ఇంకొన్ని గంటల్లోనే అక్కినేని నాగార్జున సినిమా ‘వైల్డ్ డాగ్’కు యుఎస్లో ప్రిమియర్స్ పడబోతున్నాయి. ఆ తర్వాత కొన్ని గంటలకు ఇండియాలో సినిమా రిలీజ్ కాబోతోంది. సినిమా ఫలితం కోసం ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్న సమయంలో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ‘వైల్డ్ డాగ్’ పైరసీ ప్రింట్ను ఇంటర్నెట్లో పెట్టేయడం కలకలం రేపుతోంది. పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్ సైట్లో ‘వైల్డ్ డాగ్’ లింక్ ఉన్న స్క్రీన్ షాట్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
ఇంకా థియేటర్లలో రిలీజే కాని సినిమాను పైరసీ చేయడమేంటి.. పైకి ‘వైల్డ్ డాగ్’ పేరు పెట్టి ఇంకేదో సినిమా చూపించారేమో అనుకోవడానికి కూడా లేకపోయింది. సినిమాలోని కొన్ని షాట్లకు సంబంధించిన విజువల్స్ తాలూకు స్క్రీన్ షాట్లు కూడా ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. అవి ట్రైలర్లో చూసినవి కూడా కాదు. కొత్తవి.
దీన్ని బట్టి ‘వైల్డ్ డాగ్’ పైరసీ ప్రింట్ ఇంటర్నెట్లోకి వచ్చిన మాట వాస్తవమే అని అర్థమవుతోంది. ఐతే నాగ్ అభిమానులు వెంటనే స్పందించి నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్కు విషయం చేరవేశారు. వాళ్లు అలెర్ట్ అయి పైరసీ వెబ్ సైట్ నుంచి లింక్ తీయించారు. ఎక్కడైనా లింకులు కనిపిస్తే తమకు వెంటనే చెప్పాలని పిలుపునిచ్చారు. ఐతే ఇంకా థియేటర్లలో బొమ్మ పడకుండానే ఈ సినిమా ఎలా ఇంటర్నెట్లోకి వచ్చిందన్నది ప్రశ్నార్థకం. కచ్చితంగా ఇది ఇంటి దొంగల పనే అన్నది స్పష్టం.
‘అత్తారింటికి దారేది’ సినిమా తరహాలోనే ఎవరో చిత్ర బృందంలోని వారే సినిమాను లీక్ చేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై నిర్మాణ సంస్థ పరిశీలనలో ఏం తేలుతుందో చూడాలి. వరుస డిజాస్టర్లతో అల్లాడిపోతున్న నాగార్జునకు ఈ సినిమా హిట్టవడం చాలా అవసరం. ఇలాంటి స్థితిలో సినిమా పైరసీ కావడం ఆయనతో పాటు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసేదే.
This post was last modified on April 1, 2021 1:52 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…