మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు ఇటీవలే 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎంత హంగామా జరిగిందో తెలిసిందే. చిరంజీవి కూడా ఆ సినిమా విశేషాలు పంచుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. మెగా అభిమానులు దీని మీద ట్విట్టర్లో మామూలు సందడి చేయలేదు.
ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన అనేక విశేషాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాత అశ్వినీదత్ ఇప్పటికే తెర వెనుక విశేషాలు చాలానే వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయం చెప్పారు. ఈ సినిమాకు చిరంజీవి, శ్రీదేవిలకు ఎంత పారితోషకం ఇచ్చిందని.. చివరికి తనకెంత లాభం మిగిలింది ఆయన వెల్లడించారు.
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు గాను చిరంజీవికి రూ.35 లక్షల పారితోషకం ఇచ్చినట్లు దత్ వెల్లడించారు. అప్పట్లో హీరోలతో సమానంగా ఇమేజ్ ఉన్న, బాలీవుడ్లోనూ టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న శ్రీదేవికి పాతిక లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట దత్. అందరి పారితోషకాలు, ఖర్చులు అన్నీ పోను తనకు రూ.35 లక్షలు మిగిలిందని దత్ వెల్లడించారు.
ఐతే ఇప్పటి లెక్కలతో చూస్తే అది చిన్న మొత్తంగా అనిపింవచ్చని.. కానీ అది అప్పట్లో చాలా పెద్ద మొత్తమని అన్నారు దత్. రూ.17-18 లక్షలు మిగిలితే సూపర్ హిట్ అనుకునేవాళ్లని.. అలాంటిది దాని మీద రెట్టింపు లాభం వచ్చిందంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చని దత్ అన్నారు.
తన దగ్గరున్న డబ్బు మొత్తం పెట్టి భారీ బడ్జెట్లో దత్ ఈ సినిమాను నిర్మించారు. బాల్కనీ టికెట్ 6 రూపాయలుగా ఉన్న ఆ రోజుల్లోనే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రూ.7 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఇప్పటి లెక్కలతో పోలిస్తే అది వందల కోట్లన్నట్లే.
This post was last modified on May 11, 2020 6:29 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…