తెలుగులో స్టార్ హీరోలు కొత్త దర్శకులను నమ్మి సినిమాలు చేయడం అరుదు. ఒకవేళ చేసినా కూడా ప్రయోగాల జోలికి వెళ్లరు. సేఫ్గా పక్కా మాస్ మసాలా సినిమాలే చేస్తుంటారు. మాస్ రాజా రవితేజ ఇదే టైపు. ఆయన కొత్త, ఎక్కువ అనుభవం లేని దర్శకులను బాగానే ప్రోత్సహిస్తుంటాడు. కాకపోతే వాళ్లతో కొత్త తరహా సినిమాలు మాత్రం ట్రై చేయడు. పక్కా మాస్ కథ తీసుకొస్తే దర్శకుడి పనితనం తగ్గినా.. తన ఎనర్జీతో సినిమాను కాపాడేయొచ్చని ధీమా కావచ్చు.
గత దశాబ్ద కాలంలో రవితేజ ఇద్దరు కొత్త దర్శకులతో పని చేశాడు. అందులో ఒకరు గోపీచంద్ మలినేని కాగా.. ఇంకొకరు కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ. రవితేజతో వీళ్లిద్దరి తొలి సినిమాలు డాన్ శీను, పవర్ పక్కా మాస్ మసాలా సినిమాలే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మాస్ రాజా మరోసారి కొత్త దర్శకుడితో పని చేయబోతున్నాడు. ఆ దర్శకుడి పేరు.. శరత్ మండవ.
ఈ కొత్త దర్శకుడు చెప్పిన ఓ కథకు రవితేజ ఓకే చెప్పినట్లు సమాచారం. ‘క్రాక్’ తరహాలోనే ఇది కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్టైనర్ అట. కొన్నేళ్ల కిందట ఆంధ్రా ప్రాంతంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. ‘పడి పడి లేచె మనసు’తో చేదు అనుభవం ఎదుర్కొన్నప్పటికీ నిరాశ చెందకుండా ‘విరాటపర్వం’, ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ లాంటి ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టిన యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి.. రవితేజ-శరత్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.
ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్న రవితేజ.. దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అది కూడా పూర్తయ్యాక శరత్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. ‘ఖిలాడి’ మే 28న విడుదల కావాల్సి ఉండగా.. త్రినాథరావు నక్కిన సినిమా కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on April 12, 2021 2:26 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…