అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ వకీల్ సాబ్ ట్రైలర్తో పలకరించాడు. పింక్ సినిమాను చెడగొట్టేశారని.. పింక్కు ప్రధాన బలంగా నిలిచిన సమస్య మరుగున పడిపోయిందని ఇన్నాళ్లూ గగ్గోలు పెట్టిన వాళ్లందరూ ట్రైలర్ చూశాక కొంచెం శాంతించే ఉంటారు. ఎందుకంటే ఈ ఒరిజినల్లో కీలకంగా ఉన్న ఎపిసోడ్లన్నీ వకీల్ సాబ్లో కూడా కొనసాగించారని.. ఆ విషయాన్ని పలుచన చేసే ప్రయత్నం ఏదీ జరగలేదని స్పష్టమైంది.
ఇంతకుముందు టీజర్ సహా ప్రోమోలన్నీ కూడా పవన్ చుట్టూనే తిరిగాయి. అమ్మాయిలకు.. కథాంశానికి చోటెక్కడ అన్న ప్రశ్నలు రేకెత్తించాయి. కానీ ట్రైలర్లో మాత్రం పింక్లో కీలకంగా అనిపించిన సన్నివేశాలన్నీ కనిపించాయి. ఈ సినిమా కథాంశాన్ని చెడగొట్టడం లాంటిదేమీ జరగలేదని స్పష్టమైంది.
పింక్లో చూసిందంతా కొనసాగిస్తూనే.. పవన్ ఇమేజ్కు తగ్గ అదనపు ఎపిసోడ్లు సినిమాలో చూడబోతున్నామని స్పష్టమైంది. ఆ అదనపు ఎపిసోడ్ల గురించి ట్రైలర్లో పెద్దగా సంకేతాలు ఇవ్వలేదు. ముఖ్యంగా కొత్తగా చేర్చిన పవన్ ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని సర్ప్రైజ్ లాగా దాచి పెట్టేశారు. శ్రుతి హాసన్కు ట్రైలర్లో అసలు చోటే లేకపోయింది. ఆమె కానీ.. ఆమెతో ముడిపడ్డ చిన్న షాట్ కూడా లేకుండా చూసుకున్నాడు వేణు శ్రీరామ్.
ఇది కొంతమందిని నిరాశ పరిచినా.. అలా సర్ప్రైజ్ లాగా దాచిపెట్టడం మంచిదే అని మిగతా వాళ్లంటున్నారు. కథ పరంగా అది సెకండరీ కాబట్టి దాన్ని ట్రైలర్లో చూపించాల్సిన అవసరం లేదనుకుని కూడా ఉండొచ్చు. పింక్ సినిమాను చెడగొట్టడం లాంటిదేమీ జరగలేదని.. ప్రధానంగా సినిమా ఒరిజినల్ను ఫాలో అయ్యేలాగే ఉంటుందని ట్రైలర్ ద్వారా సంకేతాలిచ్చినట్లున్నారు.
This post was last modified on March 30, 2021 7:28 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…