కరోనా బ్రేక్ తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న అతి పెద్ద చిత్రం అంటే.. వకీల్ సాబ్యే. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ కూడా కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు. బాక్సాఫీస్ దగ్గర దీని క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాత దిల్ రాజు భారీ ప్రణాళికలతోనే ఉన్నాడు. ఈ నెల 9న తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమాను నడిపించబోతున్నారు. మల్టీప్లెక్సులు ఒకటీ అరా మినహాయిస్తే షోలన్నింటినీ ‘వకీల్ సాబ్’తో నింపేస్తే ఆశ్చర్యమేమీ లేదు.
తెలుగు రాష్ట్రాల్లో 90 నుంచి 95 శాతం థియేటర్లలో ‘వకీల్ సాబ్’ నడిచే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో సైతం ‘వకీల్ సాబ్’ను భారీ స్థాయిలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విదేశాల్లో సైతం ‘వకీల్ సాబ్’ దూకుడు మామూలుగా ఉండబోదని స్పష్టమైంది.
ఓవర్సీస్లో ‘వకీల్ సాబ్’ రేంజ్ ఏంటో స్వయంగా ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి బోనీ కపూర్ వెల్లడించాడు. విదేశాల్లో ఈ చిత్రం ఏకంగా 700 థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు బోనీ వెల్లడించాడు. కరోనా బ్రేక్ తర్వాత ఓ భారతీయ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున రిలీజవడం ఇప్పుడే. ఈ 700 థియేటర్లలోనూ విడుదలకు ముందు రోజు, ఏప్రిల్ 8న ప్రిమియర్స్ వేయబోతున్నామని, పవర్ స్టార్ మేనియా చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉండాలని బోనీ పిలుపునిచ్చాడు.
ఏపీ, తెలంగాణల్లో కలిపి 2 వేలకు తక్కువ కాకుండా థియేటర్లలో ‘వకీల్ సాబ్’ రిలీజయ్యే అవకాశముంది. ఇక కర్ణాటకలో పవన్ సినిమాలు ఎంత పెద్ద ఎత్తున రిలీజవుతాయో తెలిసిందే. దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ కలుపుకుంటే.. మొత్తంగా వకీల్ సాబ్ సినిమా అటు ఇటుగా 4 వేల థియేటర్లలో రిలీజయ్యే అవకాశముంది.
This post was last modified on April 2, 2021 6:48 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…