దర్శక ధీరుడు రాజమౌళి సంకట స్థితిని ఎదుర్కొంటున్నాడిప్పుడు. మామూలుగానే రాజమౌళి సినిమాలంటే అనుకున్న సమయానికి రిలీజ్ కావడం, ఆలస్యం అనివార్యం అనే ముద్ర ఉంది. ఆ ముద్ర సినిమా సినిమాకూ మరింత బలపడుతోంది. జక్కన్న సినిమా అంటే మొదట ప్రకటించిన రిలీజ్ డేట్కు రాదు అని జనాలు బలమైన అభిప్రాయానికి వచ్చేశారు. కనీసం రెండుసార్లు వాయిదా పడక తప్పదని కూడా అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు.
కానీ ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో రెండు వాయిదాలు కూడా సరిపోయేలా లేదు. రెండుసార్లు సినిమాను వాయిదా వేసి.. చివరికి ఈ ఏడాది అక్టోబరు 13న విడుదలకు ముహూర్తం చూడగా, దాన్ని అందుకోవడం పెద్ద టాస్కే అయ్యేలా కనిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా అని ప్రచారం సాగుతున్నప్పటికీ.. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఎలాగైనా అక్టోబరు 13న థియేటర్లోకి దించేద్దాం అని జక్కన్న అండ్ టీం గట్టిగానే ప్రయత్నించింది కానీ.. పరిస్థితులు అనుకూలించడం లేదు.
సరిగ్గా ‘ఆర్ఆర్ఆర్’ కొత్త షెడ్యూల్ కోసం ఆలియా భట్ రావాల్సి ఉ:డగా.. ఆమె బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ కరోనా బారిన పడటంతో తను ఐసోలేషన్కు వెళ్లాల్సి వచ్చింది. ఈ దశ పూర్తి చేసుకుని అయినా ఆలియా వస్తుందేమో అనుకుంటే.. ఇంతలో ఆమెకు కూడా కరోనా అని వెల్లడైంది. దీంతో రెండు మూడు వారాల పాటు ఆమె ఇంటి నుంచి కదిలే అవకాశం లేకపోయింది. దీంతో మళ్లీ షెడ్యూల్ తేడా కొట్టేసేలా ఉంది. షూటింగ్ మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మే నెలాఖరుకు కూడా షూటింగ్ అవ్వకపోతే.. అక్టోబరు 13కు సినిమా సిద్ధం కావడం చాలా కష్టమే. ఈ నేపథ్యంలో రిలీజ్ విషయంలో ఏం చేయాలో పాలుపోని అయోమయంలో జక్కన్న అండ్ టీం ఉన్నట్లు సమాచారం.
This post was last modified on April 2, 2021 3:08 pm
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…