2020.. అన్ని రంగాలనూ ఇబ్బందుల్లోకి నెట్టిన సంవత్సరం. సినీ పరిశ్రమ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. మిగతా రంగాలతో పోలిస్తే ఇది దారుణంగా దెబ్బతింది. ఇండస్ట్రీ మనుగడకు ప్రాణాధారమైన థియేటర్ల వ్యవస్థ ఆరేడు నెలల పాటు మూత పడితే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేదేముంది? అందులోనూ సినిమాలకు భారీ వసూళ్లు వచ్చే వేసవిని కరోనా కమ్మేయడంతో నిరుడు సినీ పరిశ్రమ దిక్కు తోచని స్థితిలో పడింది.
ఐతే ఈ ప్రభావం నుంచి మిగతా పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ కొంచెం త్వరగానే కోలుకుంది. పోస్ట్ కరోనా ఎరాలో మన దగ్గర సినిమాలు అంచనాలను మించి ఆడేశాయి. 100 శాతం ఆక్యుపెన్సీ కూడా వచ్చేయడంతో ఇక పరిశ్రమ కష్టాలన్నీ తొలగినట్లే అనుకున్నారు. ఇకపై ఎఫ్పుడూ కరోనా టైంలో ఎదురైన కష్టం ఉండదనే అనుకున్నారు. కానీ గత కొన్ని రోజుల్లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి.
కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని దేశవ్యాప్తంగా మళ్లీ షరతులు తప్పట్లేదు. ఆ ప్రభావం థియేటర్ల మీద బాగా పడుతోంది. అన్ని చోట్లా ఆక్యుపెన్సీని 50 శాతానికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లను పూర్తిగా మూసి వేయక తప్పని పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడకపోవచ్చు కానీ.. 50 శాతం ఆక్యుపెన్సీ పరిమితి అనివార్యం అయ్యేలా ఉంది. దీనికి తోడు ఏపీలో టికెట్ల రేట్లపై ఉన్నట్లుండి నియంత్రణ మొదలవడంతో కొత్త సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ఇప్పటికే లవ్ స్టోరి, టక్ జగదీష్ వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడేలా లేకపోవడంతో తర్వాతి వారాల్లో రావాల్సిన విరాటపర్వం, ఆచార్య, నారప్ప సినిమాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. వాటిని కూడా వాయిదా వేయడం లాంఛనమే అంటున్నారు. మొత్తంగా చూస్తే ‘వకీల్ సాబ్’తో వేసవికి అదిరే ఆరంభం లభించినా.. ఈ క్రేజీ సీజన్కు ఉన్నట్లుండి బ్రేక్ పడిపోయింది. 2020 లాగే 2021 కూడా వెలవెలబోయేట్లే కనిపిస్తోంది. కాకపోతే గత ఏడాదిలా పూర్తిగా సినిమాల్లేని పరిస్థితి ఉండదు కానీ.. ఎప్పుడూ వేసవిలో ఉండే హంగామా మాత్రం ఈసారి కష్టమే.
This post was last modified on April 14, 2021 11:22 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…