ఇంకొన్ని గంటల్లోనే అక్కినేని నాగార్జున సినిమా ‘వైల్డ్ డాగ్’కు యుఎస్లో ప్రిమియర్స్ పడబోతున్నాయి. ఆ తర్వాత కొన్ని గంటలకు ఇండియాలో సినిమా రిలీజ్ కాబోతోంది. సినిమా ఫలితం కోసం ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్న సమయంలో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ‘వైల్డ్ డాగ్’ పైరసీ ప్రింట్ను ఇంటర్నెట్లో పెట్టేయడం కలకలం రేపుతోంది. పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్ సైట్లో ‘వైల్డ్ డాగ్’ లింక్ ఉన్న స్క్రీన్ షాట్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
ఇంకా థియేటర్లలో రిలీజే కాని సినిమాను పైరసీ చేయడమేంటి.. పైకి ‘వైల్డ్ డాగ్’ పేరు పెట్టి ఇంకేదో సినిమా చూపించారేమో అనుకోవడానికి కూడా లేకపోయింది. సినిమాలోని కొన్ని షాట్లకు సంబంధించిన విజువల్స్ తాలూకు స్క్రీన్ షాట్లు కూడా ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. అవి ట్రైలర్లో చూసినవి కూడా కాదు. కొత్తవి.
దీన్ని బట్టి ‘వైల్డ్ డాగ్’ పైరసీ ప్రింట్ ఇంటర్నెట్లోకి వచ్చిన మాట వాస్తవమే అని అర్థమవుతోంది. ఐతే నాగ్ అభిమానులు వెంటనే స్పందించి నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్కు విషయం చేరవేశారు. వాళ్లు అలెర్ట్ అయి పైరసీ వెబ్ సైట్ నుంచి లింక్ తీయించారు. ఎక్కడైనా లింకులు కనిపిస్తే తమకు వెంటనే చెప్పాలని పిలుపునిచ్చారు. ఐతే ఇంకా థియేటర్లలో బొమ్మ పడకుండానే ఈ సినిమా ఎలా ఇంటర్నెట్లోకి వచ్చిందన్నది ప్రశ్నార్థకం. కచ్చితంగా ఇది ఇంటి దొంగల పనే అన్నది స్పష్టం.
‘అత్తారింటికి దారేది’ సినిమా తరహాలోనే ఎవరో చిత్ర బృందంలోని వారే సినిమాను లీక్ చేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై నిర్మాణ సంస్థ పరిశీలనలో ఏం తేలుతుందో చూడాలి. వరుస డిజాస్టర్లతో అల్లాడిపోతున్న నాగార్జునకు ఈ సినిమా హిట్టవడం చాలా అవసరం. ఇలాంటి స్థితిలో సినిమా పైరసీ కావడం ఆయనతో పాటు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసేదే.
This post was last modified on April 1, 2021 1:52 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…