నేచురల్ స్టార్ నాని తన 25వ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. అతను విలన్ పాత్రలో నటించిన ఆ సినిమా ‘వి’. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఉగాదికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. థియేటర్లు మూత పడటంతో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
మళ్లీ ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో.. ఈ సినిమాను ఏ సమయంలో రిలీజ్ చేస్తారో క్లారిటీ లేదు. ఈ సినిమాను పూర్తి చేసిన వెంటనే నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమాను మొదలుపెట్టి కొంత మేర చిత్రీకరణలోనూ పాల్గొన్న సంగతి తెలిసిందే. మళ్లీ షూటింగ్లు ఆరంభం కాగానే నాని ఈ చిత్రాన్ని పున:ప్రారంభించనున్నాడు.
ఇప్పుడు ఖాళీ దొరకడంతో తన తర్వాతి సినిమా విషయంలోనూ నాని ఒక నిర్ణయానికి వచ్చేశాడు. కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్న వివేక్ ఆత్రేయతోనే తన 27వ సినిమాను అతను చేయబోతున్నాడు.
‘మెంటల్ మదిలో’తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన వివేక్ ఆత్రేయ ఆ సినిమాతో కమర్షియల్గా ఆశించిన మేర విజయాన్నందుకోలేకపోయాడు. కానీ తర్వాతి సినిమా ‘బ్రోచేవారెవరురా’ మాత్రం సూపర్ హిట్టయింది. దీంతో కమర్షియల్గానూ ఇతను సినిమాను వర్కవుట్ చేయగలడన్న గురి కుదిరింది.
దీంతో నాని అతడికి అవకాశం ఇచ్చాడు. నానితో ఇంతకుముందు ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినమాను ప్రొడ్యూస్ చేయనుంది. ఇటీవలే హీరో, దర్శకుడు, నిర్మాతల మధ్య అంగీకారం కుదిరింది. స్క్రిప్టు కూడా ఓకే అయింది.
వీరి కలయికలో రాబోతున్న సినిమా కామెడీ థ్రిల్లర్ అని అంటున్నారు. లాక్ డౌన్ టైంలో పక్కాగా స్క్రిప్టు రెడీ చేసుకుని.. షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.
This post was last modified on May 12, 2020 2:56 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…