మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు ఇటీవలే 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎంత హంగామా జరిగిందో తెలిసిందే. చిరంజీవి కూడా ఆ సినిమా విశేషాలు పంచుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. మెగా అభిమానులు దీని మీద ట్విట్టర్లో మామూలు సందడి చేయలేదు.
ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన అనేక విశేషాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాత అశ్వినీదత్ ఇప్పటికే తెర వెనుక విశేషాలు చాలానే వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయం చెప్పారు. ఈ సినిమాకు చిరంజీవి, శ్రీదేవిలకు ఎంత పారితోషకం ఇచ్చిందని.. చివరికి తనకెంత లాభం మిగిలింది ఆయన వెల్లడించారు.
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు గాను చిరంజీవికి రూ.35 లక్షల పారితోషకం ఇచ్చినట్లు దత్ వెల్లడించారు. అప్పట్లో హీరోలతో సమానంగా ఇమేజ్ ఉన్న, బాలీవుడ్లోనూ టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న శ్రీదేవికి పాతిక లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట దత్. అందరి పారితోషకాలు, ఖర్చులు అన్నీ పోను తనకు రూ.35 లక్షలు మిగిలిందని దత్ వెల్లడించారు.
ఐతే ఇప్పటి లెక్కలతో చూస్తే అది చిన్న మొత్తంగా అనిపింవచ్చని.. కానీ అది అప్పట్లో చాలా పెద్ద మొత్తమని అన్నారు దత్. రూ.17-18 లక్షలు మిగిలితే సూపర్ హిట్ అనుకునేవాళ్లని.. అలాంటిది దాని మీద రెట్టింపు లాభం వచ్చిందంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చని దత్ అన్నారు.
తన దగ్గరున్న డబ్బు మొత్తం పెట్టి భారీ బడ్జెట్లో దత్ ఈ సినిమాను నిర్మించారు. బాల్కనీ టికెట్ 6 రూపాయలుగా ఉన్న ఆ రోజుల్లోనే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రూ.7 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఇప్పటి లెక్కలతో పోలిస్తే అది వందల కోట్లన్నట్లే.
This post was last modified on May 11, 2020 6:29 pm
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…