వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా.. సంచలనాల్ని ఇంటి పేరుగా మార్చుకున్న నటి కమ్ మోడల్ పూనమ్ పాండే ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినిమాల కంటే కూడా సంచలనాలతో కనిపించే పూనమ్.. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమె ప్రయాణిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. తొలుత అదుపులోకి తీసుకున్నప్పటికి.. అనంతరం ఆమెను.. ఆమె బాయ్ ఫ్రెండ్ ను విడిచిపెట్టారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఉదయం నుంచి సాయంత్రం వరకూ లాక్ డౌన్ నిబంధనల్ని కాస్త సడలించినా.. సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి రాకపోకలపై ఆంక్షల్ని విధించారు పోలీసులు. ఇదిలా ఉంటే.. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో బీఎండబ్ల్యూ కారులో తన బాయ్ ఫ్రెండ్ (దర్శకుడు సామ్ అహ్మద్ బాంబే)తో కలిసి ప్రయాణిస్తున్న నటి పూనమ్ పాండేను మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు వారిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని జోన్ వన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంగ్రామ్ సింగ్ నిశందర్ కన్పర్మ్ చేశారు. మెరైన డ్రైవ్ పోలీస్ స్టేషన్ లో వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 188.. 269 కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని విడిచి పెట్టారు. వారు ప్రయాణిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ వేళ.. ఇంట్లో ఉండాల్సింది పోయి.. బాధ్యత లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న పూనమ్ పాండే వ్యవహారం సంచలనంగా మారింది.
This post was last modified on May 11, 2020 3:31 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…