Movie News

చాన్నాళ్లకు కొత్త దర్శకుడితో మాస్ రాజా

తెలుగులో స్టార్ హీరోలు కొత్త దర్శకులను నమ్మి సినిమాలు చేయడం అరుదు. ఒకవేళ చేసినా కూడా ప్రయోగాల జోలికి వెళ్లరు. సేఫ్‌గా పక్కా మాస్ మసాలా సినిమాలే చేస్తుంటారు. మాస్ రాజా రవితేజ ఇదే టైపు. ఆయన కొత్త, ఎక్కువ అనుభవం లేని దర్శకులను బాగానే ప్రోత్సహిస్తుంటాడు. కాకపోతే వాళ్లతో కొత్త తరహా సినిమాలు మాత్రం ట్రై చేయడు. పక్కా మాస్ కథ తీసుకొస్తే దర్శకుడి పనితనం తగ్గినా.. తన ఎనర్జీతో సినిమాను కాపాడేయొచ్చని ధీమా కావచ్చు.

గత దశాబ్ద కాలంలో రవితేజ ఇద్దరు కొత్త దర్శకులతో పని చేశాడు. అందులో ఒకరు గోపీచంద్ మలినేని కాగా.. ఇంకొకరు కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ. రవితేజతో వీళ్లిద్దరి తొలి సినిమాలు డాన్ శీను, పవర్ పక్కా మాస్ మసాలా సినిమాలే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మాస్ రాజా మరోసారి కొత్త దర్శకుడితో పని చేయబోతున్నాడు. ఆ దర్శకుడి పేరు.. శరత్ మండవ.

ఈ కొత్త దర్శకుడు చెప్పిన ఓ కథకు రవితేజ ఓకే చెప్పినట్లు సమాచారం. ‘క్రాక్’ తరహాలోనే ఇది కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్టైనర్ అట. కొన్నేళ్ల కిందట ఆంధ్రా ప్రాంతంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. ‘పడి పడి లేచె మనసు’తో చేదు అనుభవం ఎదుర్కొన్నప్పటికీ నిరాశ చెందకుండా ‘విరాటపర్వం’, ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ లాంటి ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టిన యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి.. రవితేజ-శరత్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్న రవితేజ.. దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అది కూడా పూర్తయ్యాక శరత్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. ‘ఖిలాడి’ మే 28న విడుదల కావాల్సి ఉండగా.. త్రినాథరావు నక్కిన సినిమా కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశాలున్నాయి.

This post was last modified on April 12, 2021 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

9 hours ago