నేచురల్ స్టార్ నాని తన 25వ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. అతను విలన్ పాత్రలో నటించిన ఆ సినిమా ‘వి’. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఉగాదికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. థియేటర్లు మూత పడటంతో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
మళ్లీ ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో.. ఈ సినిమాను ఏ సమయంలో రిలీజ్ చేస్తారో క్లారిటీ లేదు. ఈ సినిమాను పూర్తి చేసిన వెంటనే నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమాను మొదలుపెట్టి కొంత మేర చిత్రీకరణలోనూ పాల్గొన్న సంగతి తెలిసిందే. మళ్లీ షూటింగ్లు ఆరంభం కాగానే నాని ఈ చిత్రాన్ని పున:ప్రారంభించనున్నాడు.
ఇప్పుడు ఖాళీ దొరకడంతో తన తర్వాతి సినిమా విషయంలోనూ నాని ఒక నిర్ణయానికి వచ్చేశాడు. కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్న వివేక్ ఆత్రేయతోనే తన 27వ సినిమాను అతను చేయబోతున్నాడు.
‘మెంటల్ మదిలో’తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన వివేక్ ఆత్రేయ ఆ సినిమాతో కమర్షియల్గా ఆశించిన మేర విజయాన్నందుకోలేకపోయాడు. కానీ తర్వాతి సినిమా ‘బ్రోచేవారెవరురా’ మాత్రం సూపర్ హిట్టయింది. దీంతో కమర్షియల్గానూ ఇతను సినిమాను వర్కవుట్ చేయగలడన్న గురి కుదిరింది.
దీంతో నాని అతడికి అవకాశం ఇచ్చాడు. నానితో ఇంతకుముందు ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినమాను ప్రొడ్యూస్ చేయనుంది. ఇటీవలే హీరో, దర్శకుడు, నిర్మాతల మధ్య అంగీకారం కుదిరింది. స్క్రిప్టు కూడా ఓకే అయింది.
వీరి కలయికలో రాబోతున్న సినిమా కామెడీ థ్రిల్లర్ అని అంటున్నారు. లాక్ డౌన్ టైంలో పక్కాగా స్క్రిప్టు రెడీ చేసుకుని.. షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.
This post was last modified on May 12, 2020 2:56 pm
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…
టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ను వరుసగా రెండోసారి గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ గౌరవార్థంగా భారీ నగదు బహుమతి…