వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా.. సంచలనాల్ని ఇంటి పేరుగా మార్చుకున్న నటి కమ్ మోడల్ పూనమ్ పాండే ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినిమాల కంటే కూడా సంచలనాలతో కనిపించే పూనమ్.. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమె ప్రయాణిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. తొలుత అదుపులోకి తీసుకున్నప్పటికి.. అనంతరం ఆమెను.. ఆమె బాయ్ ఫ్రెండ్ ను విడిచిపెట్టారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఉదయం నుంచి సాయంత్రం వరకూ లాక్ డౌన్ నిబంధనల్ని కాస్త సడలించినా.. సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి రాకపోకలపై ఆంక్షల్ని విధించారు పోలీసులు. ఇదిలా ఉంటే.. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో బీఎండబ్ల్యూ కారులో తన బాయ్ ఫ్రెండ్ (దర్శకుడు సామ్ అహ్మద్ బాంబే)తో కలిసి ప్రయాణిస్తున్న నటి పూనమ్ పాండేను మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు వారిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని జోన్ వన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంగ్రామ్ సింగ్ నిశందర్ కన్పర్మ్ చేశారు. మెరైన డ్రైవ్ పోలీస్ స్టేషన్ లో వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 188.. 269 కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని విడిచి పెట్టారు. వారు ప్రయాణిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ వేళ.. ఇంట్లో ఉండాల్సింది పోయి.. బాధ్యత లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న పూనమ్ పాండే వ్యవహారం సంచలనంగా మారింది.
This post was last modified on May 11, 2020 3:31 pm
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…