పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ సందడి ఇంకో రెండు రోజుల్లోనే మొదలు కాబోతోంది. మూడేళ్లకు పైగా విరామం తర్వాత పవన్ సినిమా రిలీజవుతుండటంతో అభిమానులు మామూలు ఆకలితో లేరు. తమ ఆరాధ్య నటుడిని వెండి తెరపై చూసేందుకు తహతహలాడిపోతున్నారు. కొన్ని రోజుల కిందట ‘వకీల్ సాబ్’ ట్రైలర్ రిలీజ్కే ఎంత హంగామా నడిచిందో తెలిసిందే.
ఇక థియేటర్లలో ఫుల్ సినిమా పడితే వాళ్ల ఆనందానికి అవధులుండవు. అందరి కంటే ముందు, సాధ్యమైనంత త్వరగా పవన్ సినిమా చూడాలని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కాచుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ‘వకీల్ సాబ్’ను ఓవర్సీస్లోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. విదేశాల్లో మాత్రమే ఈ చిత్రం 700 స్క్రీన్లలో రిలీజవుతుండటం విశేషం. ఒక్క యుఎస్లోనే స్క్రీన్ కౌంట్ 285 కావడం గమనార్హం. కొవిడ్ బ్రేక్ తర్వాత ఏ ఇండియన్ సినిమా కూడా ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ కాలేదు.
యుఎస్లో ‘వకీల్ సాబ్’ ప్రి సేల్స్ చూస్తుంటేనే.. అక్కడ బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. వారం కిందటే ప్రిమియర్ షోలకు ప్రి సేల్స్ మొదలుపెట్టగా.. అప్పుడే అవి లక్ష డాలర్ల మార్కును దాటేశాయి. బుధవారం రాత్రికి ప్రి సేల్స్ 2 లక్షల డాలర్ల మార్కును అందుకుంటాయని భావిస్తున్నారు. ఈ ఊపు చూస్తుంటే.. ‘వకీల్ సాబ్’ యుఎస్లో ప్రిమియర్లతోనే హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరిపోతుందని అంచనా వేస్తున్నారు. టాక్ ఎలా ఉన్నా సరే.. వీకెండ్లో మిలియన్ క్లబ్బులో చేరడమూ లాంఛనమే అని భావిస్తున్నారు.
కరోనా విరామం తర్వాత అక్కడ ఇండియన్ సినిమాల్లో మిలియన్ మార్కును అందుకున్న తొలి చిత్రంగా ‘జాతిరత్నాలు’ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. పవన్ సినిమా వీకెండ్లోనే ఆ సినిమా వసూళ్ల రికార్డును దాటడం ఖాయం. ఒకప్పుడు పవన్ సినిమాకు మంచి టాక్ వస్తే వీకెండ్లోనే 2 మిలియన్ డాలర్లు వచ్చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. పాజిటివ్ టాక్ వస్తే ఫుల్ రన్లో 2 మిలియన్ గ్యారెంటీ అనుకోవచ్చు. మరోవైపు ఆస్ట్రేలియాలో సైతం ‘వకీల్ సాబ్’ భారీ స్థాయిలో రిలీజవుతోంది. అక్కడ కూడా అప్పుడే ప్రి సేల్స్ లక్ష డాలర్లను దాటిపోయాయి. అక్కడ ఫుల్ రన్లో హాఫ్ మిలియన్ గ్యారెంటీ అంటున్నారు.
This post was last modified on April 7, 2021 2:56 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…