కరోనా బ్రేక్ తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న అతి పెద్ద చిత్రం అంటే.. వకీల్ సాబ్యే. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ కూడా కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు. బాక్సాఫీస్ దగ్గర దీని క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాత దిల్ రాజు భారీ ప్రణాళికలతోనే ఉన్నాడు. ఈ నెల 9న తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమాను నడిపించబోతున్నారు. మల్టీప్లెక్సులు ఒకటీ అరా మినహాయిస్తే షోలన్నింటినీ ‘వకీల్ సాబ్’తో నింపేస్తే ఆశ్చర్యమేమీ లేదు.
తెలుగు రాష్ట్రాల్లో 90 నుంచి 95 శాతం థియేటర్లలో ‘వకీల్ సాబ్’ నడిచే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో సైతం ‘వకీల్ సాబ్’ను భారీ స్థాయిలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విదేశాల్లో సైతం ‘వకీల్ సాబ్’ దూకుడు మామూలుగా ఉండబోదని స్పష్టమైంది.
ఓవర్సీస్లో ‘వకీల్ సాబ్’ రేంజ్ ఏంటో స్వయంగా ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి బోనీ కపూర్ వెల్లడించాడు. విదేశాల్లో ఈ చిత్రం ఏకంగా 700 థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు బోనీ వెల్లడించాడు. కరోనా బ్రేక్ తర్వాత ఓ భారతీయ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున రిలీజవడం ఇప్పుడే. ఈ 700 థియేటర్లలోనూ విడుదలకు ముందు రోజు, ఏప్రిల్ 8న ప్రిమియర్స్ వేయబోతున్నామని, పవర్ స్టార్ మేనియా చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉండాలని బోనీ పిలుపునిచ్చాడు.
ఏపీ, తెలంగాణల్లో కలిపి 2 వేలకు తక్కువ కాకుండా థియేటర్లలో ‘వకీల్ సాబ్’ రిలీజయ్యే అవకాశముంది. ఇక కర్ణాటకలో పవన్ సినిమాలు ఎంత పెద్ద ఎత్తున రిలీజవుతాయో తెలిసిందే. దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ కలుపుకుంటే.. మొత్తంగా వకీల్ సాబ్ సినిమా అటు ఇటుగా 4 వేల థియేటర్లలో రిలీజయ్యే అవకాశముంది.
This post was last modified on April 2, 2021 6:48 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…