మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు ఇటీవలే 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎంత హంగామా జరిగిందో తెలిసిందే. చిరంజీవి కూడా ఆ సినిమా విశేషాలు పంచుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. మెగా అభిమానులు దీని మీద ట్విట్టర్లో మామూలు సందడి చేయలేదు.
ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన అనేక విశేషాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాత అశ్వినీదత్ ఇప్పటికే తెర వెనుక విశేషాలు చాలానే వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయం చెప్పారు. ఈ సినిమాకు చిరంజీవి, శ్రీదేవిలకు ఎంత పారితోషకం ఇచ్చిందని.. చివరికి తనకెంత లాభం మిగిలింది ఆయన వెల్లడించారు.
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు గాను చిరంజీవికి రూ.35 లక్షల పారితోషకం ఇచ్చినట్లు దత్ వెల్లడించారు. అప్పట్లో హీరోలతో సమానంగా ఇమేజ్ ఉన్న, బాలీవుడ్లోనూ టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న శ్రీదేవికి పాతిక లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట దత్. అందరి పారితోషకాలు, ఖర్చులు అన్నీ పోను తనకు రూ.35 లక్షలు మిగిలిందని దత్ వెల్లడించారు.
ఐతే ఇప్పటి లెక్కలతో చూస్తే అది చిన్న మొత్తంగా అనిపింవచ్చని.. కానీ అది అప్పట్లో చాలా పెద్ద మొత్తమని అన్నారు దత్. రూ.17-18 లక్షలు మిగిలితే సూపర్ హిట్ అనుకునేవాళ్లని.. అలాంటిది దాని మీద రెట్టింపు లాభం వచ్చిందంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చని దత్ అన్నారు.
తన దగ్గరున్న డబ్బు మొత్తం పెట్టి భారీ బడ్జెట్లో దత్ ఈ సినిమాను నిర్మించారు. బాల్కనీ టికెట్ 6 రూపాయలుగా ఉన్న ఆ రోజుల్లోనే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రూ.7 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఇప్పటి లెక్కలతో పోలిస్తే అది వందల కోట్లన్నట్లే.
This post was last modified on May 11, 2020 6:29 pm
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…