వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా.. సంచలనాల్ని ఇంటి పేరుగా మార్చుకున్న నటి కమ్ మోడల్ పూనమ్ పాండే ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినిమాల కంటే కూడా సంచలనాలతో కనిపించే పూనమ్.. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమె ప్రయాణిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. తొలుత అదుపులోకి తీసుకున్నప్పటికి.. అనంతరం ఆమెను.. ఆమె బాయ్ ఫ్రెండ్ ను విడిచిపెట్టారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఉదయం నుంచి సాయంత్రం వరకూ లాక్ డౌన్ నిబంధనల్ని కాస్త సడలించినా.. సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి రాకపోకలపై ఆంక్షల్ని విధించారు పోలీసులు. ఇదిలా ఉంటే.. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో బీఎండబ్ల్యూ కారులో తన బాయ్ ఫ్రెండ్ (దర్శకుడు సామ్ అహ్మద్ బాంబే)తో కలిసి ప్రయాణిస్తున్న నటి పూనమ్ పాండేను మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు వారిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని జోన్ వన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంగ్రామ్ సింగ్ నిశందర్ కన్పర్మ్ చేశారు. మెరైన డ్రైవ్ పోలీస్ స్టేషన్ లో వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 188.. 269 కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని విడిచి పెట్టారు. వారు ప్రయాణిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ వేళ.. ఇంట్లో ఉండాల్సింది పోయి.. బాధ్యత లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న పూనమ్ పాండే వ్యవహారం సంచలనంగా మారింది.
This post was last modified on May 11, 2020 3:31 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…