‘‘మంచి సినిమా తీశాం’’.. ‘‘ఇందులో మంచి సందేశం ఉంది’’.. ‘‘ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది’’.. దర్శక నిర్మాతలు, హీరోల నోటి నుంచి తరచుగా వినిపించే మాటలు ఇవి. ఇలాంటి మాటలు ఒకప్పుడు సినిమాలకు మంచి చేసేవి కానీ.. ఇప్పుడు మాత్రం ఇవే ప్రతికూలంగా మారిపోతున్నాయి. ‘మంచి సినిమా’ అనే ట్యాగ్ వేసుకుంటే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. ఇందుకు గత నెలలో వచ్చిన ‘శ్రీకారం’.. ఈ నెలలో విడుదలైన ‘వైల్డ్ డాగ్’ సినిమాలే ఉదాహరణ.
‘శ్రీకారం’ వ్యవసాయం నేపథ్యంలో, రైతుల సమస్యల గురించి చర్చించిన చిత్రం. అందులో మంచి సందేశం ఉంది. కొంచెం కమర్షియల్ టచ్ ఇస్తూనే ఆలోచింపజేసేలా ఈ సినిమా తీశారు. దర్శకుడు కిషోర్ కొత్తవాడైనప్పటికీ ఉన్నంతలో సినిమాను బాగానే డీల్ చేశాడు. సినిమాకు మంచి టాక్ వచ్చింది. రివ్యూలు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. అందరూ మంచి సినిమా అనే అన్నారు. కానీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లలేదు.
దీనికి పోటీగా విడుదలైన ‘జాతిరత్నాలు’లో ‘మంచి’ అంటూ ఏమీ ఉండదు. అల్లరల్లరిగా సాగుతుందా చిత్రం. దానికే ప్రేక్షకులు పట్టం కట్టారు. మాకు సందేశాలు అవసరం లేదు, వినోదం చాలు అన్న సంకేతాల్ని ప్రేక్షకులు ఇచ్చారు.
గత వారాంతంలో విడుదలైన ‘వైల్డ్ డాగ్’ను చూసిన వాళ్లందరూ కూడా ఇది ‘మంచి సినిమా’ అనే అన్నారు. ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు ఇండియాలో జరిగిన అతి పెద్ద ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. జనాలను ఎంతో ఇన్స్పైర్ చేసే, భావోద్వేగాలు రేకెత్తించే కథాంశంతో తెరకెక్కిన సినిమా అయినా.. దీనికి బాక్సాఫీస్ దగ్గర ప్రతికూల ఫలితమే ఎదురైంది.
నాగ్ లాంటి పెద్ద హీరో నటించిన సినిమా అయినప్పటికీ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. మంచి సినిమా.. అందరూ చూడాల్సిన సినిమా అంటూ చిరంజీవి సైతం ప్రేక్షకులకు పిలుపునిచ్చాడు. కానీ వాళ్లు పట్టించుకోలేదు. వినోద ప్రధానంగా, లేదంటే ఏదైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటే తప్ప ప్రేక్షకులు ఈ రోజుల్లో థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మంచి సినిమా’ అనే ట్యాగ్ ప్రమాదకరంగా మారుతోందన్నది స్పష్టం.
This post was last modified on April 7, 2021 2:57 pm
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…