తెలుగులో స్టార్ హీరోలు కొత్త దర్శకులను నమ్మి సినిమాలు చేయడం అరుదు. ఒకవేళ చేసినా కూడా ప్రయోగాల జోలికి వెళ్లరు. సేఫ్గా పక్కా మాస్ మసాలా సినిమాలే చేస్తుంటారు. మాస్ రాజా రవితేజ ఇదే టైపు. ఆయన కొత్త, ఎక్కువ అనుభవం లేని దర్శకులను బాగానే ప్రోత్సహిస్తుంటాడు. కాకపోతే వాళ్లతో కొత్త తరహా సినిమాలు మాత్రం ట్రై చేయడు. పక్కా మాస్ కథ తీసుకొస్తే దర్శకుడి పనితనం తగ్గినా.. తన ఎనర్జీతో సినిమాను కాపాడేయొచ్చని ధీమా కావచ్చు.
గత దశాబ్ద కాలంలో రవితేజ ఇద్దరు కొత్త దర్శకులతో పని చేశాడు. అందులో ఒకరు గోపీచంద్ మలినేని కాగా.. ఇంకొకరు కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ. రవితేజతో వీళ్లిద్దరి తొలి సినిమాలు డాన్ శీను, పవర్ పక్కా మాస్ మసాలా సినిమాలే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మాస్ రాజా మరోసారి కొత్త దర్శకుడితో పని చేయబోతున్నాడు. ఆ దర్శకుడి పేరు.. శరత్ మండవ.
ఈ కొత్త దర్శకుడు చెప్పిన ఓ కథకు రవితేజ ఓకే చెప్పినట్లు సమాచారం. ‘క్రాక్’ తరహాలోనే ఇది కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్టైనర్ అట. కొన్నేళ్ల కిందట ఆంధ్రా ప్రాంతంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. ‘పడి పడి లేచె మనసు’తో చేదు అనుభవం ఎదుర్కొన్నప్పటికీ నిరాశ చెందకుండా ‘విరాటపర్వం’, ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ లాంటి ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టిన యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి.. రవితేజ-శరత్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.
ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్న రవితేజ.. దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అది కూడా పూర్తయ్యాక శరత్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. ‘ఖిలాడి’ మే 28న విడుదల కావాల్సి ఉండగా.. త్రినాథరావు నక్కిన సినిమా కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on April 12, 2021 2:26 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…