పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల పవర్ ఏంటో సోషల్ మీడియా మరోసారి చూసింది. పవన్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన గబ్బర్ సింగ్ సినిమా విడుదలై 8 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిన్నట్నుంచి ట్విట్టర్లో పవన్ అభిమానుల సందడి మామూలుగా లేదు. ట్విట్టర్లో మూవీ ట్రెండ్స్కు సంబంధించి పాత రికార్డులన్నీ బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన పవర్ స్టార్ ఫ్యాన్స్.. అనుకున్నది చేసి చూపించారు.
ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలుపెడితే.. సోమవారం సాయంత్రం 6 గంటల్లోపు.. అంటే 24 గంటల వ్యవధిలో ఏకంగా గబ్బర్ సింగ్ హ్యాష్ ట్యాగ్ మీద కోటి 38 లక్షల ట్వీట్లు వేశారు. టాలీవుడ్లోనే కాదు.. ఇండియా మొత్తంలో లార్జెస్ట్ మూవీ ట్రెండ్ ఇదే కావడం విశేషం.
ఇప్పటిదాకా 10 మిలియన్ల మార్కును కూడా ఎవరూ అందుకోక పోగా.. పవన్ ఫ్యాన్స్ ఏకంగా 13.8 మిలియన్లతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. హీరోల ఫ్యాన్స్కు ఇలా ట్రెండ్స్లో రికార్డులు నమోదు చేయడం ఈ మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. ఐతే ఇలాంటి రికార్డుల్లో చాలా వరకు హీరోల సపోర్టుతో నడిచే ఫ్యాన్ గ్రూపులు, పీఓర్వోల పాత్ర చాలా ఉంటోంది. ఫేక్ ఐడీల కోసం బోట్స్ కొని ట్వీట్లు వేయించడం మామూలైపోయింది.
ఐతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విషయంలో ఇలాంటి వాటికి ఆస్కారమే లేదు. ఆయన తన సినిమాల ఊసే ఎత్తడు. ఇందుకోసం ఆయన పీఆర్వోలనూ పెట్టుకోలేదు. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ మాత్రం వీళ్లను బాగా ప్రోత్సహించారు.కేవలం అభిమానులే పంతం పట్టారు. తమ అభిమానాన్నంతా తెచ్చి ట్వీట్ల రూపంలో పోసేశారు. దీంతో కనీ వినీ ఎరుగని రికార్డు నమోదైంది.
This post was last modified on May 12, 2020 12:56 pm
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…