Chiranjeevi
మిళ, మలయాళ సినిమాల్లో హీరోలు పంచె కట్టులో కనిపించడం మామూలే. సినిమా అంతా కూడా హీరో పంచె కట్టులోనే కనిపించే సినిమాలు చాలానే కనిపిస్తాయి. కానీ మన దగ్గరా పంచె కట్టు సంప్రదాయం ఉన్నప్పటికీ మన హీరోలు మాత్రం ఆ లుక్లో కనిపించడానికి పెద్దగా ఇష్టపడరు. తమిళంలో హీరో పంచెకట్టులో కనిపించిన సినిమాను రీమేక్ చేస్తూ కూడా తెలుగులో వచ్చేసరికి హీరోకు ప్యాంటే తొడిగిస్తుంటారు.
కానీ ఇప్పుడో రీమేక్ విషయంలో మాత్రం హీరోను పూర్తిగా పంచెకట్టులోనే చూపించబోతున్నారట. ఆ హీరో మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. ఆయన కథానాయకుడిగా మలయాళ బ్లాక్బస్టర్ ‘లూసిఫర్’ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్లో హీరో మోహన్ లాల్ పూర్తిగా పంచెకట్టులోనే కనిపిస్తాడు. ఒక్కసారి కూడా ప్యాంటు తొడగడు.
రాజకీయాలతో టచ్ ఉన్న సినిమా కావడంతో హీరోను పంచెలో చూపిస్తే బాగుంటుందని దర్శకుడు మోహన్ రాజా భావించాడట. చిరుకు చెబితే అందుకు ఆయన కూడా అంగీకరించారట. కాబట్టి సినిమా మొత్తం చిరు పంచెకట్టులోనే కనిపిస్తాడని, అభిమానులకు ఇది ట్రీటే అని అంటున్నారు. ఇక ఈ సినిమాకు ‘కింగ్ మేకర్’ అని, ‘అన్న’ టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇంకొన్ని రోజుల్లోనే ‘ఆచార్య’ను పూర్తి చేసి ఈ సినిమా మీదికి వెళ్లిపోనున్నాడు చిరు. సూపర్ గుడ్ ఫిలిమ్స్తో కలిసి చిరు సొంతం సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సూపర్ ఫామ్లో ఉన్న తమన్తోనే ఈ చిత్రానికి మ్యూజిక్ చేయించుకోనున్నారు. ఈ సినిమాలో చిరుకు హీరోయిన్ ఉండదు. హీరో కజిన్గా ఒక లేడీ క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర ఎవరు చేస్తున్నారో వెల్లడి కాలేదు.
This post was last modified on April 11, 2021 2:52 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…