పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల పవర్ ఏంటో సోషల్ మీడియా మరోసారి చూసింది. పవన్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన గబ్బర్ సింగ్ సినిమా విడుదలై 8 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిన్నట్నుంచి ట్విట్టర్లో పవన్ అభిమానుల సందడి మామూలుగా లేదు. ట్విట్టర్లో మూవీ ట్రెండ్స్కు సంబంధించి పాత రికార్డులన్నీ బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన పవర్ స్టార్ ఫ్యాన్స్.. అనుకున్నది చేసి చూపించారు.
ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలుపెడితే.. సోమవారం సాయంత్రం 6 గంటల్లోపు.. అంటే 24 గంటల వ్యవధిలో ఏకంగా గబ్బర్ సింగ్ హ్యాష్ ట్యాగ్ మీద కోటి 38 లక్షల ట్వీట్లు వేశారు. టాలీవుడ్లోనే కాదు.. ఇండియా మొత్తంలో లార్జెస్ట్ మూవీ ట్రెండ్ ఇదే కావడం విశేషం.
ఇప్పటిదాకా 10 మిలియన్ల మార్కును కూడా ఎవరూ అందుకోక పోగా.. పవన్ ఫ్యాన్స్ ఏకంగా 13.8 మిలియన్లతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. హీరోల ఫ్యాన్స్కు ఇలా ట్రెండ్స్లో రికార్డులు నమోదు చేయడం ఈ మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. ఐతే ఇలాంటి రికార్డుల్లో చాలా వరకు హీరోల సపోర్టుతో నడిచే ఫ్యాన్ గ్రూపులు, పీఓర్వోల పాత్ర చాలా ఉంటోంది. ఫేక్ ఐడీల కోసం బోట్స్ కొని ట్వీట్లు వేయించడం మామూలైపోయింది.
ఐతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విషయంలో ఇలాంటి వాటికి ఆస్కారమే లేదు. ఆయన తన సినిమాల ఊసే ఎత్తడు. ఇందుకోసం ఆయన పీఆర్వోలనూ పెట్టుకోలేదు. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ మాత్రం వీళ్లను బాగా ప్రోత్సహించారు.కేవలం అభిమానులే పంతం పట్టారు. తమ అభిమానాన్నంతా తెచ్చి ట్వీట్ల రూపంలో పోసేశారు. దీంతో కనీ వినీ ఎరుగని రికార్డు నమోదైంది.
This post was last modified on May 12, 2020 12:56 pm
దర్శకధీర రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన కల లాంటి ప్రాజెక్టు మహాభారతం. చాలా పెద్ద స్కేల్ మీద టాలీవుడ్ టాప్…
మార్చి 28 హరిహర వీరమల్లు రావడం లేదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినప్పటికీ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక…
2019 లో స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడినప్పటికి, ఎంతో అభిమానగణం ఉన్నా, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్కు ఇప్పటికే రెండుసార్లు పెళ్లయింది. ముందుగా తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను ప్రేమించి…
హీరోగా ఎంత స్థాయిలో ఉన్నా అభిరుచి కలిగిన నిర్మాతగానూ ఋజువు చేసుకోవాలని తాపత్రయపడుతున్న న్యాచురల్ స్టార్ నాని స్వంత బ్యానర్…
కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల…