‘బాహుబలి’లో ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాడు ప్రభాస్. ప్రేక్షకులకు కూడా ఆ కొత్త ప్రపంచం అద్భుతంగా అనిపించింది. దానికి అపూర్వ ఆదరణ కట్టబెట్టారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ను మామూలు సినిమాల్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడట్లేదు. అతడితో సినిమాలు ప్లాన్ చేస్తున్న ఫిలిం మేకర్స్ ప్రణాళికలు కూడా భారీగానే ఉంటున్నాయి. ప్రభాస్ లైన్లో పెట్టిన వాటిలో అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఇది ప్రభాస్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందన్న అంచనాలున్నాయి.
ఎందుకంటే ఇందులో ప్రభాస్ చేయబోయేది రాముడి పాత్ర. ఇది రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. ఇప్పుడు రామాయణ గాథను కొత్తగా ఆవిష్కరించేదేముంది అనేవాళ్లు కూడా లేకపోలేదు కానీ.. ఇప్పుడున్న సాంకేతికత ఆధారంగా ఈ పురాగణ గాథను విజువల్ వండర్ లాగా తీర్చిదిద్దాలని దర్శకుడు ఓం రౌత్ భావిస్తున్నాడు.
ఇందుకోసం ప్రపంచ స్థాయి టెక్నీషియన్లను తీసుకున్నాడు. ‘ఆదిపురుష్’కు ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్సే అతి పెద్ద ఆకర్షణ అవుతాయని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఒక కొత్త లోకాన్నే సృష్టిస్తున్నారట. ముంబయిలోని మధ ఐలాండ్లో భారీ ఎత్తున అడవి సెట్ వేశారట. ఇక్కడే సినిమా తొలి షెడ్యూల్ షూట్ చేయబోతున్నారు.
ఈ దీవిలో భారీ ఖర్చుతో అద్భుతమైన సెట్టింగ్స్ రూపుదిద్దుకున్నాయని.. అక్కడికి వెళ్తే ఓ కొత్త లోకంలోకి వెళ్లినట్లే ఉంటుందని.. కీలక సన్నివేశాల చిత్రీకరణ అంతా ఇక్కడే సాగుతుందని.. ఏ రకమైన డిస్టబెన్స్ లేకుండా.. తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూతో ఇక్కడ షూటింగ్ చేయబోతున్నారని సమాచారం. కరోనా నేపథ్యంలో ఏ సమయంలోనైనా 25 మందికి మించి సెట్స్లో లేకుండా స్వీయ పరిమితి విధించుకుని ఇక్కడ చిత్రీకరణ సాగించనున్నారట.
This post was last modified on April 1, 2021 8:45 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…