కరోనా బ్రేక్ తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న అతి పెద్ద చిత్రం అంటే.. వకీల్ సాబ్యే. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ కూడా కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు. బాక్సాఫీస్ దగ్గర దీని క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాత దిల్ రాజు భారీ ప్రణాళికలతోనే ఉన్నాడు. ఈ నెల 9న తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమాను నడిపించబోతున్నారు. మల్టీప్లెక్సులు ఒకటీ అరా మినహాయిస్తే షోలన్నింటినీ ‘వకీల్ సాబ్’తో నింపేస్తే ఆశ్చర్యమేమీ లేదు.
తెలుగు రాష్ట్రాల్లో 90 నుంచి 95 శాతం థియేటర్లలో ‘వకీల్ సాబ్’ నడిచే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో సైతం ‘వకీల్ సాబ్’ను భారీ స్థాయిలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విదేశాల్లో సైతం ‘వకీల్ సాబ్’ దూకుడు మామూలుగా ఉండబోదని స్పష్టమైంది.
ఓవర్సీస్లో ‘వకీల్ సాబ్’ రేంజ్ ఏంటో స్వయంగా ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి బోనీ కపూర్ వెల్లడించాడు. విదేశాల్లో ఈ చిత్రం ఏకంగా 700 థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు బోనీ వెల్లడించాడు. కరోనా బ్రేక్ తర్వాత ఓ భారతీయ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున రిలీజవడం ఇప్పుడే. ఈ 700 థియేటర్లలోనూ విడుదలకు ముందు రోజు, ఏప్రిల్ 8న ప్రిమియర్స్ వేయబోతున్నామని, పవర్ స్టార్ మేనియా చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉండాలని బోనీ పిలుపునిచ్చాడు.
ఏపీ, తెలంగాణల్లో కలిపి 2 వేలకు తక్కువ కాకుండా థియేటర్లలో ‘వకీల్ సాబ్’ రిలీజయ్యే అవకాశముంది. ఇక కర్ణాటకలో పవన్ సినిమాలు ఎంత పెద్ద ఎత్తున రిలీజవుతాయో తెలిసిందే. దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ కలుపుకుంటే.. మొత్తంగా వకీల్ సాబ్ సినిమా అటు ఇటుగా 4 వేల థియేటర్లలో రిలీజయ్యే అవకాశముంది.
This post was last modified on April 2, 2021 6:48 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…