పాన్ ఇండియా సినిమా కోసం రాజమౌళి తనతో చేసే వరకు వేచి చూడకుండా, సుకుమార్ సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు ‘పుష్ప’ అల్లు అర్జున్. రాజమౌళి దర్శకుడంటే పాన్ ఇండియా అప్పీల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కానీ, సుకుమార్ సినిమా అంటే బాగా పుష్ చేయాలి.
అందుకే పుష్పని పుష్ చేసే పనిలో బన్నీ ఇప్పుడే బిజీ అయ్యాడు. అల వైకుంఠపురములో టైంలోనే అల్లు అర్జున్ ముందు చూపుతో బాలీవుడ్ మీడియాతో టచ్ లోకి వెళ్ళాడు. ఆ సినిమాకి పర భాషలతో సంబంధం లేకపోయినా కానీ బాలీవుడ్ మీడియాతో అల్లు అర్జున్ ఆ సినిమా పేరుతో రిలేషన్ పెంచుకున్నాడు. పుష్ప చిత్రం ప్రమోట్ చేయడం కోసం అక్కడి మీడియాని బన్నీ వాడుతున్నాడు.
ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకపోయినా కానీ ఆ మీడియాకి అల్లు అర్జున్ అప్డేట్స్ ఇస్తూ కాంటాక్ట్ లో ఉంటున్నాడు. అలాగే బన్నీ తరఫున వారికి మంచి బహుమానాలు కూడా వెళుతున్నాయట. మాములుగా మన హీరోలు సినిమా విడుదలకి ముందు మీడియాని మచ్చిక చేసుకోవాలని చూస్తారు. కానీ అల్లు అర్జున్ కి ముందు చూపు ఎక్కువన్నమాట.
This post was last modified on May 12, 2020 3:15 pm
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…