిమాతో అక్కడ కూడా ఊపొచ్చింది. ఆ చిత్రం అనూహ్యంగా మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరింది. దీంతో యుఎస్లో తెలుగు సినిమాల మార్కెట్ పూర్వ వైభవం సంతరించుకోబోతున్నట్లే అనిపించింది.
‘వకీల్ సాబ్’కు మంచి టాక్ వస్తే 1.5 మిలియన్ డాలర్లు అలవోకగా కొట్టేస్తుందన్న అంచనాలు కలిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి మంచి రేటు పెట్టారు అక్కడి బయ్యర్లు. 1.3 మిలియన్ డాలర్లు సాధిస్తే అక్కడ బ్రేక్ ఈవెన్ అన్నట్లు. ఇదేమంత కష్ట సాధ్యంగా అనిపించలేదు. ప్రి సేల్స్ జోరుగా సాగడంతో సానుకూల దృక్పథంతో ఉన్నారంతా. కానీ ప్రిమియర్లతో 3 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘వకీల్ సాబ్’.. ఆ తర్వాత అనుకున్నంత జోరు చూపించలేకపోయింది.
శనివారానికి హాఫ్ మిలియన్ క్లబ్బులో అడుగు పెట్టిన ‘వకీల్ సాబ్’ సోమవారానికి 6 లక్షల మార్కును టచ్ చేయగలిగింది. వీకెండ్ తర్వాత సినిమా అనుకున్నంతగా ఊపు చూపించట్లేదు. మంచి టాక్ వచ్చినప్పటికీ ‘వకీల్ సాబ్’ను చూసేందుకు యుఎస్ ప్రేక్షకులు మరీ ఆసక్తితో ఏమీ లేరని స్పష్టమవుతోంది. ఈ మాత్రం టాక్ తెచ్చుకున్న సినిమాకు వీకెండ్లో ఈజీగా మిలియన్ డాలర్లు వచ్చేయాలి. కానీ అలా జరగలేదు. మున్ముందు కూడా సినిమా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. రీమేక్ మూవీ కావడం వల్లో, కరోనా భయాల వల్లో ఈ సినిమాకు ఆశించిన వసూళ్లు రావట్లేదని భావిస్తున్నారు. యుఎస్లో ఈ చిత్రం లాస్ వెంచర్ అయ్యేలాగే ఉంది.
This post was last modified on April 14, 2021 12:23 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…