Movie News

వ‌కీల్ సాబ్‌కో న్యాయం.. వైల్డ్ డాగ్‌కో న్యాయ‌మా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌కీల్ సాబ్‌కు వ్య‌తిరేకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు తీవ్ర వివాదాస్ప‌ద‌మే అవుతోంది. మొన్న‌టిదాకా కాస్త పేరున్న సినిమాల‌న్నింటికీ టికెట్ల రేట్లు పెంచుకునే అవ‌కాశం క‌ల్పించింది ఏపీ ప్ర‌భుత్వం. కరోనా కార‌ణంగా నిర్మాత‌లు దెబ్బ తిన్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో సైతం ఈ మేర‌కు సౌల‌భ్యం క‌ల్పించారు. ఏపీలో కూడా కొత్త సినిమాల‌కు రేట్లు పెంచుకోవ‌డానికి గ‌త వారం వ‌ర‌కు ఇబ్బంది లేక‌పోయింది.

ఏప్రిల్ 2న విడుద‌లైన అక్కినేని నాగార్జున చిత్రం వైల్డ్ డాగ్‌తో పాటు కార్తి మూవీ సుల్తాన్‌కు సైతం ఏపీలో రేట్లు పెంచారు. కానీ ఈ వారంలో వ‌కీల్ సాబ్ విష‌యానికొచ్చేస‌రికి ప్ర‌భుత్వ వైఖ‌రి మారిపోయింది. క‌రోనా నేప‌థ్యంలో బెనిఫిట్ షోలు, అద‌న‌పు షోలు ర‌ద్దు చేయ‌డం వ‌ర‌కు ఓకే కానీ.. టికెట్ల రేట్లు విష‌యంలో ష‌ర‌తులు విధించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టికెట్ల రేట్ల మీద నియంత్ర‌ణ ఎప్పుడూ దృష్టిసారిస్తే వివాదానికి ఆస్కార‌మే ఉండేది కాదు. కానీ గ‌త వారం వ‌చ్చిన సినిమాకు రేట్లు పెంచుకునే అవ‌కాశం క‌ల్పించి.. వ‌కీల్ సాబ్‌కు మాత్రం అడ్డుక‌ట్ట వేయ‌డంతో ఈ విష‌యాన్ని రాజ‌కీయ క‌క్షగానే చూస్తున్నారు. ఏపీలోని కొన్ని థియేట‌ర్ల‌లో ఇంకా వ‌కీల్ సాబ్ ఆడుతుండ‌గా, ఆ చిత్రానికి పెంచిన రేట్ల‌తో టికెట్లు అమ్ముతున్న విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు గుర్తించారు. టికెట్ బుకింగ్ యాప్‌లో ఒకే థియేట‌ర్లో వ‌కీల్ సాబ్‌కు ఒక రేటు, వైల్డ్ డాగ్‌కు ఒక రేటు ఉన్న స్క్రీన్ షాట్ల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టి ఇదేం న్యాయం అని ప్ర‌శ్నిస్తున్నారు.

గుంటూరులోని నాజ్ థియేట‌ర్లో వైల్డ్ డాగ్ సినిమాకు గోల్డ్ క్లాస్ రేటు రూ.150 ఉండ‌గా.. అదే థియేట‌ర్లో వ‌కీల్ సాబ్ గోల్డ్ క్లాస్ టికెట్ రేటు రూ.110గా ఉండ‌టం గ‌మ‌నార్హం. దీన్ని బ‌ట్టి వ‌కీల్ సాబ్ మీద జ‌గ‌న్ స‌ర్కారు క‌క్ష‌గ‌ట్టిన‌ట్లే అని ప‌వ‌న్ ఫ్యాన్స్ తీర్మానానికి వ‌చ్చేస్తున్నారు. రాబోయే సినిమాల విష‌యంలో ఎంత క‌చ్చితంగా ఉంటారో చూస్తామ‌ని అంటున్నారు.

This post was last modified on April 11, 2021 8:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గూఢచారి-2 ఎప్పుడు వస్తుంది?

తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…

1 hour ago

ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు వైసీపీ `విలాసం`?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని రుషికొండ‌పై దాదాపు 500 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం వ్య‌యంతో విలాస‌వంతంగా నిర్మించిన ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న…

2 hours ago

విజ‌య‌న్ వ‌ర్సెస్ రేవంత్‌… ర‌చ్చ‌-ర‌చ్చ‌!

కేర‌ళం ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్క‌డ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున‌ ప్ర‌చారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. సీనియ‌ర్…

3 hours ago

ఇండస్ట్రీలో కొత్త ‘అల్లరోడు’

అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…

5 hours ago

ఏడాది తర్వాత… ఈ రోజు విధ్వంసమే

ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…

7 hours ago

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

8 hours ago