పాన్ ఇండియా సినిమా కోసం రాజమౌళి తనతో చేసే వరకు వేచి చూడకుండా, సుకుమార్ సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు ‘పుష్ప’ అల్లు అర్జున్. రాజమౌళి దర్శకుడంటే పాన్ ఇండియా అప్పీల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కానీ, సుకుమార్ సినిమా అంటే బాగా పుష్ చేయాలి.
అందుకే పుష్పని పుష్ చేసే పనిలో బన్నీ ఇప్పుడే బిజీ అయ్యాడు. అల వైకుంఠపురములో టైంలోనే అల్లు అర్జున్ ముందు చూపుతో బాలీవుడ్ మీడియాతో టచ్ లోకి వెళ్ళాడు. ఆ సినిమాకి పర భాషలతో సంబంధం లేకపోయినా కానీ బాలీవుడ్ మీడియాతో అల్లు అర్జున్ ఆ సినిమా పేరుతో రిలేషన్ పెంచుకున్నాడు. పుష్ప చిత్రం ప్రమోట్ చేయడం కోసం అక్కడి మీడియాని బన్నీ వాడుతున్నాడు.
ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకపోయినా కానీ ఆ మీడియాకి అల్లు అర్జున్ అప్డేట్స్ ఇస్తూ కాంటాక్ట్ లో ఉంటున్నాడు. అలాగే బన్నీ తరఫున వారికి మంచి బహుమానాలు కూడా వెళుతున్నాయట. మాములుగా మన హీరోలు సినిమా విడుదలకి ముందు మీడియాని మచ్చిక చేసుకోవాలని చూస్తారు. కానీ అల్లు అర్జున్ కి ముందు చూపు ఎక్కువన్నమాట.
This post was last modified on May 12, 2020 3:15 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…